MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..
- నారాయణపేట జిల్లాలోని బసిరెడ్డిపల్లిలో విషాదం
- చిన్నారి తేజశ్రీని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య
- డెడ్ బాడీని చెరువు కట్టపై పడేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారాయణపేట జిల్లాలోని బసిరెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. కేవలం ఐదు సంవత్సరాల వయసున్న చిన్నారి తేజశ్రీని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. డెడ్ బాడీని చెరువు కట్టపై పడేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. చిన్నారి డెడ్ బాడీని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కేసులో అసలేం జరిగింది? చిన్నారిని ఎవరు చంపేశారు?
Also Read:Catering: క్యాటరింగ్ బిజినెస్ మాటున పెద్ద కథే నడిపిస్తున్నాడుగా..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
నారాయణపేట జిల్లా బసిరెడ్డిపల్లికి చెందిన అంజి, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. ఒక పాప, ఒక బాబు ఉన్నారు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్లో ఉంటున్నారు. వారి వెంట బాబును తీసుకెళ్లారు. ఐతే కూతుర్ని మాత్రం వారి తల్లిదండ్రుల దగ్గర ఉంచేశారు. దాంతో అవ్వా తాత.. చిన్నారి తేజశ్రీని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మరోవైపు చిన్నారి తేజశ్రీ కూడా అవ్వా, తాత దగ్గర బాగానే పెరుగుతోంది. రోజూ అంగన్వాడీకి వెళ్లడం.. తర్వాత తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది.
అంతా బాగుంది అనుకున్న తరుణంలో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎండాకాలం కావడంతో గ్రామాల్లో ఆరుబయట నిద్రించడం ఆనవాయితీ. రాత్రి అవ్వ తాతతో కలిసి తేజశ్రీ బయట నిద్రించింది. కానీ అర్ధరాత్రి సమయంలో అమ్మాయి వారి పక్కలో లేకపోవడంతో వృద్ధ దంపతులు కంగారు పడ్డారు. గ్రామస్థుల సహాయంతో గ్రామంలో వెతుకగా చెరువు కట్టపై చిన్నారి విగతజీవిగా పడి ఉంది. అది చూసిన గ్రామస్తులు హుటాహుటిన నారాయణపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసు జాగిలాలతో సంఘటన స్థలాన్ని పరీక్షించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.
ఐదేళ్ల చిన్నారి తేజశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆ చిన్నారిని తెలిసిన వారే ఎవరైనా హత్య చేశారా? లేదా దొంగతనానికి వచ్చి.. అమ్మాయి పైనున్న వెండి పట్టీల కోసం దుండగులు ఎవరైనా చంపేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అని వాటిపై దర్యాప్తు చేస్తున్నామని నారాయణపేట DSP లింగయ్య తెలిపారు.
Also Read:Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తేజశ్రీని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అంత చిన్న గ్రామంలో తేజ శ్రీని ఎవరు.. ఎందుకు చంపారనే దానిపై మిస్టరీ వీడడం లేదు. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సేకరించే ఆధారాలే కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?