Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Top Headlines 9 Pm On January 17th 2023

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Published Date :January 17, 2024 , 9:00 pm
By Mahesh Jakki
Top Headlines@9PM: టాప్‌ న్యూస్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

*మరో 3 రోజులు సంక్రాంతి సెలవులు పొడిగింపు..
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు పొడిగించారు. ఈ నెల 22న పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘ‌నంగా జ‌రుపుకునే పండ‌గ‌ల్లో సంక్రాంతి టాప్‌లో ఉంటుంది. అలాగే ఈ పండ‌గ‌ల‌కు స్కూల్స్, కాలేజీల‌కు ఎక్కువ రోజులు సెలవులు కూడా వ‌స్తాయి. ఏపీ సర్కారు విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్‌ ప్రకారం.. జనవరి 11వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే దీనిపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గతంలో కనీసం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చేవారని.. ఇప్పుడు మారిన పరిస్థితులరీత్యా సెలవులు తగ్గించడం సరికాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు నిర్ణయించింది. 19వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని పేర్కొంది. అయితే పండుగ అయిపోయన వెంటనే పిల్లలు పాఠశాలకు రాలేరని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు రావడంతో మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ.. తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

 

Also Read

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్
  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
Add as a preferred
source on google

*అంబేడ్కర్ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం
ఎల్లుండి విజయవాడలో అంబేడ్కర్‌ మహా శిల్పం ఆవిష్కరణ జరగనుంది. సీఎం జగన్‌ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరగనుది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ అంబేడ్కర్‌ విగ్రహం గురించి మాట్లాడారు. విజయవాడలో ఏర్పాటు చేసుకున్న అంబేడ్కర్‌ మహా శిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికమని ఆయన వ్యాఖ్యానించారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని, సామాజిక న్యాయ’మహా శిల్పమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అభివర్ణించారు. ఈ నెల 19న, చారిత్రక, స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్నామని వెల్లడించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద అంబేడ్కర్‌ విగ్రహమని ఆయన తెలిపారు. 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన… 125 అడుగుల మహా శిల్పం.. మొత్తంగా 206 అడుగుల ఎత్తైన విగ్రహమని సీఎం స్పష్టం చేశారు. ఆ మహానుభావుడిది ఆకాశమంతటి వ్యక్తిత్వమని, ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా అంబేడ్కర్‌ భావజాలం ఉందన్నారు. దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. బాధ్యతతో, ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో ప్రభుత్వం అనుసరించిందన్నారు. ఈ నెల 19వ తేదీన విగ్రహ ఆవిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని సీఎం ప్రజలకు సూచించారు. అంటరానితనం, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన మహానుభావుడు అంబేడ్కర్‌ అని ఆయన చెప్పారు. సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపం.. రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి.. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం.., అణగారిన వర్గాలకు నిరంతరం.., ధైర్యాన్ని, అండని ప్రసాదించే ఓ మహా స్ఫూర్తి అంబేడ్కర్ అంటూ సీఎం కొనియాడారు. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా, పేదలందరి జీవితాల్లో వెలుగులు నింపారని అంబేడ్కర్‌ గొప్పదనాన్ని ముఖ్యమంత్రి కీర్తించారు. ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భావాలు అంటూ సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

 

*పవన్‌ కళ్యాణ్‌ను కలిసిన వైఎస్‌ షర్మిల
హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కలిశారు. హైదరాబాద్‌లోని పవన్‌ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరుకావాలని ఆహ్వానిస్తూ పవన్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరుల వివరాలను పవన్‌ అడిగి తెలుసుకున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ షర్మిలకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఇదిలా ఉండగా.. రేపు సాయంత్రం హైదరాబాద్‌లో వైఎస్‌ రాజారెడ్డి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి రాజారెడ్డి మేనమామ, సీఎం జగన్‌ హాజరుకానున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

 

*కేసీఆర్ వల్లే పేదరికం తగ్గింది: హరీశ్ రావు
రాష్ట్రంలో గత పదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన పలు కార్యక్రమాల వల్లనే రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిపోయిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు బుధవారం అన్నారు. బహుమితీయ పేదరిక సూచీ 13.18 శాతం నుంచి 3.76 శాతానికి బాగా క్షీణించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం పేరుతో సాగుతున్న దుష్ప్రచారాలకు తగిన సమాధానం. తదుపరి పార్లమెంట్ ఎన్నికల కోసం నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం యొక్క సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, NITI ఆయోగ్ తన నివేదికలలో రాష్ట్ర అభివృద్ధి కథనాన్ని ప్రశంసిస్తూ ఉందని ఎత్తి చూపారు. మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రంలో శ్రేయస్సు, అభివృద్ధి యొక్క స్వచ్ఛతలో భాగంగా, అనేక పేదరిక నిర్మూలన పథకాలతో ప్రజలకు చేరువయ్యారని మరియు వారు పేదరికాన్ని తొమ్మిది శాతం నుండి 3.76 శాతానికి తగ్గించడంలో గొప్ప డివిడెండ్‌లను అందించారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత గుజరాత్‌లో విజయం సాధించింది. ఈ లెక్కన తెలంగాణ కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మాత్రమే ముందున్నాయి. దావోస్‌లోని పెట్టుబడిదారులకు రాష్ట్రం గురించి అధ్వాన్నమైన చిత్రాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించిన ముఖ్యమంత్రి బృందం ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం వివిధ చోట్ల కాంగ్రెస్‌ ప్రాయోజిత హింసాత్మక ఘటనలను ప్రస్తావిస్తూ, రాజకీయ హింస, హత్యలకు దోహదపడే ఎలాంటి రెచ్చగొట్టినా రాష్ట్రానికి ప్రతిఘటన తప్పదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన కనీసం 100 రోజులు పూర్తయ్యే వరకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఓపికతో ఎదురుచూస్తున్నారని చెప్పారు.

 

*పవన్‌కళ్యాణ్‌, కొణతాల రామకృష్ణ భేటీ.. త్వరలో జనసేనలోకి!
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ బుధవారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. త్వరలోనే కొణతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం బరిలోకి దిగాలని కొణతాల రామకృష్ణ భావిస్తున్నారు. తన ఎంపీ టికెట్ ఇవ్వాలని కొణతాల ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా కొణతాల రామకృష్ణ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. మంచిరోజు చూసుకొని ఈ నెలలోనే జనసేనలో కొణతాల రామకృష్ణ చేరనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాలు, ఉత్తరాంధ్రలో రాజకీయ పరిస్థితులపై పవన్ -కొణతాల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌ నేతగా, మంత్రిగా శాసించిన నేత. గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల.. నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో వున్నారు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ తరపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఓటమి పాలైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి రావడంతో కొణతాల హవా నడిచింది. అనంతరం రాష్ట్ర విభజనతో కొణతాల రామకృష్ణ కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ ఓటమి పాలవ్వడం, విశాఖ ఎంపీగా విజయమ్మ ఓడిపోవడంతో కొణతాలకు పార్టీ హైకమాండ్‌తో గ్యాప్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. అనంతరం ఆయన పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. అనంతరం ఆయన టీడీపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఆయన రాజకీయాలుకు దూరంగా ఉన్నప్పటికీ రైతు సమస్యలు, చెరకు సాగులు ఇబ్బందులు, షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడటం వంటి వాటిపై కొణతాల రామకృష్ణ పోరాటం చేస్తూ వచ్చారు. ఆయన ఇటీవల యాక్టివ్‌ పాలిటిక్స్ వైపు కొణతాల దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. పవన్‌తో భేటీ కావడంతో ఆయన జనసేనలో చేరతారని ఖరారైంది.

 

*తెలంగాణలో గోడి ఇండియా భారీ ప్రాజెక్టు.. రూ.8 వేల కోట్ల పెట్టుబడులు
గోడి ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకు సంబంధించి భారీగా రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్ లో 12.5 GWh (గిగావాట్ ఫర్ అవర్ ) సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. అదే వేదికగా తెలంగాణ ప్రభుత్వంతో గోడి ఇండియా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. రాబోయే అయిదు సంవత్సరాల వ్యవధిలో తెలంగాణలో లిథియం, సోడియం అయాన్, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాల పరిశోధన, అభివృద్ధి (R&D), గిగా స్కేల్ సెల్ తయారీ కేంద్రం నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో 6,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ముందుగా 2.5 గిగావాట్ల కెపాసిటీ సెల్ అసెంబ్లింగ్ లైన్ తయారు చేసి, రెండో దశలో 10 గిగావాట్లకు విస్తరిస్తారు. గోడి ఇండియా పెట్టుబడులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతించారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ లను ప్రోత్సహించటంతో పాటు పర్యావరణ అనుకూల వ్యవస్థను నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అందుకు అవసరమైన విధానాలకు తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, పర్యావరణ వ్యవస్థలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలకు అనుగుణంగానే ఈ ప్రాజెక్టు అనుసంధానమై ఉందని, ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ల రూపకల్పనలో గోడి కీలకంగా నిలుస్తుందని అన్నారు. తమ కంపెనీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్న తెలంగాణ ప్రభుత్వానికి మహేష్ గోడి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో వ్యాపారాలకు సానుకూల వాతావరణంతో పాటు పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

 

*రెండు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా కింద పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది . తెలంగాణ శాసనమండలికి జరిగే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే అభ్యర్థులుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీ మహేశ్ కుమార్ గౌడ్, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్‌ల అభ్యర్థిత్వ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారు . నామినేషన్ల చివరి రోజైన జనవరి 18న ఇరువురు నేతలు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC)కి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండగా, వెంకట్ బల్మూర్ 2021 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తెలంగాణ NSUI అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే.. తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీల బాధ్యతలపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా కింద రెండు స్థానాలు సహా ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ సీటుకి సహకరించిన సీఎం రేవంత్.. డిప్యూటీ సీఎం భట్టి కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నా సేవలు గుర్తించిందని, వయసుతో సంబంధం లేకుండా పదవి ఇచ్చింది పార్టీ అని, యువతకు ప్రాధాన్యత దక్కినట్టు అయ్యిందన్నారు.

 

*అభివృద్ధిలో ట్రాక్ రికార్డ్ కలిగిన ఏకైక పార్టీ బీజేపీనే..
రెండు​ రోజుల కేరళ పర్యటనలో భాగంగా కొచ్చిలో ‘శక్తి కేంద్ర ఇన్‌చార్జ్‌ సమ్మేళనం’లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. అనంతరం.. కేరళలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఎల్‌డీఎఫ్‌), యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(యూడీఎఫ్‌) పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధిని నిరూపితమైన ట్రాక్ రికార్డ్, భవిష్యత్తు కోసం స్పష్టమైన విజన్ కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను ప్రధాని మోదీ వివరించారు. ఇటీవలి నివేదిక ప్రకారం.. గత తొమ్మిదేళ్లలో భారతదేశంలో దాదాపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ గత ఐదు దశాబ్దాలుగా కేవలం ‘గరీబీ హఠావో’ నినాదం వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ పార్టీలు చరిత్ర అవినీతికి మారు పేరు అని ప్రధాని మండిపడ్డారు. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లో​కి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాగా.. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రానికి వచ్చినప్పుడు తనకు లభించిన స్వాగతాన్ని కూడా ప్రస్తావించారు. కేరళ ప్రజలు తనపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతకు తాను పొంగిపోయానని అన్నారు. మంగళవారం కొచ్చి చేరుకుని ఈ ఉదయం త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయానికి వెళ్తుండగా ప్రజలు తనను ఆశీర్వదించారని చెప్పారు. రెండు రోజుల కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని సాయంత్రం తిరిగి ఢిల్లీకి వెళ్లారు.

 

*20 కిలోల బిస్కెట్లతో రామమందిర నమూనా..
యావత్ దేశం దృష్టి మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు ఉంది. రామ మందిర ప్రారంభోత్సవం కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా.. రాంలాలా కోసం వివిధ రాష్ట్రాల నుంచి రకరకాల బహుమతులు వస్తున్నాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌కు చెందిన యువ కళాకారుడు రాముడి కోసం ప్రత్యేకంగా తయారు చేశాడు. 20 కిలోల బిస్కెట్లతో రామ మందిర నమూనాను తయారు చేశాడు. దుర్గాపూర్‌కు చెందిన ఛోటాన్ ఘోష్ మోను అనే యువకుడు ఈ మోడల్‌ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చంద్రయాన్ విజయవంతమైన మిషన్ తర్వాత, అతను చంద్రయాన్ ప్రతిరూపాన్ని తయారు చేశాడు. ఇప్పుడు బిస్కెట్లతో రామ మందిరానికి ప్రతిరూపాన్ని తయారు చేశాడు. కాగా.. ఛోటాన్ ఘోష్ ఆచరణాత్మకంగా అయోధ్యలోని రామ మందిరాన్ని దుర్గాపూర్ కు తీసుకువచ్చాడని స్థానికులు చెబుతున్నారు. అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించే ముందు, నగరవాసులు ఈ రామాలయాన్ని సందర్శించవచ్చని అంటున్నారు. చోటన్ ఘోష్ బిస్కెట్లతో ఈ రామ మందిరానికి ప్రతిరూపాన్ని తయారు చేశానని చెప్పారు. 4×4 అడుగుల రామాలయం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేయడానికి అతనికి ఐదు రోజులు పట్టింది. దీని తయారీలో బిస్కెట్లు కాకుండా థర్మాకోల్, ప్లైవుడ్, గ్లూ-గన్ ను ఉపయోగించారు. అయితే ఛోటాన్ ఘోష్ తయారు చేసిన ఈ అద్భుత తయారీని అందరూ అభినందిస్తున్నారు.

 

*థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. బాణాసంచా పేలి 20 మంది మృతి
సెంట్రల్‌ థాయ్‌లాండ్‌లోని సుపాన్‌ బూరిరి ప్రావిన్సులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు మరణించినట్లు రెస్క్యూ పనులు చేపడుతున్న సిబ్బంది తెలిపారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారిలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని పోలీసులు తెలిపారు. పేలుడు కారణాలపై వివరాలు తెలియాల్సి ఉందని.. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ టీమ్‌ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cricket
  • telangana
  • Tollywood
  • Top Headlines @ 9 PM on January 17th 2023

తాజావార్తలు

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్

  • Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions