CM Revanth Reddy: గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించిన “కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకం.. ఉద్యమంలో పాల్గొన్న వారికి గత పదేళ్లలో సరైన గుర్తింపు రాలేదు.. గత పాలనలో రెవెన్యూ ఉద్యోగులపై దోపిడీదారులనే ముద్ర వేశారు.. పంచాయతీ, రెవెన్యూ శాఖ సిబ్బందిని దొంగలుగా చూశారు.. పంచాయతీ, రెవెన్యూ శాఖ సిబ్బంది సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. గత ప్రభుత్వం ధరణి అనే వైరస్ను అంటించింది.. ధరణి ద్వారా భూములు కొల్లగొట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది.. ఆ పాపాలు బయట పడతాయనే వీఆర్వో, వీఆర్ఏలను తొలగించారు.. భూముల లెక్కలు తెలిసిన వీఆర్ఏ, వీఆర్వోలను గత ప్రభుత్వం తొలగించింది.. ధరణి కొరివి దయ్యంలా తయారైందని, అందుకే బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పాం.. దానికి అనుగుణంగానే ధరణిని రద్దు చేశామని సీఎం అన్నారు.
READ ALSO: Ajinkya Rahane: టీమిండియాకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్గా మారతాడు.. ఆసియా కప్ మనదే!
Also Read
- West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
ఎప్పుడైనా విశ్వాసంతో ఉండే కుక్కని చంపాలి అంటే.. పిచ్చిది అని ముద్ర వేయాలని, వాళ్ల దోపిడిని ప్రజల ముందుకు తీసుకెళ్తారని చెప్పి vra, vro కొలవులను తొలగించారని అన్నారు. అలాగే వీఆర్ఏ, వీఆర్ఓలను దోషులుగా చిత్రీకరించారని పేర్కొన్నారు. తాను పాదయాత్ర చేసినప్పుడు ఎవరినీ కదిలించిన ధరణి నుంచి తప్పించాలని కోరినట్లు తెలిపారు. ధరణిని తొలగించడానికి ప్రభుత్వంలో సమర్థుడైన సహచరుడు ఉండాలని భావించినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ శాఖకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సరైన ఎంపిక అని, ఆయన తనను అడగ ముందే రెవెన్యూ, తానే పెద్దలతో మాట్లాడి ఆయనకు రెవెన్యూ శాఖ ఇప్పించినట్లు చెప్పారు. ధరణి ప్రక్షాళన చేయాలి అంటే తనకు సపోర్ట్ మినిస్టర్ ఉండాలని ఆయనను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ధరణి అనే వైరస్ తొలగించాలని భూభారతీ తీసుకొచ్చినట్లు చెప్పారు. సాదా బైనమా కూడా అమలులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఐదారుగురు చెడ గొట్టే వాళ్ళు ఉంటారని, ఇంట్లో ఎలుకలు పడితే ఇల్లు తగలపెడతామా అని సీఎం ప్రశ్నించారు. గత పాలకుల దొంగతనాలు కప్పి పుచ్చుకోవడానికి వీఆర్ఓ, వీఆర్ఏలను తొలగించారని విమర్శించారు.
నెహ్రూ కట్టిన ప్రాజెక్టు ఇంకా చెదరలేదని, గత పాలకులు కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కూలిపోవడానికి కారణం అయిన వాళ్లు వాళ్ల పార్టీని రద్దు చేసుకుంటారా..? అని ప్రశ్నించారు. భూమి మీద ఆధిపత్యం కోసం ఎవరు ప్రయత్నం చేసిన నిలబడలేదని, ధరణి ముసుగులో దోపిడి చేసిన వాళ్లకు ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కొలువుల జాతర మొదలైందని చెప్పారు.
READ ALSO: Hyderabad Ganesh Immersion 2025: గణేష్ నిమజ్జనాలు.. రూట్ మ్యాప్
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..