Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines At 9am On 2024 March 31st

Top Headlines @9AM: టాప్ న్యూస్!

Published Date :March 31, 2024 , 9:35 am
By Sampath Kumar
Top Headlines @9AM: టాప్ న్యూస్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ:
మాడుగుల టీడీపీలో టిక్కెట్ రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామానాయుడు బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. నేడు నాలుగు మండలల్లో బైక్ ర్యాలీ, భారీ సమావేశం జరగనుంది. ఇప్పటికే రామానాయుడికి వైసీపీ టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్‌ఆర్‌ఐ పైలా ప్రసాద్‌కు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది. అయితే వ్యతిరేకత పెరగడంతో మాజీ మంత్రి బండారు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోంది.

కాంగ్రెస్‌ని నమ్మి మోసపోవడనికి ప్రజలు సిద్ధంగా లేరు:
ప్రజలు మాత్రం మరోసారి కాంగ్రెస్ ని నమ్మి మోసపోవడనికి సిద్ధంగా లేరని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరును ఆయన ఖండించారు. గతంలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ అవలంబించిన విధానాన్నే రేవంత్ రెడ్డి ఇప్పుడు కొనసాగిస్తున్నాడని తెలిపారు. వేరొక పార్టీ బీ ఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యే లను కాంగ్రెస్ లో చేర్చుకున్నారని మండిపడ్డారు. గతంలో స్వయంగా రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేసిన వారిని కూడా తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read

  • Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
  • Woman Assaulted in Train: కదిలే ట్రైన్‌లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !
  • Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్:
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇవాళ మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. వారి వెంట తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ వెళ్లనున్నారు. ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశం కానుంది. ఈ స‌మావేశంలో పెండింగ్‌లో ఉన్న పార్ల‌మెంట్ సీట్లపై చ‌ర్చించి అభ్య‌ర్థుల ఫైర్‌ను సీఈసీ ఖరారు చేయ‌నుంది. కాంగ్రెస్ పార్టీ 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అధికారులతో మాట్లాడి అభ్యర్థులపై చర్చించి అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు.

నేడు కేసీఆర్ జిల్లాల పర్యటన:
నేడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతుల్లో ధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా పర్యటించనున్నారు. అందులో భాగంగానే ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పంటలను పరిశీలించి రైతుల్లో ధైర్యం నింపనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పర్యటిస్తారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అర్వపల్లికి వెళ్తారు. అనంతరం నల్గొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి రైతులను ప్రోత్సహించనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్:
ఛత్తీస్‌గఢ్‌లో సైనికుల యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అబుజ్మద్‌లో 48 గంటల పాటు సైనికుల యాంటీ నక్సల్ ఆపరేషన్ కొనసాగింది. ఈ క్రమంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య మూడు సార్లు ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. నారాయణపూర్ జిల్లా సోన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌కౌంటర్ జరిగింది. వివిధ చోట్ల దాదాపు 4 గంటల పాటు కాల్పులు కొనసాగాయి. సైనికులు పొంగిపొర్లడం చూసి నజ్కలి అడవి వైపు పారిపోయిందని చెబుతారు. ఆ తర్వాత సైనికులు 5 కిలోల ఐఈడీ పేలుడుతో సహా భారీ మొత్తంలో నక్సలైట్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

సిలిండర్ పేలుడు.. ఐదుగురు సజీవదహనం:
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని సింధియా నగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ ఇంటిపై హైటెన్షన్ వైరు పడింది. దీంతో ఇంట్లోకి కరెంట్ సరఫరా వచ్చింది. దాంతో ఇంట్లో ఉంచిన సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా కాలిపోయారు. ఇరుగుపొరుగు వారి సహాయంతో పోలీసులు అందరినీ జయరోగ్య ఆసుపత్రిలోని కాలిన వార్డులో చేర్పించారు.

ప్రముఖ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీలీల:
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్క సినిమాతో హిట్ భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలను లైనప్ పెట్టుకుంటూ ఏకంగా అరడజను సినిమాలను చేసింది. అయితే అందులో కొన్ని మాత్రమే సూపర్ హిట్ ను అందుకున్నాయి. దాంతో కథల విషయంలో అమ్మడు ఆచి తూచి ఎంపిక చేసుకుంతుంది. అందుకే ఇప్పుడు సినిమాలకు గ్యాప్ తీసుకుంది. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన శ్రీచైతన్య విద్యాసంస్థల బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

పెళ్లి ముహుర్తం ఫిక్స్ అంటున్న నవదీప్:
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ప్రభాస్ తర్వాత మరో హీరో ఎవరంటే నవదీప్ అని ఇట్టే చెప్పేస్తారు. ఈమధ్య విడుదలైన ఈగల్ చిత్రంలో నవదీప్ మాస్ మహారాజా రవితేజ పక్కన నటించి మెప్పించాడు. ఒకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే వివిధ సినిమాలలో అనేక క్యారెక్టర్లు చేస్తూ నటిస్తున్నాడు. ఇక ఈ హీరో విషయం సంబంధించి ఈయన ఎక్కడికి వెళ్ళినా అడిగే మొదటి ప్రశ్న మీకు పెళ్లి ఎప్పుడు అని. ఇక ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశాడు. నవదీప్ పెళ్లి కార్డు షేర్ చేసి ఒకింత షాక్ ఇచ్చాడు. అయితే నవదీప్ షేర్ చేసిన వీడియోలో పెళ్లి కార్డు కనిపించడం నిజమే.. కాకపోతే అది పెళ్లి కార్డులా కనిపించినా.. నిజానికి అది తాను హీరోగా నటించిన లవ్ మౌళి సినిమా సంబంధించిన రిలీజ్ డేట్ పూర్తి వివరాలను తెలిపే వీడియో.

చెన్నై వరుస విజయాలకు ఢిల్లీ బ్రేకులు వేయగలదా:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్దమైంది. ఇరు జట్ల మధ్య నేడు రాత్రి 07:30కు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. చెన్నై, ఢిల్లీ టీమ్స్ ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో ఒకదానితో ఒకటి తలపడ్డాయి. అందులో 10 మాత్రమే ఢిల్లీ గెలిచింది. 19 మ్యాచ్ లలో చెన్నై విజయం సాధించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Film News
  • ntv top headlines
  • sports news
  • telangana

తాజావార్తలు

  • Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..

  • Woman Assaulted in Train: కదిలే ట్రైన్‌లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..

  • Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కెప్టెన్..

  • Lenin : రామ్ చరణ్ ‘పెద్ది’ దెబ్బతో మళ్లీ సైలెంట్ అయిన ‘లెనిన్’ !

  • Bajaj Chetak C2501 STD: బజాజ్ చేతక్ సిరీస్‌లో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్లు & స్పెసిఫికేషన్స్

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions