Love: ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతులు.. భర్తను వదిలేసి మరీ జంప్…
- రాజస్థాన్లో వెలుగులోకి వచ్చిన ఈ వింత ప్రేమకథ
- గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతులు
- భర్త, తల్లిదండ్రులను సైతం వదిలేసిన యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో ఒక ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఇక్కడ ప్రేమించుకున్న యువతి, యువకుడు కాదు.. ఇద్దరు యువతులు కలిసి గాఢంగా ప్రేమించుకున్నారు. ఝుంఝును జిల్లాలోని మెయిన్పురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి 15 రోజులు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పటికీ వారిద్దరూ ఝుంఝునులోని మెయిన్పురా గ్రామంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇద్దరిలో ఓ యువతికి పెళ్లి సైతం జరిగింది. ఆమె తన భర్తను వదిలేసి స్నేహితురాలి వద్దకు వెళ్లడం గమనార్హం.
READ MORE: Emotional Video: తొక్కిసలాటలో కుమారుడు మృతి.. కొడుకు సమాధిపై పడి బోరున విలపించిన తండ్రి(వీడియో)
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఝుంఝునులోని మెయిన్పురా గ్రామానికి చెందిన రేణు(25), అంజు(23)లు 7-8 నెలల క్రితం బంధువుల వివాహంలో కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు స్నేహితులయ్యారు. తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంజు వివరన ప్రకారం.. వారిద్దరూ ఇప్పుడు కలిసి జీవించాలనుకుంటున్నారు. అనంతరం వివాహం కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రేణు 5వ తరగతి, అంజు 12వ తరగతి వరకు చదువుకుంది. ఇందులో రేణుకు 5 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. కానీ ఆమె తన భర్తను, తల్లిదండ్రులను వదిలేసి మరీ అంజుతో పారిపోయింది.
అయితే.. రేణు కుటుంబీకులు 10 రోజుల క్రితం గోత్రా పోలీస్ స్టేషన్లో తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అంజుతో కలిసి పారిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని కనుగొన్న పోలీసులు.. ఇష్టపూర్వకంగా కలిసి జీవిస్తున్నారని చెప్పడంతో ఏం చేయలేక పోయారు. ఈ అంశంపై గుధాగౌర్జీ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిషన్ మాట్లాడుతూ.. “జూన్ 4న రేణు అత్తమామలు పోలీస్ స్టేషన్కు వచ్చారు. పోలీసులు అంజు ఇంటికి చేరుకున్నారు. కానీ రేణు తన అత్తమామల ఇంటికి లేదా ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడానికి నిరాకరించింది. ఇద్దరు అమ్మాయిలు మేజర్లు. ఇష్టానుసారం కలిసి జీవించాలనుకుంటున్నారు. చట్టం ఇందులో జోక్యం చేసుకోదు.” అని స్పష్టం చేశారు. రేణు 5వ తరగతి వరకు చదువుకుంది, అంజు 12వ తరగతి వరకు చదువుకుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!