Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9am 22 02 2024

Top Headlines @9AM : టాప్ న్యూస్

Published Date :February 22, 2024 , 9:06 am
By Gogikar Sai Krishna
Top Headlines @9AM : టాప్ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. తులం ఎంతంటే?

మహిళలకు షాకింగ్ న్యూస్ మళ్లీ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి… నేడు మార్కెట్ లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి… ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు పెరిగి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,750 గా ఉంది.. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి .. కిలో వెండి పై రూ.100 పెరిగి రూ.75,500 గా ఉంది. ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,110, 24 క్యారెట్ల ధర రూ.63,390, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750 గా ఉంది.. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,760 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,900 గా ఉంది.. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,610, 24 క్యారెట్ల ధర రూ.62,750 ఉంది.. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,750 గా ఉంది.

ఢిల్లీలోని ద్వారకలో భారీ అగ్నిప్రమాదం.. నాలుగో అంతస్తు నుంచి దూకిన మహిళలు

ఢిల్లీలోని ద్వారకలో అత్తగారు, కోడలు బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న భారీ అగ్నిప్రమాదం వెలుగు చూసింది. అయితే ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. వాస్తవానికి, ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లో ఉన్న పసిఫిక్ అపార్ట్‌మెంట్ భవనంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్యాస్ లీకేజీ కారణంగా భవనంలోని నాలుగో అంతస్తులో మంటలు వ్యాపించాయి. మంటలు చాలా బలంగా ఉండటంతో ఆ ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. వెంటనే 6 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

నేడు టీడీపీ- జనసేన సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల పంపిణీపై కీలక చర్చ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల మార్పులు చేర్పులతో తీవ్ర ఉత్కంఠ రేపుతుండంతో పాటు సిద్ధం సభలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువ అవుతున్నారు. మరోవైపు, టీడీపీ- జనసేన కూటమి ఈసారి అధికారం దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేసుకున్నట్లు కనిస్తుంది. అందులో భాగంగనే ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నాయి. అయితే, టీడీపీ- జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఏకాభిప్రాయానికి రాలేదు. పొత్తును ముందుకు తీసుకెళతాం అని టీడీపీ, జనసేన అగ్రనేతలు చెప్తున్నారు.. కానీ, ఇరు పార్టీల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల్లో ప్రస్తుతం గందరగోళం నెలకొంది.

సారలమ్మకు స్వాగతం పలికిన పగిడిద్దరాజు, గోవిందరాజు.. నేడుగద్దెపైకి సమ్మక్క..

మేడారం మహా జాతరలో తొలి ఘట్టం నిర్విఘ్నంగా పూర్తైంది. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ నిన్న (బుధవారం) అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలి వచ్చి మేడారం గుడి దగ్గరకు సారలమ్మకు ఘన స్వాగతం పలికారు. సారలమ్మను కనులారా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. సారలమ్మను తోడ్కోని వచ్చే ప్రధాన వడ్డె (పూజారి) కాక సారయ్య సహా ఆయనను అనుసరించే ఇతర వడ్డెలు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక, పూజల తర్వాత కన్నెపల్లి నుంచి 16 మంది ఆడబిడ్డలు వచ్చి సంప్రదాయం ప్రకారం డోలి విన్యాసాలతో సమ్మక్క-సారలమ్మ కొలువుదీరే గద్దెలపై ముగ్గులు వేసి కంకవనానికి కంకణాలు కట్టారు. ఇవాళ, మధ్యాహ్నం 3 గంటల నుంచే కన్నెపల్లి సారలమ్మ గుడి దగ్గర డోలి విన్యాసాలు, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి పరిషత్‌, సారలమ్మ యువజన సంఘం బృందాల సారథ్యంలో కళా ప్రదర్శనలు జరగనున్నాయి. అదే సమయంలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య సహా ఇతర పూజారులు సారలమ్మ గుడిలో వారి ఆచార సంప్రదాయాల ప్రకారం పూజలు నిన్వహించనున్నారు.

నేడు విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్‌-2024 విన్యాసాలు

భారత నావికాదళం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఫ్లాగ్‌షిప్ నావికా విన్యాసమైన మిలాన్ 2024 12వ ఎడిషన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తూర్పు నౌకాదళ కమాండ్ బేస్‌లో మిలాన్ గ్రామాన్ని కూడా ఆయన ప్రారంభించారు. “శాంతి పరిరక్షణలో సాయుధ దళాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మా చారిత్రక అనుభవం తెలియజేస్తుంది. ఇది నిరోధం, సంఘర్షణ నివారణ వంటి భావనలు,అభ్యాసాలలో కనిపిస్తుంది, ”అని మిలన్ నౌకాదళ వ్యాయామం యొక్క 12వ ఎడిషన్‌లో సింగ్ అన్నారు.

నేడు సూరత్‌లో ప్రధాని మోడీ పర్యటన.. 700 మెగావాట్ల అణు ప్లాంట్లు జాతికి అంకితం

నేడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలోని తాపీ కక్రాపర్‌లో 22,500 కోట్ల రూపాయలతో నిర్మించిన రెండు 700 మెగావాట్ల అణు కేంద్రాలను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. ఇది దేశంలోనే తొలి స్వదేశీ అణు విద్యుత్ కేంద్రంగా అవతరించనుంది. ఈ సందర్భంగా మెహసానా, నవ్‌సారిలో రూ.22,850 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

అలాగే, గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ రూ. 10,700 కోట్లతో నిర్మించనున్న వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో 50 ఏళ్ల శ్వేత విప్లవం, అమూల్‌ స్థాపన సందర్భంగా నేడు అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో 1.25 లక్షల మంది రైతులు, పశువుల కాపరులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ లు కలిసి అమూల్ యొక్క 1200 కోట్ల రూపాయల విలువైన ఐదు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముదురుతున్న టికెట్ వార్

ఏపీలో రాజకీయం రోజుకో ములుపు తిరుగుతోంది. రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముదురుతున్న టికెట్ వార్ జరుగుతోంది. పవన్ పర్యటన తర్వాత జిల్లాలో టీడీపీ – జనసేన నేతల మధ్య టికెట్ ఫైట్ పెరిగింది. రేపు జనసేన లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చేరనున్నారు. అయితే.. కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం జనసేన టికెట్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే… నర్సాపురంలో ఇప్పటికే జనసేన ఇన్చార్జ్ బొమ్మిడి నాయకర్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు, ఎన్నారై కొవ్వలి నాయుడు ఇన్చార్జ్ పుత్తూరు రామరాజు మధ్య పోటీ నెలకొంది.

ఐదు కోట్ల మంది రైతులకు కేంద్రం కానుక.. చెరకు సేకరణ ధరలు భారీగా పెంపు

రైతుల ఉద్యమాల నడుమ, ఎన్నికల ముందు దేశంలోని ఐదు కోట్ల మందికి పైగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. ఈ ఐదు కోట్ల మందికి పైగా రైతులు చెరకు సాగు చేస్తున్నవారే తప్ప మరెవరో కాదు. 2024-25 సీజన్‌లో చెరకు ఎఫ్‌ఆర్‌పీని క్వింటాల్‌కు రూ.25 పెంచి రూ.340కి ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. కొత్త చెరకు సీజన్ అక్టోబర్ నుండి ప్రారంభమవుతుంది. సరసమైన, లాభదాయకమైన ధర అంటే ఎఫ్‌ఆర్‌పి అనేది చెరకు రైతులకు మిల్లులు చెల్లించాల్సిన కనీస ధర.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో చెరకు ఎఫ్‌ఆర్‌పీని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా క్వింటాల్‌కు రూ.25 పెంచడం మోడీ ప్రభుత్వం చేసిన అత్యధిక పెరుగుదల. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ చర్య తీసుకున్నారు. చెరకు ప్రధానంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో పండిస్తారు. దేశంలో ఐదు కోట్ల మందికి పైగా చెరుకు రైతులు ఉన్నారు.

లక్నవరం సందర్శనలకు బ్రేక్.. కారణం ఏమిటంటే?

మేడారం మహాజాతర ప్రారంభం కావడంతో సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా లక్నవరం సరస్సును సందర్శించేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. కానీ మేడారం మార్గంలో కేరళ తరహాలో అందాలతో నిండిన ఈ అద్భుత సరస్సును సందర్శించేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. అక్కడికి ఎవరూ వెళ్లవద్దని బోర్డు కూడా పెట్టారు.

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువు ఆహ్లాదానికి అడ్డాగా వెలుగొందుతోంది. ఓ కేరళ.. ఓ అరకు.. ఓ కోనసీమ.. ఇలా ఎన్నో ప్రకృతి అందాలు ఈ లక్నవరం సరస్సు చుట్టూ కనిపిస్తున్నాయి. సరస్సులో పర్యాటకులు బోటింగ్, స్పీడ్ బోట్, సైక్లింగ్ బోట్ వంటివి ఆనందించేలా ఏర్పాట్లు చేశారు. చుట్టూ ఉన్న కొండలు, చెట్లు, నీరు, పచ్చని రిసార్ట్‌లు మరియు ఇతర సౌకర్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. దీంతో ఇక్కడికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు మేడారం మహాజాతర నేపథ్యంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో లక్డీకాపూల్ సందర్శన నిలిచిపోయింది. ఈ మేరకు ఈ నెల 18 నుంచి 25 వరకు లక్నో మార్గాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బుస్సాపూర్ గ్రామపంచాయతీ, టూరిజం శాఖ సమక్షంలో ఇప్పటికే అక్కడ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో వాహనాల రద్దీ కూడా పెద్ద ఎత్తున పెరిగిందని, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా లక్నవరం మార్గాన్ని మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు మేడారం భక్తులు, పర్యాటకులు సహకరించాలని కోరారు. మేడారం జాతర ముగిసిన తర్వాత లక్నవరం సరస్సును సందర్శించేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఈ మేరకు బుస్సాపూర్ క్రాస్ వద్ద లక్నవరం సరస్సు వద్దకు వాహనాలు వెళ్లకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • janasena
  • laknavaram bridge
  • Narendra Modi
  • tdp

తాజావార్తలు

  • INDIA Bloc: ఇండియా కూటమి సంచలన నిర్ణయం.. డీలిమిటేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • Film Tittle: ఒక్క సినిమా టైటిల్‌ కోసం రూ.112 కోట్లు.. బాబోయ్ అంత డిమాండ్ ఉందా..?

  • Peddi: జూన్’కి ‘పెద్ది’ వాయిదా.. టీం అధికారిక ప్రకటన.!

  • Iran-US: చర్చలు విఫలం కాగానే రహస్యంగా వెళ్లాల్సి వచ్చింది.. అమెరికాపై ఇరాన్ సంచలన ఆరోపణలు

ట్రెండింగ్‌

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions