Crime: యూసుఫ్ గూడ మర్డర్ కేసులో ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yusuf Guda: హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. యూసుఫ్ గూడలోని లక్ష్మీనరసింహనగర్ లో అర్ధరాత్రి హత్య జరిగింది. పాలమూరుకు చెందిన సింగోటం రాము అనే వ్యక్తి మర్మాంగాలతో పాటు గొంతు కోసి అతి కిరాతకంగా మర్డర్ చేశారు. అయితే, రాత్రి 11 గంటల టైంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి హత్య చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. సంఘటన స్థలాన్ని డీసీపీకృష్ణ చైతన్య, జూబ్లీ హిల్స్ ఏసీపీ పరిశీలించారు. పాత కక్షల కారణంగా హత్య చేశారా లేక వివాహేతర సంబంధమే కారణమా అని పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ ‘బ్లాక్ పేపర్’ను దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని మోడీ
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అయితే, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కు చెందిన సింగోటం రాము రియల్ ఎస్టేట్ వ్యాపారి. రాజకీయాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొంటారు. పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయా? అనే ఉద్దేశంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం బోరబండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ తో సహా ఐదుగురు నిందితులు పోలీసులు ముందు లొంగిపోయారు. వారిని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారు.
Read Also: Tax Distribution : పన్ను పంపిణీలో కర్ణాటకకు రూ.13 ఇస్తే.. యూపీకి మాత్రం రూ.333 ఎందుకిస్తున్నారు?
ఇక, జూబ్లీ హిల్స్ మర్డర్ కేసులో హనీ ట్రాప్ కోణం వెలుగులోకి వచ్చింది. యువతితో కాల్ చేయించి సింగోటం రామును యూసుఫ్ గూడాకు మణీ గ్యాంగ్ పిలిపించింది. అతడు రాగానే వలపని హత్య చేసింది. అయితే, గత కొంతకాలం నుంచి యువతితో రాముకు పరిచయం ఉంది.. దీంతో రామును దారుణంగా చంపేసి అక్కడి నుంచి మణీ గ్యాంగ్ పారిపోయిందని పోలీసులు తెలిపారు. రాముని చంపి ఫ్లాట్లో పెట్టామని కుటుంబ సభ్యులకు రౌడీ షీటర్స్ సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రాము మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే మణీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!