Sabitha Indra Reddy : యూజీసీ ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉంది
- వీసీల నియామకాలపై అభ్యంతరాలు
- ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉంది
- రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు : సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి యూజీసీ రూపొందించిన ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని విమర్శించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్లో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ ఆదేశాలతో పార్టీ వైఖరిని నిర్ణయించేందుకు అనేక నాయకులు పాల్గొన్నారు.
సబితా మీడియాతో మాట్లాడుతూ, యూజీసీ ప్రతిపాదించిన నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిన గడువు ఈ నెల 30వరకు ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని ఆరోపించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ, “విద్యా శాఖ మంత్రిగా ఆయనకు ఈ అంశంపై సమీక్ష చేసేందుకు సమయం దొరకడంలేదా?” అని ప్రశ్నించారు.
Also Read
- Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
- Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
- Viral Video: భారత్ వస్తున్న నౌకను ఇరాన్ ఎలా సీజ్ చేసిందో చూడండి..
- Islamabad in Lockdown: 10 రోజులుగా లాక్డౌన్లో ఇస్లామాబాద్.. తిట్టిపోస్తున్న పాక్ ప్రజలు..
యూజీసీ ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం వీసీల నియామకాలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తాయని, ఇది రాష్ట్ర హక్కులకు తూట్లు పొడిచేలా ఉందని సబితా అన్నారు. ఇప్పటివరకు సెర్చ్ కమిటీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు వీసీల నియామకాలు జరిగాయని, కానీ కొత్త నిబంధనలతో ఈ ప్రక్రియ పూర్తిగా గవర్నర్ ఆధీనంలోకి మారుతుందని వ్యాఖ్యానించారు.
Oscars 2025 Nominations: ఆస్కార్ నామినేషన్స్ 2025 ప్రకటన.. పూర్తి జాబితా ఇదే..
ఈ మార్పులను బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని సబితా స్పష్టం చేశారు. “రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది, యూజీసీ సిఫారసులను తిరస్కరించాలి,” అని ఆమె పేర్కొన్నారు. మాజీ ఎంపీ వినోద్కుమార్ మాట్లాడుతూ, “యూజీసీ ముసాయిదాపై దాదాపు రెండున్నర గంటలపాటు విస్తృత చర్చ జరిగింది. ముసాయిదాలోని పదకొండు క్లాజుల్లో చాలా వరకు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తించాం. బీఆర్ఎస్ అభిప్రాయాన్ని యూజీసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం,” అని చెప్పారు.
ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, జి.దేవీప్రసాద్, చిరుమళ్ల రాకేశ్కుమార్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. యూజీసీ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ, రాష్ట్ర హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
Komatireddy Venkat Reddy : ఆదిభట్లలో రతన్ టాటా విగ్రహం పెడతాం
తాజావార్తలు
-
Donald Trump: ‘‘బిడ్డను కనడానికే వస్తారు’’.. భారతీయులపై ట్రంప్ అక్కసు..
-
Soft Pink Lips Tips: మీ పెదాలు మృదువుగా.. గులాబీ రంగులో మెరిసిపోయే చిట్కాలు ఇవే..
-
Darling Re-release: రీ-రిలీజ్లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
-
OMG: ఆడుకుంటూ గంగాళంలో ఇరుక్కున్న చిన్నారి.. చివరి ప్రయత్నంలో ఇలా..
-
Trisha : ఇట్స్ అఫీషియల్.. విజయ్’కి వోట్ వేయమని త్రిష హింట్?
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!