TPCC Mahesh Kumar : గిరిజన హక్కుల పరిష్కారానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
- ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీ ఆస్తి
- తెలంగాణ సర్కార్ చేపట్టిన కుల సర్వే దేశానికి రోల్ మోడల్
- జానారెడ్డి అనుభవం తో ముందుకు వెళ్తాం : మహేశ్ గౌడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Mahesh Kumar : జల్-జమీన్-జంగిల్ (నీరు, భూమి, అటవీ వనరులు) నినాదాన్ని ఆధారంగా తీసుకుని గిరిజనుల హక్కుల సాధనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ఆదివారం నాగార్జునసాగర్లోని విజయ్ విహార హోటల్లో నిర్వహించిన ఆదివాసీ శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ యాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ ప్రధానిగా చూడటం తమ కల అని, ఆ కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకోవడమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లక్ష్యమని వివరించారు.
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
గిరిజన హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శిస్తూ, రాహుల్ గాంధీ గిరిజన అభివృద్ధి కోసం పరితపిస్తున్న నాయకుడని ప్రశంసించారు. నాగార్జునసాగర్ శిక్షణ శిబిరాలకు నిలయమని, ఈ ప్రాంతం గిరిజన శిక్షణకు అనువుగా ఉందని అభిప్రాయపడ్డారు.
Pushpa – 2 : రూ. 800 కోట్లతో బాలీవుడ్ లో పుష్పరాజ్ NO -1
కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తోందని, అటవీ హక్కుల చట్టం తీసుకురావడంలో తమ పాత్రను గుర్తుచేశారు. కులగణన సర్వేపై చర్చ కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, సర్వే 90% పూర్తయిందని తెలిపారు. గిరిజనులు తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా నిలవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు.
ఈ శిక్షణ శిబిరంలో ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షి, కో-ఆర్డినేటర్ కొప్పుల రాజు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఇతర డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Ramesh Bidhuri: నేను ఎమ్మెల్యేగా గెలిస్తే.. కల్కాజీ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా తయారు చేస్తా..
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!