Love: ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతులు.. భర్తను వదిలేసి మరీ జంప్…
- రాజస్థాన్లో వెలుగులోకి వచ్చిన ఈ వింత ప్రేమకథ
- గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతులు
- భర్త, తల్లిదండ్రులను సైతం వదిలేసిన యువతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో ఒక ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. ఇక్కడ ప్రేమించుకున్న యువతి, యువకుడు కాదు.. ఇద్దరు యువతులు కలిసి గాఢంగా ప్రేమించుకున్నారు. ఝుంఝును జిల్లాలోని మెయిన్పురా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లి 15 రోజులు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇప్పటికీ వారిద్దరూ ఝుంఝునులోని మెయిన్పురా గ్రామంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇద్దరిలో ఓ యువతికి పెళ్లి సైతం జరిగింది. ఆమె తన భర్తను వదిలేసి స్నేహితురాలి వద్దకు వెళ్లడం గమనార్హం.
READ MORE: Emotional Video: తొక్కిసలాటలో కుమారుడు మృతి.. కొడుకు సమాధిపై పడి బోరున విలపించిన తండ్రి(వీడియో)
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
- NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
- RCB Player: ‘ఆర్సీబీకి ఆడాలని నాకు లేదు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్..
ఝుంఝునులోని మెయిన్పురా గ్రామానికి చెందిన రేణు(25), అంజు(23)లు 7-8 నెలల క్రితం బంధువుల వివాహంలో కలుసుకున్నారు. అప్పటి నుంచి వారు స్నేహితులయ్యారు. తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. అంజు వివరన ప్రకారం.. వారిద్దరూ ఇప్పుడు కలిసి జీవించాలనుకుంటున్నారు. అనంతరం వివాహం కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రేణు 5వ తరగతి, అంజు 12వ తరగతి వరకు చదువుకుంది. ఇందులో రేణుకు 5 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. కానీ ఆమె తన భర్తను, తల్లిదండ్రులను వదిలేసి మరీ అంజుతో పారిపోయింది.
అయితే.. రేణు కుటుంబీకులు 10 రోజుల క్రితం గోత్రా పోలీస్ స్టేషన్లో తమ కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. అంజుతో కలిసి పారిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని కనుగొన్న పోలీసులు.. ఇష్టపూర్వకంగా కలిసి జీవిస్తున్నారని చెప్పడంతో ఏం చేయలేక పోయారు. ఈ అంశంపై గుధాగౌర్జీ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిషన్ మాట్లాడుతూ.. “జూన్ 4న రేణు అత్తమామలు పోలీస్ స్టేషన్కు వచ్చారు. పోలీసులు అంజు ఇంటికి చేరుకున్నారు. కానీ రేణు తన అత్తమామల ఇంటికి లేదా ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడానికి నిరాకరించింది. ఇద్దరు అమ్మాయిలు మేజర్లు. ఇష్టానుసారం కలిసి జీవించాలనుకుంటున్నారు. చట్టం ఇందులో జోక్యం చేసుకోదు.” అని స్పష్టం చేశారు. రేణు 5వ తరగతి వరకు చదువుకుంది, అంజు 12వ తరగతి వరకు చదువుకుంది.
తాజావార్తలు
-
Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
-
CIBIL Score New Rules: మారిన సిబిల్ స్కోర్ రూల్స్.. తక్కువ సిబిల్ ఉంటే రుణం దొరకదా? అసలు నిజం ఏంటి?
-
NBK 111: ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు: తమన్
-
Chairman’s Desk : కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా గేమ్ ఛేంజరా?
-
NEET: దమ్ముంటే ఇప్పుడు లీక్ చేయండి.. నీట్ పరీక్ష కోసం రంగంలోకి ఇండియన్ ఎయిర్ఫోర్స్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!