Today Stock Market Roundup 17-03-23: CEO రిజైన్.. TCS డౌన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup 17-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాన్ని లాభాలతో ముగించింది. ట్రేడింగ్కి సంబంధించి.. వీకెండ్ రోజైన ఇవాళ శుక్రవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు రావటంతో శుభారంభం లభించింది. కానీ.. ఇంట్రాడేలో ఊగిసలాటకు గురయ్యాయి. చివరికి పాజిటివ్ జోన్లోకి టర్న్ అయ్యాయి.
దీంతో నిఫ్టీ మిడ్క్యాప్100, స్మాల్క్యాప్100.. సున్నా పాయింట్ 6 శాతం పెరిగాయి. రంగాల వారీగా చూసుకుంటే.. నిఫ్టీ ఐటీ, రియాల్టీ ఇండెక్స్లు రాణించాయి. మీడియా సూచీ మాత్రం ఘోరంగా దెబ్బతిన్నది. 2 శాతం పడిపోయింది. వ్యక్తిగత స్టాక్స్ను పరిశీలిస్తే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టాక్ విలువ ఒక శాతం డౌన్ అయింది. తద్వారా ఒక నెల కనిష్టానికి పతనమైంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
read more: AP Budget: A to Z ఏపీ బడ్జెట్
ఎండీ అండ్ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేయటం ఈ సంస్థకు కొంచెం మైనస్ అయింది. స్టెర్లింగ్ టూల్స్ కంపెనీ షేర్ విలువ పది శాతం ర్యాలీ తీసింది. ఫలితంగా ఐదేళ్ల గరిష్టానికి.. అంటే.. 392 రూపాయల 60 పైసలకి చేరింది. చివరికి.. సెన్సెక్స్ 355 పాయింట్లు పెరిగి 57 వేల 989 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ.. 114 పాయింట్లు పెరిగి 17 వేల 100 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ మంచి పనితీరు కనబరచగా.. టీసీఎస్, హెచ్యూఎల్, రిలయెన్స్ వెనకబడ్డాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో అల్ట్రాటెక్, హిండాల్కో, నెస్లె ఇండియా, జేఎస్డబ్ల్యూ లాభాలు ఆర్జించగా పవర్గ్రిడ్, హెచ్యూఎల్, ఎన్టీపీసీ నష్టాల బాట పట్టాయి. 10 గ్రాముల బంగారం రేటు 252 రూపాయలు పెరిగింది.
గరిష్టంగా 58 వేల 258 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 569 రూపాయలు పెరిగి అత్యధికంగా 67 వేల 100 రూపాయలు పలికింది. క్రూడాయిల్ రేటు అతిస్వల్పంగా 15 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడిచమురు 5 వేల 710 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 33 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 46 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!