Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 1pm 08 07 2023

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Published Date :July 8, 2023 , 1:00 pm
By Gogikar Sai Krishna
Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

గందరగోళం తొలగిపోయింది.. థ్రెడ్‌ల లోగో వెనుక రహస్యం ఇదే

ట్విటర్‌కి పోటీగా వచ్చిన Meta’s Threads యాప్‌ను లాంచ్ చేసింది. లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ యాప్ కోట్లాది మంది వినియోగదారులను కూడగట్టుకుంది. అయితే ఇప్పుడు థ్రెడ్‌ల లోగోకు సంబంధించి సోషల్ మీడియాలో విభిన్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఇది తమిళ అక్షరంలా ఉంది, దాని ఆకారం జిలేబిలా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్ వరదల మధ్య, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అధినేత ఆడమ్ మోస్సేరి ఈ గందరగోళాన్ని పరిష్కరం చూపించారు.

వ్యక్తుల సమాచారం కోసం.. ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మొస్సేరి థ్రెడ్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. తద్వారా ఇప్పుడు లోగోకు సంబంధించి సోషల్ మీడియాలో తలెత్తే వ్యక్తుల గందరగోళానికి తెరపడింది.Adam Mosseri షేర్ చేసిన పోస్ట్‌ను చూస్తుంటే, Threads లోగో @ గుర్తుతో ప్రేరణ పొందిందని తెలిసింది. ఈ గుర్తు సాధారణంగా వినియోగదారు ప్రొఫైల్ వినియోగదారు పేరు, వ్యక్తి, వాయిస్ కోసం ఉపయోగించబడుతుంది.

బెంగాల్‌ల్లో హత్యారాజకీయం.. పంచాయతీ పోలింగ్ రోజే ఏడుగురి హత్య..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింస రాజ్యమేలుతోంది. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిందో అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు బెంగాల్ లోని మొత్తం 22 జిల్లా పరిషత్, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర బలగాల కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు జరుగుతున్నా.. హింసకు అడ్డుకట్టపడటం లేదు.

తాజాగా ఈ రోజు జరుగుతున్న పోలింగ్ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన ఏడుగురి హత్య జరిగింది. నలుగురు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలు చనిపోగా.. కూచ్ బెహార్ లో బీజేపీ పోలింగ్ ఏజెంట్ ని కాల్చి చంపారు. మరో సంఘటనలో సీపీఎం కార్యకర్త కోల్‌కతాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. మల్దా జిల్లాలో ఒక టీఎంసీ కార్యకర్త బాంబు దాడిలో మరణించాడు. ముర్షిదాబాద్, కూచ్ బెహార్, 24 పరగణ జిల్లాల్లో కూడా హింస చెలరేగింది. రిజినగర్, తుఫాన్ గంజ్, కాగ్రమ్ ప్రాంతాల్లో ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు కాల్చి చంపబడ్డారు. 24 పరగణ జిల్లాలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి బూల్ ఏజెంట్ చంపబడ్డాడు. ఈ హత్య వెనక టీఎంసీ అభ్యర్థి మున్నా బిబి ఉన్నట్లు ప్రజలు ఆరోపించారు.

రసాయన ఆయుధాలను ధ్వంసం చేసిన అమెరికా..

రసాయన ఆయుధాలతో భయాందోళనలు లేని ప్రపంచానికి ఒక అడుగు దగ్గరకు తీసుకువచ్చామని అమెరికా అధ్యక్షులు బిన్‌ జోబైడెన్‌ అన్నారు. రసాయన ఆయుధాల నిల్వలో ఉన్న చివరి మందుగుండు సామగ్రిని యునైటెడ్ స్టేట్స్ సురక్షితంగా నాశనం చేసిందని .. అందుకు తాను గర్వపడుతున్నానని బైడెన్ అన్నారు. 1997లో అమల్లోకి వచ్చిన రసాయన ఆయుధాల కన్వెన్షన్‌పై సంతకం చేసిన వారిలో యునైటెడ్ స్టేట్స్ చివరిదని.. తమ ప్రకటిత నిల్వలను నాశనం చేసే పనిని పూర్తి చేశామన్నారు. అయినప్పటికీ కొన్ని దేశాలు ఇప్పటికీ అమెరికా రసాయన ఆయుధాల రహస్య నిల్వలను కలిగి ఉన్నాయని నమ్ముతారని అన్నారు. రసాయన ఆయుధాల నిషేధ సంస్థ ఈ మైలురాయిని నిరాయుధీకరణ యొక్క చారిత్రక విజయంగా పేర్కొంది, మొదటి ప్రపంచ యుద్ధంలో రసాయన వాయువుల అనియంత్రిత వినియోగంతో ఒక శతాబ్దానికి పైగా సామూహిక మరణాలు మరియు సైనిక దళాల వైకల్యానికి దారితీసిందని పేర్కొన్నారు. యుఎస్ ప్రకటన అంటే ప్రపంచంలోని ప్రకటించబడిన రసాయన ఆయుధాల నిల్వలన్నీ కోలుకోలేని విధంగా నాశనం చేయబడినట్లు ధృవీకరించబడ్డాయని OPCW తెలిపింది. అంతర్జాతీయ కమ్యూనిటీకి ఈ గొప్ప విజయాన్ని అందించినందుకు తాను అన్ని దేశాను మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ఈ సందర్భంలో అభినందిస్తున్నానని OPCW డైరెక్టర్ జనరల్ ఫెర్నాండో అరియాస్ అన్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 9 వేల మంది మృతి..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 500 రోజుల మార్క్ ను చేరుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇరు దేశాలు కూడా ఇప్పటికిప్పుడు శాంతి ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం గతేడాది ఫిబ్రరి 24 న ప్రారంభమైన ఉక్రెయిన్ వార్ లో ఇప్పటి వరకు 9000 మంది పౌరులు మరణించారని తెలిపింది. ఇందులో 500 మంది చిన్నారులు చంపబడ్డారని యూఎన్ మానవహక్కుల పర్యవేక్షణ మిషన్(HRMMU) శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ముఖ్యంగా ఉక్రెయిన్ పౌరులు ఎక్కువగా చనిపోయారు. 2022తో పోలిస్తే ఈ ఏడాది మరణాల సంఖ్య తక్కువగా ఉంది.. అయితే మే, జూన్ నెల్లో మళ్లీ యుద్ధంలో మరణించేవారి సంఖ్య పెరిగినట్లు యూఎన్ పేర్కొంది. జూన్ 27న తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామాటోర్స్క్‌పై జరిగిన క్షిపణి దాడిలో నలుగురు చిన్నారులతో సహా 13 మంది పౌరులు మరణించారు. శుక్రవారం పశ్చిమ నగరమైన ఎల్వీవ్ పై రష్యా దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున దాడిలో కనీసం 37 మంది గాయపడ్డారు.

మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి నేడు. అయితే.. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ‘ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు.’ అని ఆయన పోస్ట్‌ చేశారు.

అయితే.. ఇడుపుల పాయలో వైఎస్సార్‌ ఘాట్ వద్ద ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ చేరుకుంటారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఇదిలాఉంటే, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఇడుపుల పాయలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఘాట్ వద్ద వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులర్పించనున్నారు.

గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్

వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ముందుగా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. అనంతరం కిషన్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. తెలంగాణ జాతీయ రహదారులకు కృషి చేశామన్నారు. కేంద్రం ఇటీవల రాష్ట్రానికి రైల్వే తయారీ యూనిట్‌ను కేటాయించిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంటీఎస్ కూడా కేటాయించామని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జాతీయ రహదారులు బాగుపడ్డాయన్నారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోడీ ప్రధాని కాకముందు తెలంగాణకు 2,500 కి.మీ ఉంటే ఇప్పుడు 5 వేల కి.మీలకు చేరుకుందన్నారు. 150 ఎకరాల్లో రైలు తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోజుకు 7 వ్యాగన్ల ఉత్పత్తి సామర్థ్యానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ. 500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, దాదాపు 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.

‘నేడు భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తి’ .. ప్రధాని మోడీ

తెలంగాణలోని చారిత్రక ప్రాంతమైన వరంగల్ నగరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించారు. ఇక్కడ ప్రసిద్ధ భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేశారు.ఈ సందర్భంగా వరంగల్లో రూ.6100కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన అనంతరం ప్రధాని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కొత్త లక్ష్యాల కోసం కొత్త బాటలు వేయాలని తెలంగాణ ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజల బలం భారతదేశ బలాన్ని ఎప్పుడూ పెంచుతుందని అన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంలో తెలంగాణ ప్రజల పాత్ర ఎంతో ఉందన్నారు.

రాజశేఖరరెడ్డి వెళుతూ వెళుతూ తన కొడుకును మనకు అప్పగించి వెళ్ళారు

తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో వై.య‌స్‌.రాజ‌శేఖ‌ర‌రెడ్డి 74వ జ‌యంతి వేడుకలు నిర్వహించారు. సెంట్రల్ ఆఫీసులో జయంతి వేడుకలతో పాటు, ప‌లు సేవా కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ నేతలు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు. అయితే.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి వెళుతూ వెళుతూ తన కొడుకును మనకు అప్పగించి వెళ్ళారన్నారు. ఇలాంటి కలయిక ప్రపంచం లోనే అరుదుగా ఉంటుందని ఆయన అన్నారు.

కలిసి ఉండి పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారంగా పరిగణించలేం..

సహజీవనంపై ఒరిస్సా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కలిసి ఉండీ సెక్స్ చేసుకుని వివాహం చేసుకుంటాననే వాగ్దానాన్ని ఉల్లంఘిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేం అని ఒడిశా హైకోర్టు వ్యాక్యానించింది. భువనేశ్వర్ కు చెందిన ఓ వ్యక్తి ఎదుర్కొంటున్న అత్యాచారం ఆరోపణల్ని కోర్టు కొట్టేసింది. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, కొన్నాళ్లు ఇద్దరు కలిసి ఉండీ, పరస్పర అంగీకారంతో శృంగారం కొనసాగించి, ఆ తరువాత వివాహం జరిగితే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

భర్తతో ఐదేళ్లుగా వివాదంలో ఉన్న ఒక యువతి, పిటిషనర్ కి స్నేహితురాలు. సదరు యువతి పిటిషనర్ పై అత్యాచార ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటాననే హామీ చిత్తశుద్ధితో ఇచ్చి ఆ తరువాత పెళ్లి చేసుకోకపోవడానికి, తప్పుడు వాగ్ధానానికి సూక్ష్మమైన తేడా ఉందని జస్టిస్ ఆర్కే పట్నాయక్ జూలై 3న తన తీర్పులో పేర్కొన్నారు. సదరు యువతి భర్తతో విడాకులు తీసుకోకుండా, ఒక వ్యక్తితో స్నేహం కారణంగా సంబంధాన్ని ఏర్పరుచుకున్న కేసులో ఈ తీర్పును హైకోర్టు వెలువరించింది. మహిళ తనపై మోపిన అత్యాచారం కేసును సవాల్ చేస్తూ ఆ వ్యక్తి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశాడు. ఇరువురు ఏడేళ్లపాటు సంబంధాన్ని కొనసాగించారు.

ఇప్పటికే ఆలస్యం జరిగింది.. బీఆర్‌ఎస్‌ను దించేది బీజేపీ నే

బీఆర్‌ఎస్‌ను దించేది బీజేపీ నే అని, ఇప్పటికే ఆలస్యం జరిగిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్‌ ను గద్దె దించేందుకు కేంద్ర పార్టీ సహకారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ను దించేది బీజేపీ నే అని అన్నారు. ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఈటల పేర్కొన్నారు. కొన్ని మీడియాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎప్పుడు ఒకటి కాదని తెలిపారు. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయి కర ఒప్పందం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం లోకి వచ్చేది బీజేపీ, ఇక్కడ ఎగిరేది కాషాయ జండా అని ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈటెల, బండి మాట్లాడుతున్నప్పుడు సీఎం, సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడంతో సంచలనంగా మారింది.

ప్రధాని కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారు?.. బీఆర్ఎస్ పై కిషన్ రెడ్డి ఫైర్..

ప్రధాని మోడీ కార్యక్రమాన్ని అధికార బీఆర్ఎస్ ఎందుకు బహిష్కరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైల్వే ఫ్యాక్టరీ ద్వారా 3 వేల ఉద్యోగాలు వస్తాయని బహిష్కరిస్తున్నారా? రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినందుకు బహిష్కరిస్తున్నారా? ఆయన అడిగాడు. ఈ రాష్ట్రంలో ముందుగా కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలి.. హామీలను తుంగలో తొక్కిన కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరించాలని మండిపడ్డారు. అంతేకాకుండా.. ఉచిత ఎరువులు ఇవ్వనందుకు తెలంగాణ రైతులు కేసీఆర్‌ను బహిష్కరిస్తారు. రుణమాఫీ చేయనందుకు రైతులు కేసీఆర్‌ను బహిష్కరిస్తారు. కేసీఆర్ కుటుంబాన్ని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేసే రోజు ఎంతోదూరంలో లేదని అన్నారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • cm jagan
  • sajjala ramakrishna reddy
  • telugu news
  • Top Headlines @1PM

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions