TS Govt Chief Whip Vinay Bhaskar : అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమకొండ జిల్లా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలకి గ్రేటర్ పరిధిలో 1000 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. తక్షణ మరమ్మత్తుల కోసం మంత్ర కేటీఆర్ 250 కోట్లను విడుదల చేశారని, గత ప్రభుత్వాల హయాంలోనే నాలాల ఆక్రమణలకు గురయ్యాయన్నారు వినయ్ భాస్కర్. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, టికెట్ ఎవరికీ ఇచ్చిన పార్టీ సైనికులుగా కార్యకర్తగా పనిచేస్తామన్నారు. అకాల వర్షాల కారణంగా వరంగల్ పట్టణంలో అనేక ఇబ్బందులు ఎదురుకొన్నామని, నగరంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. గతంలో నగరాన్ని సందర్శించి కేటీఆర్ 250కోట్లు మంజూరు చేయడం జరిగిందని, పెద్ద ఎత్తున కురిసిన వర్షాల కారణంగా సమ్మయ్య నగర్, జవహర్ నగర్ వరద ముంపు కు గురి కావడం జరిగిందన్నారు.
Also Read : Vadlamani Priya : గ్లామర్ షో తో రెచ్చకొడుతున్న ” వడ్లమాని ప్రియ”..
Also Read
- Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
- Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
- Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
- Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
అంతేకాకుండా.. ‘ఆగష్టు లో పెద్ద ఎత్తున వర్షాలు పడటంతో నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదలు వచిన్నపుడు అన్ని డిపార్ట్మెంట్ లు కలిసి పనిచేయడం జరిగింది. వర్షాలు ఆగిపోయిన తరువాత, జరిగిన నష్టన్ని అంచనా వేసి సుమారు 1000కోట్లు మేర నష్టం జరిగింది. నాళాలు, రోడ్లు దెబ్బతిన్నవి, వాటిని రిపేర్ చేయడానికి, నిన్న కేటీఆర్ 250కోట్లు తక్షణ సాయం కింద విడుదల చేసారు. జరిగిన నష్టం అంచనా తక్షణ సాయం కింద 250కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదములు తెలుపుతున్నాం. వరదలు వచ్చినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం దుర్మార్గం. భద్రకాళి బండ్ పైన కొంత మేర కోతకు గురైతే ప్రజలను భయబ్రాంతులకు కొందరు గురి చేయడం జరిగింది. ప్రతి పక్షాలు అసత్య ప్రచారాలు చేయడాన్ని కడిస్తున్నాం. నాలాల అక్రమ నిర్మాణాలు గతంలో జరిగిన మా పైన నిందలు వేయడాన్ని తీవ్రంగా కండిస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నగర ప్రజలకు కనీసం ఒక రూపాయి కూడా తీసుకురాలేదు. రాబోయే రోజులలో కాంగ్రెస్ ఇక్కడ రాదు కేంద్రంలో రాదు. బీజేపీ నాయకులు మీ పరపతి ఉపయోగించి నగరానికి నిధులు తీసుకురావాలి. ప్రజలకు మంచి పనులు చేసి వారికి అండగా ఉందాం. వరదల సహాయక చర్యలో పాల్గొన్న అనేక స్వచ్చంద సంస్థలకు ధన్యవాదములు. ప్లాస్టిక్ ను నివారిద్దాం. రాబోయే తరాలకు పచ్చని ప్రాంతాలను ఇద్దాము. ‘ అని వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.
Christopher Tilak: మళ్ళీ ఎన్నికల్లో మోసం చేసేందుకు వస్తారు ఎవరు నమ్మవద్దు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్పైనే అందరి కళ్లు..!
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?