Hyderabad: గచ్చిబౌలి పరిధిలో ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
- గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం
- ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- నిన్న రాత్రి రెండు గంటల సమయంలో డివైడర్ ను బైక్ ఢీ కొట్టిన బైక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి రెండు గంటల సమయంలో డివైడర్ ను బైక్ ఢీ కొట్టింది. ఇద్దరు యువకులు త్రిబుల్ ఐటీ చౌరస్తా నుంచి విప్రో సర్కిల్ వైపు బైక్ లో వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో బైక్ నడుపుతూ.. డివైడర్ ను ఢీ కొట్టారు. దీంతో ఇద్దరు యువకులు స్పాట్ లోనే మృతి చెందారు. మృతులు అమెజాన్ లో పనిచేస్తున్న వైజాగ్ కు చెందిన దేవరకుమార్ స్వామి (25) గాజులరామారంలో నివాసం ఉంటున్న వేంకన్న స్వామి (30)గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు గచ్చిబౌలి పోలీసులు.
READ MORE: Amit Shah: అమిత్షా హెలికాప్టర్ను తనిఖీ చేసిన ఎన్నికల సంఘం అధికారులు (వీడియో)
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కాగా.. ఇండియాలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుందే తప్పా.. ఏమాత్రం తగ్గడం లేదు. సరైన ట్రాఫిక్ష్ రూల్స్ పాటించకపోవడం, నిర్లక్స్యంగా వ్యవహరించడం కారణంగా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మగవాళ్లే చనిపోతున్నారు. వారిలో విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే బెంగళూరు నగరంలో 2023లో మొత్తం 913 ప్రమాదాలు జరగ్గా, 883 మంది మరణించారు. 2022 కంటే 2023లో ప్రమాదాలు 17 నుంచి 18 శాతం ఎక్కువ. 2022లో రోడ్డు ప్రమాదాల్లో 770 మంది మరణించారు. వారిలో 393 మంది 21-40 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు ఉన్నారు. గత ఏడాది బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువ మంది పురుషులేనని, వారిలో ఎక్కువ మంది విద్యార్థులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పని చేసే వయసులో ఉన్నవారేనని డెక్కన్ హెరాల్డ్ అనే ప్రైవేట్ వార్తా సంస్థ వెల్లడించింది. హెల్మెట్ ధరించకపోవడం, అతివేగంగా నడపడం వల్లే ప్రమాదానికి కారణమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే సిటీలో జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. అదేవిధంగా వాహనాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!