Love: ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతులు.. భర్తను వదిలేసి మరీ జంప్…
- రాజస్థాన్లో వెలుగులోకి వచ్చిన ఈ వింత ప్రేమకథ
- గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతులు
- భర్త, తల్లిదండ్రులను సైతం వదిలేసిన యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో ఒక ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఇక్కడ ప్రేమించుకున్న యువతి, యువకుడు కాదు.. ఇద్దరు యువతులు కలిసి గాఢంగా ప్రేమించుకున్నారు. ఝుంఝును జిల్లాలోని మెయిన్పురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి 15 రోజులు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పటికీ వారిద్దరూ ఝుంఝునులోని మెయిన్పురా గ్రామంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇద్దరిలో ఓ యువతికి పెళ్లి సైతం జరిగింది. ఆమె తన భర్తను వదిలేసి స్నేహితురాలి వద్దకు వెళ్లడం గమనార్హం.
READ MORE: Emotional Video: తొక్కిసలాటలో కుమారుడు మృతి.. కొడుకు సమాధిపై పడి బోరున విలపించిన తండ్రి(వీడియో)
Also Read
- AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
- The Paradise: సెకండ్ సింగిల్.. "యేష నాగుల" లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
- Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఝుంఝునులోని మెయిన్పురా గ్రామానికి చెందిన రేణు(25), అంజు(23)లు 7-8 నెలల క్రితం బంధువుల వివాహంలో కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు స్నేహితులయ్యారు. తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంజు వివరన ప్రకారం.. వారిద్దరూ ఇప్పుడు కలిసి జీవించాలనుకుంటున్నారు. అనంతరం వివాహం కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రేణు 5వ తరగతి, అంజు 12వ తరగతి వరకు చదువుకుంది. ఇందులో రేణుకు 5 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. కానీ ఆమె తన భర్తను, తల్లిదండ్రులను వదిలేసి మరీ అంజుతో పారిపోయింది.
అయితే.. రేణు కుటుంబీకులు 10 రోజుల క్రితం గోత్రా పోలీస్ స్టేషన్లో తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అంజుతో కలిసి పారిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని కనుగొన్న పోలీసులు.. ఇష్టపూర్వకంగా కలిసి జీవిస్తున్నారని చెప్పడంతో ఏం చేయలేక పోయారు. ఈ అంశంపై గుధాగౌర్జీ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిషన్ మాట్లాడుతూ.. “జూన్ 4న రేణు అత్తమామలు పోలీస్ స్టేషన్కు వచ్చారు. పోలీసులు అంజు ఇంటికి చేరుకున్నారు. కానీ రేణు తన అత్తమామల ఇంటికి లేదా ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడానికి నిరాకరించింది. ఇద్దరు అమ్మాయిలు మేజర్లు. ఇష్టానుసారం కలిసి జీవించాలనుకుంటున్నారు. చట్టం ఇందులో జోక్యం చేసుకోదు.” అని స్పష్టం చేశారు. రేణు 5వ తరగతి వరకు చదువుకుంది, అంజు 12వ తరగతి వరకు చదువుకుంది.
తాజావార్తలు
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
-
The Paradise: సెకండ్ సింగిల్.. “యేష నాగుల” లైవ్గా పాడిన అనిరుధ్.. మాస్ స్టెప్స్తో అదరగొట్టిన నాని.!
-
Anaya Bangar: ‘వ్యతిరేకించే ముందు తెలుసుకోండి’.. సౌతాఫ్రికా ఆల్రౌండర్కు ఘాటుగా బదులిచ్చిన అనయా బంగర్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!