Woman DeadBodies Found in Cupboard: ఆల్మారాలో కూతురు.. మంచం కింద తల్లి డెడ్ బాడీలు.. గుజరాత్ ఆస్పత్రిలో దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman DeadBodies Found in Cupboard: గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రికి వైద్యానికి వచ్చిన తల్లీకూతుళ్లు.. దారుణమైన స్థితిలో విగతజీవులుగా కనిపించారు. ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ థియేటర్లోని ఆల్మారాలో కూతురు మృతదేహం లభ్యమైందని, ఆపై మంచం కింద తల్లి మృతదేహాన్ని గుర్తించామని కాగ్డాపీఠ్ పోలీసులు చెబుతున్నారు.
Also Read : Rajasthan Woman Gave Birth For Triplets : ఒక్కరి కోసం ట్రై చేస్తే ఏకంగా ముగ్గురూ మొనగాళ్లే
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
అహ్మదాబాద్లోని భులాభాయ్ పార్క్ సమీపంలోని ఆసుపత్రిలో తల్లీ, కూతురు మృతదేహాలు లభించడం కలకలం రేపింది. ఓ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లోని అల్మారాలో కూతురి మృతదేహం, మంచం కింద తల్లి మృతదేహం లభ్యమైంది. చికిత్స నిమిత్తం తల్లీ, కూతురు ఆస్పత్రికి వచ్చినట్లు ఏసీపీ మిలాప్ పటేల్ బుధవారం విలేకరులకు తెలిపారు. మొదట కుమార్తె మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. ఆమెతోపాటు వచ్చిన తల్లి ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. పోలీసులు విచారణలో భాగంగా ఆస్పత్రిలో గాలించగా తల్లి మృతదేహాన్ని కూడా గుర్తించారు. దీనికి సంబంధించి ఆస్పత్రిలో పనిచేస్తున్న మన్సుఖ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Forest Officials Seize Deers : కాంగ్రెస్ నేత ఫాంహౌస్ లో జింకలు, అడవిపందులు
అహ్మదాబాద్లోని కాగ్డాపిత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూలాభాయ్ పార్క్ సమీపంలో ఉన్న ఆసుపత్రిలో తీవ్రమైనదుర్వాసన వస్తుండడంతో.. ఆస్పత్రి సిబ్బంది ఎక్కడినుంచి వస్తుందా అని వెతకడం ప్రారంభించారు. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లోని అల్మారా నుంచి దుర్వాసన వస్తుందని గమనించి.. ఆస్పత్రి సిబ్బంది తెరిచి చూశారు. అల్మారా లోపల 30 ఏళ్ల మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో షాక్ అయిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీస్స్టేషన్ సిబ్బంది ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత హత్యగా అనుమానించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే 30యేళ్ల మహిళ తల్లి మృతదేహాన్ని ఆస్పత్రి మంచం కింద కనిపెట్టారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..