Sabitha Indra Reddy : యూజీసీ ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉంది
- వీసీల నియామకాలపై అభ్యంతరాలు
- ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉంది
- రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు : సబితా ఇంద్రారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabitha Indra Reddy : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి యూజీసీ రూపొందించిన ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని విమర్శించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్లో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ ఆదేశాలతో పార్టీ వైఖరిని నిర్ణయించేందుకు అనేక నాయకులు పాల్గొన్నారు.
సబితా మీడియాతో మాట్లాడుతూ, యూజీసీ ప్రతిపాదించిన నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిన గడువు ఈ నెల 30వరకు ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని ఆరోపించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ, “విద్యా శాఖ మంత్రిగా ఆయనకు ఈ అంశంపై సమీక్ష చేసేందుకు సమయం దొరకడంలేదా?” అని ప్రశ్నించారు.
Also Read
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
యూజీసీ ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం వీసీల నియామకాలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తాయని, ఇది రాష్ట్ర హక్కులకు తూట్లు పొడిచేలా ఉందని సబితా అన్నారు. ఇప్పటివరకు సెర్చ్ కమిటీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు వీసీల నియామకాలు జరిగాయని, కానీ కొత్త నిబంధనలతో ఈ ప్రక్రియ పూర్తిగా గవర్నర్ ఆధీనంలోకి మారుతుందని వ్యాఖ్యానించారు.
Oscars 2025 Nominations: ఆస్కార్ నామినేషన్స్ 2025 ప్రకటన.. పూర్తి జాబితా ఇదే..
ఈ మార్పులను బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని సబితా స్పష్టం చేశారు. “రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది, యూజీసీ సిఫారసులను తిరస్కరించాలి,” అని ఆమె పేర్కొన్నారు. మాజీ ఎంపీ వినోద్కుమార్ మాట్లాడుతూ, “యూజీసీ ముసాయిదాపై దాదాపు రెండున్నర గంటలపాటు విస్తృత చర్చ జరిగింది. ముసాయిదాలోని పదకొండు క్లాజుల్లో చాలా వరకు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తించాం. బీఆర్ఎస్ అభిప్రాయాన్ని యూజీసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం,” అని చెప్పారు.
ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, జి.దేవీప్రసాద్, చిరుమళ్ల రాకేశ్కుమార్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. యూజీసీ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ, రాష్ట్ర హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
Komatireddy Venkat Reddy : ఆదిభట్లలో రతన్ టాటా విగ్రహం పెడతాం
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!