Revanth Reddy : సీఎం కేసీఆర్కు మరోసారి రేవంత్ రెడ్డి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Revanth Reddy Letter To CM KCR
మరోసారి టీపీసీస చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. తాజాగా రేవంత్ రెడ్డి రాసిన లేఖలో.. రామగుండం ఎరువుల పరిశ్రమ పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు చేయించాం.. గత ఏడాది రామగుండం పరిశ్రమ తిరిగి ప్రారంభించారు.. అయితే అక్కడ ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి దాదాపు 800 మంది నిరుద్యోగుల నుంచి 6 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేసి తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చారు. మీకు ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని, అవసరం అనుకుంటే ఆ ఉద్యోగాన్ని వేరే వాళ్లకు అమ్ముకోవచ్చని నమ్మబలికారు. దాదాపు 50 కోట్ల రూపాయలు ఈ ఉద్యోగాల నియామకంలో చేతులు మారాయి. అయితే ఇటీవల రామగుండం ఉద్యోగాల నియామక కాంట్రాక్ట్ మారిపోవడంతో కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ గతంలో నియమించిన వారిలో సగం మందిని తొలగించారు.. దీంతో వారంతా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ తొలగింపులో తీవ్రంగా మానసిక ఆందోళనకు గురైన కేశవ పట్నం మండలం అమ్మలపురం గ్రామానికి హరీష్ గౌడ్ అనే ఉద్యోగి సెల్ఫీ వీడియో పెట్టి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
అయితే రేపు కేసీఆర్ రామగుండం రానున్న నేపథ్యంలో హరీష్ శవానికి రామగుండంలో పోస్టుమార్టం చేయకుండా కరీంనగర్ తరలించి పోస్టుమార్టం చేసి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇన్ని అక్రమాలు అవినీతి జరుగుతున్న కేసీఆర్, కేటీఆర్ లు ఎలాంటి స్పందన లేదు. అవినీతికి పాల్పడితే తన కుటుంబ సభ్యులనైనా జైల్లో వేస్తా అని ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ఈ విషయంలో ఇంత జరుగుతున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే చర్యలు తీసుకొని మంత్రి కొప్పుల ఈశ్వర్ ను, ఎమ్మెల్యే చందర్ ను బర్తరఫ్ చేయాలి. ఈ విషయంలో పోరాటం చేస్తున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రోహిత్, సుజిత్, పైసా రవి, అంజన్ కుమార్ తదితర కాంగ్రెసునాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లో బంధించారు.. వెంటనే వారిని విడుదల చేయాలి.ఉద్యోగాలు తీసేసిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలి. మృతి చెందిన హరీష్ గౌడ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. 50 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి..’ అని పేర్కొన్నారు.
డిమాండ్లు…
1. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ లను బర్తరఫ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు పెట్టి విచారన జరపాలి
2. ఉద్యోగాలు తొలగించిన అందరికి తిరిగి ఉద్యోగాలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి.
3. మృతులు హరీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. 50 లక్షల నష్టపరిహారాన్ని ఇస్తూ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
4. అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్, కవ్వం పల్లి సత్యనారాయణ, అది శ్రీను, తదితరులను వెంటనే విడుదల చేయాలి.
5. మొత్తం వ్యవహారం లో కేసీఆర్ స్పందించి సమగ్ర విచారణ చేయాలి..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!