Crime News: నుదుటిపై తిలకం చూసి హత్య.. ఇద్దరు ఉగ్రవాదులకు మరణశిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్లో రిటైర్డ్ టీచర్ రమేష్ బాబు శుక్లా హత్య కేసులో శిక్ష పడింది. రిటైర్డ్ ప్రిన్సిపల్ రమేష్ బాబు శుక్లా నుదుటిపై తిలకం, చేతికున్న కంకణాన్ని చూసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ హత్య ఉదంతంపై అక్టోబర్ 2016న ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే తాజాగా.. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీవ్రవాదులు అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైజల్లకు మరణశిక్ష విధించింది. విచారణలో ఉపాధ్యాయుడిపై పిస్టల్ తో కాల్చి హత్య చేసినట్లు రుజువైంది. చేతికి కంకణం, నుదుటిపై తిలకం ఉండటంతో.. హిందూ గుర్తింపుగా భావించి హత్య చేశారు. ISIS జిహాదీ ఆలోచనను చూపించడానికి ఈ హత్య జరిగింది.
Read Also: Minister Roja: టీడీపీ-జనసేన పొత్తు.. మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్..
Also Read
మరోవైపు అతిఫ్ ముజఫర్, ఫైసల్లకు ఇప్పటికే మరొక కేసులో మరణశిక్ష విధించారు. ఏటీఎస్తో జరిగిన ఎన్కౌంటర్లో సైఫుల్లా హతమయ్యాడు. ఇదిలా ఉంటే.. సోమవారం NIA కోర్టు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగర్లో నివసిస్తున్న నిందితుడు అతిఫ్ ముజఫర్పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 34, 120B సెక్షన్ 302, సెక్షన్ 16(1)(A), UA(P)లోని 18 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మహ్మద్ ఫైసల్ ఖాన్ పై సెక్షన్ 3, 25, 27 కింద కేసు నమోదు చేసి దోషిగా నిర్ధారించారు.
Read Also: Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. ఆ ప్లేయర్ వచ్చేస్తున్నాడు..
నిందితులిద్దరిపై 2018 జూలై 12న చార్జిషీటు దాఖలు చేశారు. అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైసల్ ఖాన్లు ఐఎస్ఐఎస్ భావజాలానికి తీవ్ర మద్దతుదారులని ఈ ఛార్జ్ షీట్లో పేర్కొంది. వారి ఏకైక లక్ష్యం ప్రజలను చంపడం, ఇతర మతాల ప్రజలను అవిశ్వాసులుగా పరిగణించడం. 2017 మార్చి 7న మూడవ నిందితుడు మహ్మద్ సైఫుల్లా ATS UPతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. 2016న కాన్పూర్లోని ప్యోండి గ్రామంలో పిస్టల్ పనిచేస్తుందా లేదా అని తనిఖీ చేసేందుకు ఉగ్రవాదులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామ్ బాబు శుక్లాపై కాల్పులు జరిపారు. ముస్లిమేతరులపై తీవ్రవాద హింసాకాండకు పాల్పడి వారిని చంపి తమ ఛాందసవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యం.
తాజావార్తలు
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?