Jharkhand : జార్ఖండ్లో త్రిపుల్ మర్డర్.. భార్య, బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : జార్ఖండ్లో దారుణం చోటు చేసుకుంది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలను గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుద్రాబాసా గ్రామంలో సోమవారం – మంగళవారం మధ్య రాత్రి ఈ సంఘటన జరిగింది.
సమాచారం ప్రకారం లుద్రాబాసాలో నివసిస్తున్న గురుచరణ్ పాడియా మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై భార్య జానోతో తరచూ గొడవపడేవాడు. మద్యం సేవించి రాత్రి 2.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయమై భార్యతో గొడవ మొదలైంది. వివాదం తీవ్రస్థాయికి చేరడంతో పాడియా జానోపై గొడ్డలితో దాడి చేశాడు. తల్లి అరుపులు విని పెద్ద కూతురు (ఐదేళ్లు) నిద్ర లేచింది. తల్లి వద్దకు వచ్చిన ఆమె కూడా ఆమెను చూసి కేకలు వేయడం ప్రారంభించింది.
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
Read Also:Jos Buttler Century: జోస్ బట్లర్ సూపర్ సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు!
ఇది చూసిన పాడియా తన కుమార్తెపై కూడా గొడ్డలితో దాడి చేశాడు. తల్లి, కూతురిని హత్య చేసినా పాడియా సంతృప్తి చెందకపోవడంతో.. అవతలి గదిలో నిద్రిస్తున్న ఏడాది వయసున్న తన మరో కుమార్తెను కూడా ఇదే రీతిలో హత్య చేశాడు. తర్వాత అక్కడే పడుకున్నారు. మరోవైపు పాడియా ఇంట్లో ఏదో జరిగిందని ఇరుగుపొరుగు వారికి అనుమానం రావడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మూడు మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. నిందితుడు పాడియాను బుధవారం కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం అతడి విచారణ కొనసాగుతోంది.
జార్ఖండ్లో మద్యం మత్తులో ఇలాంటి హత్యలు జరగడం ఇదే మొదటిసారి కాదు. నిజానికి ఇంతకు ముందు కూడా మద్యం మత్తులో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో జార్ఖండ్లోని గుమ్లా జిల్లా చైన్పూర్ నుంచి ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇక్కడ చైన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కాహి మహువా టోలి గ్రామంలో, దీపక్ టిర్కీ అనే వ్యక్తి తన సొంత భార్య సరోజ్ను మద్యం తాగకుండా అడ్డుకున్నందుకు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య మృతి చెందింది.
Read Also:Chaari 111 : ఓటీటీలో అదరగొడుతున్న వెన్నెల కిషోర్ స్పై కామెడీ థ్రిల్లర్..
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!