Twitter: రోజుకు 600ట్వీట్లు మాత్రమే చదవగలరు.. ఎలాన్ మస్క్ కొత్త రూల్
Twitter: ఎలోన్ మస్క్ ట్విట్టర్ని కొత్త ల్యాబ్గా మార్చారు. రోజుకో కొత్త రూల్ పెట్టి ప్రయోగాలు చేస్తున్నారు. బ్యాకెండ్లో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. దీని కారణంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎలోన్ మస్క్ శనివారం మాట్లాడుతూ.. ఒక రోజులో ఎవరు ఎన్ని పోస్ట్లను చదవవచ్చనే దానిపై తాత్కాలిక పరిమితులను అమలు చేసినట్లు చెప్పారు. సిస్టమ్ డేటా స్క్రాపింగ్, తారుమారుని నిరోధించడానికి ఇది తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎలోన్ మస్క్ కొత్త ఆర్డర్ ప్రకారం.. వెరిఫై చేయబడిన ఖాతా నుండి ప్రతిరోజూ సుమారు 6,000 పోస్ట్లను చదవవచ్చు, అయితే ధృవీకరించబడని ఖాతా నుండి ప్రతిరోజూ 600 పోస్ట్లను చదవవచ్చు. కొత్త ధృవీకరించని ఖాతాల నుండి 300 పోస్ట్లను మాత్రమే చదవగలరు. ఎలోన్ మస్క్ ట్వీట్ చేస్తూ, ‘డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ను నిరోధించడానికి, మేము అనేక తాత్కాలిక పరిమితులను అమలు చేసాం.’ అని పేర్కొన్నారు.
Read Also:Andhra Pradesh: మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసిన దుర్మారుడు.. దిశ టీమ్ ఎంట్రీ తో..
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
To address extreme levels of data scraping & system manipulation, we’ve applied the following temporary limits:
– Verified accounts are limited to reading 6000 posts/day
– Unverified accounts to 600 posts/day
– New unverified accounts to 300/day— Elon Musk (@elonmusk) July 1, 2023
ఈ చర్య ఎందుకు తీసుకున్నాడు?
ట్విట్టర్లోని సాంకేతిక లోపాలను క్లీన్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇది ప్రజలకు నచ్చకపోవచ్చు. మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ప్రపంచవ్యాప్త అంతరాయంతో పోరాడుతోంది. వేలాది మంది వినియోగదారులు ట్విట్టర్ని ఉపయోగించలేకపోయారు. అవుట్టేజ్ మానిటర్ వెబ్సైట్ ‘డౌన్ డిటెక్టర్’ ప్రకారం.. 7,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ట్విట్టర్లో సాంకేతిక లోపాలను నివేదించారు.
ట్రోలింగ్ బారిన ఎలోన్ మస్క్
ఒక ట్విట్టర్ వినియోగదారుడు, ‘ఎవరైనా అలాన్ మస్క్ ని నిద్రలేపి అతని 44 బిలియన్ డాలర్ల యాప్ పనిచేయడం లేదని చెప్పండి’ అని పోస్ట్ చేశాడు. మరో వినియోగదారు ‘ట్విటర్లో రేట్లిమిట్ మించిపోయింది’ #TwitterDown ఎందుకు చెబుతుందో చూడటానికి నేను వస్తున్నాను.’ #TwitterDown, #RateLimitExceeded అనే హ్యాష్ట్యాగ్లు ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉన్నాయి. శనివారం, ట్విట్టర్ ఖాతాలు లేని వ్యక్తుల కోసం దాని వెబ్ ప్లాట్ఫారమ్కు బ్రౌజింగ్ యాక్సెస్ను బ్లాక్ చేసింది. ఎందుకంటే డేటా స్క్రాపింగ్ పెరిగిందని ఎలోన్ మస్క్ చెప్పారు. స్టార్టప్ల నుండి ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద కంపెనీల వరకు AI పని చేస్తున్న దాదాపు ప్రతి కంపెనీ భారీ మొత్తంలో డేటాను స్క్రాప్ చేస్తోందన్నారు.
Read Also:Kishan Reddy : తెలంగాణ ప్రజల భవిష్యత్ కల్వకుంట్ల కుటుంబం డైనింగ్ టేబుల్ మీద డిసైడ్ అవుతుంది
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!