Janasena: జనసేన పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Producer Kayagurala Lakshmipathi Joins Janasena: కేఎల్పీ మూవీస్ సంస్థ అధినేత, నిర్మాత కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరారు. సోమవారం (జనవరి 29) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీపతి తండ్రి గారు కీ.శే. శ్రీ కె. నారాయణస్వామి గారు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ మనుగడకై, ప్రజాసేవకై కృషి చేసిన వ్యక్తి. తన తండ్రి గారి స్ఫూర్తితో నిర్మాత లక్ష్మీపతి కూడా ప్రజాసేవ చేయడానికి నేడు జనసేన పార్టీలో చేరారు.
జనసేన పార్టీలో చేరిన సందర్భంగా కాయగూరలు లక్ష్మీపతి మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో అభిమానం. గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొన్నా. సినిమా అంటే ఇష్టంతో ఐక్యూ సినిమాను నిర్మించా. ఇంకా రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ లభిస్తోంది. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. బిజినెస్ రంగంలో నాకు సపోర్ట్ చేస్తున్న నా తోటి మిత్రులకు కృతజ్ఞతలు. సినిమాలు నిర్మిస్తూనే.. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తా. ప్రజల కోసం పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. జనసేన పార్టీ నుంచి ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు.
Also Read
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
Also Read: MK Stalin-Djokovic: ఆకాశంలో ఆశ్చర్యం.. టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ను కలిసిన తమిళనాడు సీఎం!
కాయగూరల లక్ష్మీపతి గతంలో ఆర్టిఏ బోర్డు మెంబర్గా, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్గా అనంతపురం పట్టణ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు సేవ చేశారు. అనంతపురంలో ప్రభుత్వ స్థలంలో శాశ్వత ఆర్టిఓ కార్యాలయంను నిర్మించుటకు కృషి చేసి.. నిర్మాణం పూర్తి చేశారు. టెలికం ఎస్టిడి, ఐఎస్డి కమిటీ మెంబర్గా పని చేసిన కాలంలో పార్టీ కార్యకర్తలకు ఎస్టిడి బూతులు కేటాయించి బ్యాంకు రుణాలు ఇప్పించారు. కెఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సొంత ఖర్చులతో పేదలకు నీళ్ల ట్యాంకు నిర్మాణం, దుప్పట్లు, చేతి కర్రలు పంచారు. అఖిలభారత కాపు సమాఖ్యలో ప్రధాన కార్యదర్శిగా ఉంటూ.. కాపు, బలిజల సంఘాల కోసం రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
తాజావార్తలు
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
-
Nandini Reddy: “నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి..” పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
-
DSP Bheem Reddy : విల్లాలు.. ఫ్లాట్లు.. కిలోల బంగారం.. డీఎస్పీ ఆస్తుల లెక్క ఇదే!
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!