సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర, బహిరంగ సభ సందర్భంగా ఆ రహదారిలో వాహనాల దారి మళ్లింపు చేశారు పోలీసులు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. మార్కాపురం నుంచి ఒంగోలు వైపు వెళ్లే వాహనాలు నాగిరెడ్డిపల్లి దగ్గర నుంచి వెలిగొండ స్వామి గుడి మీదుగా చినమనగుండం వద్ద నంద్యాల నుంచి ఒంగోలు వెళ్లే రహదారిలో వెళ్లాలి. ఒంగోలు నుంచి మార్కాపురం వైపు వెళ్లే వాహనాలు పొదిలి, చిన్నారికట్ల జంక్షన్ దాటిన తర్వాత పాతపాడు మీదుగా కాట్రగుంట, చౌటపాలెం మీదుగా మార్కాపురం వెళ్లాలి. బస్సు యాత్ర కనిగిరి నుంచి బహిరంగ సభ వేదికకు వచ్చే సమయంలో కనిగిరి వైపు వెళ్లే వాహనాలను కంభాలపాడు వద్ద కొంత సమయం ఆపుతారు. బస్సు యాత్ర బహిరంగ సభ వేదిక నుంచి పొదిలి పట్టణంలోగుండా దర్శి వెళ్లే సమయంలో ఒంగోలు వైపు నుంచి వచ్చే వాహనాలను కాటూరి వారిపాలెం సబ్ స్టేషన్ వద్ద, గిద్దలూరు వైపు నుంచి ఒంగోలు వెళ్లే వాహనాలను చిన్నారికట్ల జంక్షన్ దాటిన తర్వాత కంభాలపాడు వద్ద కొంత సమయం ఆపుతారు. ఒంగోలు వైపు నుంచి గిద్దలూరు, దర్శి వెళ్లే భారీ వాహనాలు, కంకర టిప్పర్లను పొదిలి టౌన్ వైపు అనుమతించరు.