Janasena: జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత!
Producer Kayagurala Lakshmipathi Joins Janasena: కేఎల్పీ మూవీస్ సంస్థ అధినేత, నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు. సోమవారం (జనవరి 29) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీపతి తండ్రి గారు కీ.శే. శ్రీ కె. నారాయణస్వామి గారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి గారి స్ఫూర్తితో నిర్మాత లక్ష్మీపతి కూడా ప్రజాసేవ చేయడానికి నేడు జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీలో చేరిన సందర్భంగా కాయగూరలు లక్ష్మీపతి మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో అభిమానం. గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నా. సినిమా అంటే ఇష్టంతో ఐక్యూ సినిమాను నిర్మించా. ఇంకా రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ లభిస్తోంది. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. బిజినెస్ రంగంలో నాకు సపోర్ట్ చేస్తున్న నా తోటి మిత్రులకు కృతజ్ఞతలు. సినిమాలు నిర్మిస్తూనే.. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తా. ప్రజల కోసం పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. జనసేన పార్టీ నుంచి ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు.
Also Read
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
- Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
- CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్పాట్.!
- Rahul Gandhi: బెంగాల్ కాంగ్రెస్ నాయకులపై రాహుల్గాంధీ ఫైర్.. ఏం జరిగిందంటే..!
Also Read: MK Stalin-Djokovic: ఆకాశంలో ఆశ్చర్యం.. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ను కలిసిన తమిళనాడు సీఎం!
కాయగూరల లక్ష్మీపతి గతంలో ఆర్టిఏ బోర్డు మెంబర్గా, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్గా అనంతపురం పట్టణ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేశారు. అనంతపురంలో ప్రభుత్వ స్థలంలో శాశ్వత ఆర్టిఓ కార్యాలయంను నిర్మించుటకు కృషి చేసి.. నిర్మాణం పూర్తి చేశారు. టెలికం ఎస్టిడి, ఐఎస్డి కమిటీ మెంబర్గా పని చేసిన కాలంలో పార్టీ కార్యకర్తలకు ఎస్టిడి బూతులు కేటాయించి బ్యాంకు రుణాలు ఇప్పించారు. కెఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో పేదలకు నీళ్ల ట్యాంకు నిర్మాణం, దుప్పట్లు, చేతి కర్రలు పంచారు. అఖిలభారత కాపు సమాఖ్యలో ప్రధాన కార్యదర్శిగా ఉంటూ.. కాపు, బలిజల సంఘాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
తాజావార్తలు
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
-
Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
-
Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
-
CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్పాట్.!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!