Rajasthan: పేపర్ లీక్ కేసులో ఈడీ పట్టు.. ఇద్దరు RPSC అధికారులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ పేపర్ లీక్ కేసులో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. రాజస్థాన్ పబ్లిక్ కమిషన్ సభ్యులు అనిల్ కుమార్ మీనా, బాబులాల్ కటారాలను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. మూడు రోజుల పాటు ఈడీ కస్టడీ కోరింది. రాజస్థాన్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో రాజస్థాన్ పోలీసులు చార్ట్ షీట్ కూడా దాఖలు చేశారు. దీంతో వారిని మరింత లోతుగా విచారించనుంది ఈడీ.
Read Also: CM KCR: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
Also Read
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
- One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
ఈడీ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబరు 21, 24 తేదీల మధ్య సీనియర్ టీచర్ గ్రేడ్-ఎల్ రిక్రూట్మెంట్ కోసం ఆర్పీఎస్సి పరీక్షను నిర్వహించిందని ఈడీ దర్యాప్తులో తేలింది. ఇందులో సాధారణ పేపర్ లీక్ కేసులో రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కటారా పేపర్ను లీక్ చేసి మీనాకు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ పేపర్లను అభ్యర్థులకు రూ. 8-10 లక్షలకు విక్రయించారని ఈడీ పేర్కొంది. అంతకుముందు 2023 జూన్ 5న.. ఈడీ 15 చోట్ల దాడులు చేసి అనేక పత్రాలు, డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకుంది. అంతే కాకుండా.. బాబూలాల్ కటారా, అనిల్ కుమార్ మీనాకు చెందిన సుమారు రూ. 3.11 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.
Read Also: Puri Temple: పూరీ ఆలయంలో నిలిచిపోయిన స్వామి వారి సేవలు.. కారణమేంటంటే..?
రాజస్థాన్ పేపర్ లీక్ కేసులో రాజకీయం మరింత హీటెక్కింది. ఈ విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శల దాడికి దిగుతుంది. మరోవైపు కాంగ్రెస్ నేత అలోక్ శర్మ మాట్లాడుతూ.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని అన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!