Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ugadi Celebrations In Swarna Bharat Trust

Ugadi 2024: స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Published Date :April 9, 2024 , 11:33 am
By Mahesh Jakki
Ugadi 2024: స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ugadi 2024: ముచ్చింతల్‌లో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘ఉగాది సంబరం’ పేరుతో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ అందరికి క్రోది నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో వెంకయ్య నాయుడు ముందుంటారని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని శక్తివంతం చేయడంలో వెంకయ్య నాయుడు ప్రముఖ పాత్ర పోషించారన్నారు. దేశం 5వ శాంతివంతమైన ఆర్థిక శక్తిగా ఉందని.. దేశం మరింతగా ముందుకు వెళ్తుందన్నారు. పంచాంగాన్ని మన పూర్వీకులు మనకు ఇచ్చారన్నారు. పంచాంగం ఆధారంగానే దేశంలో పండగలను, కార్యక్రమాలను జరుపుకుంటామని.. వేరే భాషలు మాట్లాడుతున్నప్పటికి మనదంతా ఒకటే ధర్మమని గవర్నర్ తెలిపారు. తెలుగుకు ఉన్న ప్రాముఖ్యత చెప్పలేనిదన్నారు. మనది దృఢమైన సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన దేశమని తెలిపారు. గతంలో తమిళనాడులో పార్టీ ఎలా ముందుకు వెళ్లాల్లో వెంకయ్య సూచించారని.. పార్టీలు వెళ్తున్న తీరును వెంకయ్య నాయుడు గమనిస్తారన్నారు.

Read Also: Youtube: ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు.. 2.25 మిలియన్ వీడియోలు తొలగింపు

Also Read

  • Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
  • Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్‌తో గొడవ ఏంటి?
  • Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
  • Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్‌కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!

ఉగాది శుభాకాంక్షలు: కిషన్‌ రెడ్డి
రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదిలో అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. మంచి వర్షాలు పడి, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. తెలంగాణతో పాటు దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు.

2027 నాటికి మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్ : వెంకయ్యనాయుడు
ఈ ఉగాది నాడు భారత్‌ను సూపర్ పవర్‌గా తయారు చేయాలనే సంకల్పాన్ని తీసుకుందామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలకు సూచించారు. దేశం సూపర్ పవర్‌గా ఎదుగుతుందన్నారు. సూపర్ పవర్‌గా ఉన్న అమెరికా లాగా మనం ముందుకు వెళ్తున్నామన్నారు. వేషం, భాషా వేరైన మనమంతా భారతీయులం.. దేశాన్ని ముందుకు తీసుకెళ్దామన్నారు. 2014లో ఆర్థికంగా పదవ స్థానంలో ఉన్న భారత్.. నేడు ఐదో స్థానానికి చేరిందన్నారు. 2027 నాటికి మూడో ఆర్ధిక వ్యవస్థగా దేశం చేరనుందన్నారు. అన్ని వ్యవస్థలను ప్రజలను అందుబాటులోకి ఉంచేలా ప్రధాని మోడీ చేశారన్నారు. దేశాన్ని ముందుకు నడపడంలో ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. గతాన్ని గుర్తుకు పెట్టుకుని.. వర్తమానంలో ముందుకు నడవాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోపేరుతో ఉగాదిని పిలుచుకుని.. జరుపుకుంటారని ఆయన తెలిపారు. మతం, భాష వేరైనా మనమంతా భారతీయులమన్నారు. కులం, మతం పేరుతో విడదీయరాదని.. ఉగాది వెనుక సంప్రదాయమే కాదు ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయన్నారు. క్రమ శిక్షణ, కష్టపడి పని చేయడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను.. రెండో అత్యన్నత పదవికి చేరుకున్నానన్నారు. నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CP Radhakrishnan
  • Kishan Reddy
  • Swarna Bharat Trust
  • telugu news
  • Ugadi 2024

తాజావార్తలు

  • NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే

  • Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..

  • OTT Movies : ఈ వారం ఓటీటీ క్లాష్‌లో ఎవరు టాప్‌లో నిలుస్తారు?

  • Donald Trump: 14-సూత్రాల ప్లాన్‌తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?

  • Dubbing Movies : అర్థంకాని టైటిల్స్‌ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions