Breaking News : విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. ఈఆర్సీ కీలక నిర్ణయం..
విద్యుత్ వినియోగదారులకు ఈఆర్సీ శుభవార్త చెప్పింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంకు విద్యుత్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను ఆమోదించిన ఈఆర్సీ.. విద్యుత్ వినియోగదారులకు భారం లేకుండా నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా.. తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు మాట్లాడుతూ.. కస్టమర్ ఛార్జీలలో మార్పు లేదని ఆయన వెల్లడించారు. డిస్కంల నష్టం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సబ్సిడీ, ఇరిగేషన్, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన సబ్సిడీని డిస్కంలకు భారం పడకుండా రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం డిస్కంలకు రూ. 12,718.40 కోట్ల ట్రూ-అప్ ఛార్జీలు చెల్లించాలని నిర్ణయించిందని, దీనికి ఈ రోజు విద్యుత్ నియంత్రణ మండలి (ERC) ఆమోదించబడిందని ఆయన వెల్లడించారు. ట్రూ-అప్ ఛార్జీలు గత 15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు.
Also Read : Airtel 5G Plus service: 500 నగరాల్లో 5G సేవలు.. డైలీ డేటా అన్లిమిటెడ్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
అయితే.. గత సంవత్సరం.. విద్యుత్ చార్జీలు 19 శాతం పెంచాలని డిస్కంలు ప్రతిపాదించగా 14 శాతం పెంచేందుకు కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ చార్జీల యూనిట్కి 40 పైసల నుంచి 50 పైసల వరకూ.. ఇతర వినియోగదారులకు యూనిట్కి రూపాయి చొప్పున చార్జీల మోత మోగింది. అలాగే డొమెస్టిక్ వినియోగదారులపై కొత్తగా ఫిక్స్డ్/ కస్టమర్ చార్జీలు విధించగా.. ఇతర వినియోగదారులపై కూడా అప్పటికే ఉన్న చార్జీలు పెరిగాయి. అయితే.. ఈ గతేడాదిలాగే ఈ ఏడాది కూడా విద్యుత్ చార్జీల మోత తప్పదని అందరూ భావిస్తుండగా.. ఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకోవడం.. ప్రజలపై కొంత భారం తప్పుతుందని అంటున్నారు.
Also Read : Kolkata Knight Riders: కోల్కతా నైట్ రైడర్స్కి ఊహించని షాక్.. ఆ ఇద్దరు ఔట్?
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో