MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..
- నారాయణపేట జిల్లాలోని బసిరెడ్డిపల్లిలో విషాదం
- చిన్నారి తేజశ్రీని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య
- డెడ్ బాడీని చెరువు కట్టపై పడేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారాయణపేట జిల్లాలోని బసిరెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. కేవలం ఐదు సంవత్సరాల వయసున్న చిన్నారి తేజశ్రీని గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. డెడ్ బాడీని చెరువు కట్టపై పడేశారు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. చిన్నారి డెడ్ బాడీని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ కేసులో అసలేం జరిగింది? చిన్నారిని ఎవరు చంపేశారు?
Also Read:Catering: క్యాటరింగ్ బిజినెస్ మాటున పెద్ద కథే నడిపిస్తున్నాడుగా..
Also Read
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
నారాయణపేట జిల్లా బసిరెడ్డిపల్లికి చెందిన అంజి, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. ఒక పాప, ఒక బాబు ఉన్నారు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్లో ఉంటున్నారు. వారి వెంట బాబును తీసుకెళ్లారు. ఐతే కూతుర్ని మాత్రం వారి తల్లిదండ్రుల దగ్గర ఉంచేశారు. దాంతో అవ్వా తాత.. చిన్నారి తేజశ్రీని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మరోవైపు చిన్నారి తేజశ్రీ కూడా అవ్వా, తాత దగ్గర బాగానే పెరుగుతోంది. రోజూ అంగన్వాడీకి వెళ్లడం.. తర్వాత తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది.
అంతా బాగుంది అనుకున్న తరుణంలో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎండాకాలం కావడంతో గ్రామాల్లో ఆరుబయట నిద్రించడం ఆనవాయితీ. రాత్రి అవ్వ తాతతో కలిసి తేజశ్రీ బయట నిద్రించింది. కానీ అర్ధరాత్రి సమయంలో అమ్మాయి వారి పక్కలో లేకపోవడంతో వృద్ధ దంపతులు కంగారు పడ్డారు. గ్రామస్థుల సహాయంతో గ్రామంలో వెతుకగా చెరువు కట్టపై చిన్నారి విగతజీవిగా పడి ఉంది. అది చూసిన గ్రామస్తులు హుటాహుటిన నారాయణపేట రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసు జాగిలాలతో సంఘటన స్థలాన్ని పరీక్షించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.
ఐదేళ్ల చిన్నారి తేజశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆ చిన్నారిని తెలిసిన వారే ఎవరైనా హత్య చేశారా? లేదా దొంగతనానికి వచ్చి.. అమ్మాయి పైనున్న వెండి పట్టీల కోసం దుండగులు ఎవరైనా చంపేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? అని వాటిపై దర్యాప్తు చేస్తున్నామని నారాయణపేట DSP లింగయ్య తెలిపారు.
Also Read:Hanuman Jayanti: రేపు హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తేజశ్రీని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అంత చిన్న గ్రామంలో తేజ శ్రీని ఎవరు.. ఎందుకు చంపారనే దానిపై మిస్టరీ వీడడం లేదు. సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సేకరించే ఆధారాలే కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్తో ఇండియా విజయం..
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్బై!
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!