Ramprasad Reddy: అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి కీలక సందేశం..
- అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి కీలక సందేశం
- ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం బాధాకరం.. దురదృష్టకరం- రాంప్రసాద్ రెడ్డి
- మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు వల్లే సంభవిస్తున్నాయి
- దయచేసి ఎవరు మద్యం తాగి వాహనాలు నడపరాదు
- ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నమయ్య జిల్లా రామపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి 11:30 ప్రాంతంలో కడప నుంచి రాయచోటికి బయలుదేరిన ఇతియోస్ కారు.. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మార్గమధ్యంలోని చిట్లూరు హరిజనవాడ సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అఫ్రోజ్, అలీమ్ జితేంద్ర, అంజి నాయక్లు అక్కడికక్కడే మృతిచెందారు. ఖాదర్ బాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!
Also Read
- Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
కాగా.. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పోలీసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురి మృతదేహాలను సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతేకాకుండా.. దహన సంస్కరాల కోసం మృతుల కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.
Chandrababu: ఏపీ, తెలంగాణ విభజన అంశాలపై చర్చించాల్సిన అంశాలను సిద్ధం చేసుకున్న ఏపీ సీఎం..
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాయచోటి-కడప మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం బాధాకరం, దురదృష్టకరం అని అన్నారు. మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు వల్లే సంభవిస్తున్నాయి.. దయచేసి ఎవరు మద్యం తాగి వాహనాలు నడపరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కోరారు. చాలా చిన్న వయస్సు ఉన్న వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకుండా వాహనాలను నడుపుతున్నారని.. వీటిని అరికట్టాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నాని తెలిపారు. రెండు చేతులు జోడించి అందరికీ ఒకటే చెబుతున్నా.. దయచేసి మద్యం తాగి వాహనాలను నడపరాదన్నారు. ఒక్కసారి ప్రాణం పోతే తిరిగి రాదు.. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
ట్రెండింగ్
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!