Jharkhand : జార్ఖండ్లో త్రిపుల్ మర్డర్.. భార్య, బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : జార్ఖండ్లో దారుణం చోటు చేసుకుంది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలను గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుద్రాబాసా గ్రామంలో సోమవారం – మంగళవారం మధ్య రాత్రి ఈ సంఘటన జరిగింది.
సమాచారం ప్రకారం లుద్రాబాసాలో నివసిస్తున్న గురుచరణ్ పాడియా మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై భార్య జానోతో తరచూ గొడవపడేవాడు. మద్యం సేవించి రాత్రి 2.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయమై భార్యతో గొడవ మొదలైంది. వివాదం తీవ్రస్థాయికి చేరడంతో పాడియా జానోపై గొడ్డలితో దాడి చేశాడు. తల్లి అరుపులు విని పెద్ద కూతురు (ఐదేళ్లు) నిద్ర లేచింది. తల్లి వద్దకు వచ్చిన ఆమె కూడా ఆమెను చూసి కేకలు వేయడం ప్రారంభించింది.
Also Read
- Samantha Baby Shower: 'సమంత' సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
- Rohit Sharma: హిట్మ్యాన్ రిటైర్మెంట్పై జోరుగా చర్చ.. టీమిండియా కోచ్ కీలక ప్రకటన
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
Read Also:Jos Buttler Century: జోస్ బట్లర్ సూపర్ సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు!
ఇది చూసిన పాడియా తన కుమార్తెపై కూడా గొడ్డలితో దాడి చేశాడు. తల్లి, కూతురిని హత్య చేసినా పాడియా సంతృప్తి చెందకపోవడంతో.. అవతలి గదిలో నిద్రిస్తున్న ఏడాది వయసున్న తన మరో కుమార్తెను కూడా ఇదే రీతిలో హత్య చేశాడు. తర్వాత అక్కడే పడుకున్నారు. మరోవైపు పాడియా ఇంట్లో ఏదో జరిగిందని ఇరుగుపొరుగు వారికి అనుమానం రావడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మూడు మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. నిందితుడు పాడియాను బుధవారం కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం అతడి విచారణ కొనసాగుతోంది.
జార్ఖండ్లో మద్యం మత్తులో ఇలాంటి హత్యలు జరగడం ఇదే మొదటిసారి కాదు. నిజానికి ఇంతకు ముందు కూడా మద్యం మత్తులో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో జార్ఖండ్లోని గుమ్లా జిల్లా చైన్పూర్ నుంచి ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇక్కడ చైన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కాహి మహువా టోలి గ్రామంలో, దీపక్ టిర్కీ అనే వ్యక్తి తన సొంత భార్య సరోజ్ను మద్యం తాగకుండా అడ్డుకున్నందుకు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య మృతి చెందింది.
Read Also:Chaari 111 : ఓటీటీలో అదరగొడుతున్న వెన్నెల కిషోర్ స్పై కామెడీ థ్రిల్లర్..
తాజావార్తలు
-
Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. ‘మహేంద్రగిరి వారాహి’ టీమ్ వినూత్న ప్రమోషన్స్!
-
Samantha Baby Shower: ‘సమంత’ సీమంతం.! ఫోటోలు వైరల్.. నిజమేనా?
-
Apple: ఆపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ సేల్ ప్రారంభం.. మ్యాక్బుక్, ఐప్యాడ్లపై భారీ డిస్కౌంట్లు.. ఫ్రీగా AirPods, Apple Pencil
-
Rohit Sharma: హిట్మ్యాన్ రిటైర్మెంట్పై జోరుగా చర్చ.. టీమిండియా కోచ్ కీలక ప్రకటన
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!