Jharkhand : జార్ఖండ్లో త్రిపుల్ మర్డర్.. భార్య, బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand : జార్ఖండ్లో దారుణం చోటు చేసుకుంది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెలను గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుద్రాబాసా గ్రామంలో సోమవారం – మంగళవారం మధ్య రాత్రి ఈ సంఘటన జరిగింది.
సమాచారం ప్రకారం లుద్రాబాసాలో నివసిస్తున్న గురుచరణ్ పాడియా మద్యానికి బానిసయ్యాడు. ఈ విషయమై భార్య జానోతో తరచూ గొడవపడేవాడు. మద్యం సేవించి రాత్రి 2.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ విషయమై భార్యతో గొడవ మొదలైంది. వివాదం తీవ్రస్థాయికి చేరడంతో పాడియా జానోపై గొడ్డలితో దాడి చేశాడు. తల్లి అరుపులు విని పెద్ద కూతురు (ఐదేళ్లు) నిద్ర లేచింది. తల్లి వద్దకు వచ్చిన ఆమె కూడా ఆమెను చూసి కేకలు వేయడం ప్రారంభించింది.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
Read Also:Jos Buttler Century: జోస్ బట్లర్ సూపర్ సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు!
ఇది చూసిన పాడియా తన కుమార్తెపై కూడా గొడ్డలితో దాడి చేశాడు. తల్లి, కూతురిని హత్య చేసినా పాడియా సంతృప్తి చెందకపోవడంతో.. అవతలి గదిలో నిద్రిస్తున్న ఏడాది వయసున్న తన మరో కుమార్తెను కూడా ఇదే రీతిలో హత్య చేశాడు. తర్వాత అక్కడే పడుకున్నారు. మరోవైపు పాడియా ఇంట్లో ఏదో జరిగిందని ఇరుగుపొరుగు వారికి అనుమానం రావడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మూడు మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్ట్మార్టంకు తరలించారు. నిందితుడు పాడియాను బుధవారం కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం అతడి విచారణ కొనసాగుతోంది.
జార్ఖండ్లో మద్యం మత్తులో ఇలాంటి హత్యలు జరగడం ఇదే మొదటిసారి కాదు. నిజానికి ఇంతకు ముందు కూడా మద్యం మత్తులో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో జార్ఖండ్లోని గుమ్లా జిల్లా చైన్పూర్ నుంచి ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇక్కడ చైన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్కాహి మహువా టోలి గ్రామంలో, దీపక్ టిర్కీ అనే వ్యక్తి తన సొంత భార్య సరోజ్ను మద్యం తాగకుండా అడ్డుకున్నందుకు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య మృతి చెందింది.
Read Also:Chaari 111 : ఓటీటీలో అదరగొడుతున్న వెన్నెల కిషోర్ స్పై కామెడీ థ్రిల్లర్..
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!