Crime News: నుదుటిపై తిలకం చూసి హత్య.. ఇద్దరు ఉగ్రవాదులకు మరణశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్లో రిటైర్డ్ టీచర్ రమేష్ బాబు శుక్లా హత్య కేసులో శిక్ష పడింది. రిటైర్డ్ ప్రిన్సిపల్ రమేష్ బాబు శుక్లా నుదుటిపై తిలకం, చేతికున్న కంకణాన్ని చూసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ హత్య ఉదంతంపై అక్టోబర్ 2016న ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే తాజాగా.. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీవ్రవాదులు అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైజల్లకు మరణశిక్ష విధించింది. విచారణలో ఉపాధ్యాయుడిపై పిస్టల్ తో కాల్చి హత్య చేసినట్లు రుజువైంది. చేతికి కంకణం, నుదుటిపై తిలకం ఉండటంతో.. హిందూ గుర్తింపుగా భావించి హత్య చేశారు. ISIS జిహాదీ ఆలోచనను చూపించడానికి ఈ హత్య జరిగింది.
Read Also: Minister Roja: టీడీపీ-జనసేన పొత్తు.. మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్..
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
మరోవైపు అతిఫ్ ముజఫర్, ఫైసల్లకు ఇప్పటికే మరొక కేసులో మరణశిక్ష విధించారు. ఏటీఎస్తో జరిగిన ఎన్కౌంటర్లో సైఫుల్లా హతమయ్యాడు. ఇదిలా ఉంటే.. సోమవారం NIA కోర్టు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగర్లో నివసిస్తున్న నిందితుడు అతిఫ్ ముజఫర్పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 34, 120B సెక్షన్ 302, సెక్షన్ 16(1)(A), UA(P)లోని 18 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మహ్మద్ ఫైసల్ ఖాన్ పై సెక్షన్ 3, 25, 27 కింద కేసు నమోదు చేసి దోషిగా నిర్ధారించారు.
Read Also: Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..
నిందితులిద్దరిపై 2018 జూలై 12న చార్జిషీటు దాఖలు చేశారు. అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైసల్ ఖాన్లు ఐఎస్ఐఎస్ భావజాలానికి తీవ్ర మద్దతుదారులని ఈ ఛార్జ్ షీట్లో పేర్కొంది. వారి ఏకైక లక్ష్యం ప్రజలను చంపడం, ఇతర మతాల ప్రజలను అవిశ్వాసులుగా పరిగణించడం. 2017 మార్చి 7న మూడవ నిందితుడు మహ్మద్ సైఫుల్లా ATS UPతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. 2016న కాన్పూర్లోని ప్యోండి గ్రామంలో పిస్టల్ పనిచేస్తుందా లేదా అని తనిఖీ చేసేందుకు ఉగ్రవాదులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామ్ బాబు శుక్లాపై కాల్పులు జరిపారు. ముస్లిమేతరులపై తీవ్రవాద హింసాకాండకు పాల్పడి వారిని చంపి తమ ఛాందసవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యం.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!