Pakistan: పాక్ పౌరులకు నేడే లాస్ట్ డే.. ఒక్క మహారాష్ట్రలోనే 5 వేల మంది పాకిస్థానీయులు..
- పహల్గాం ఉగ్రవాద దాడిపై భారత్ కఠిన చర్యలు
- పాక్ పౌరులకు నేడే లాస్ట్ డే
- మహారాష్ట్రలోనే 5 వేల మంది పాకిస్థానీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్థాన్పై కఠినంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న పౌక్ దేశస్థులు ఈనెల 27వ తేదీ(ఆదివారం) లోపు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక మెడికల్ వీసాల మీద వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం మరో రెండు రోజుల సమయం ఇచ్చారు. ఇలాంటి వారు ఈనెల 29వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇప్పటికే భారత్, పాక్ సరిహద్దుల్లో ఉన్న అట్టారీ బోర్డర్ను కూడా కేంద్ర ప్రభుత్వం మూసివేసింది.
READ MORE: Rakul Preet Singh : దేవుడి దయవల్ల నాకు దాని అవసరం రాలేదు..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
కాగా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 5 వేల మంది పాకిస్థాన్ పౌరులు.. దేశం విడిచి వెళ్లాలని సూచించినట్లు మహారాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో దీర్ఘకాలిక వీసాలపై దాదాపు 4 వేల మంది పాకిస్థానీయులు ఉండగా.. సార్క్ వీసా కింద మరో 1000 మంది ఉన్నారని తెలుస్తోంది. ఈ వెయ్యి మందిలో సినిమా ఇండస్ట్రీ, మెడికల్, జర్నలిజం, వ్యక్తిగత పనుల కోసం మహారాష్ట్రకు వచ్చిన వారు ఉన్నారట. వీరిలో కొందరు గత 8 నుంచి 10 ఏళ్లుగా మన దేశంలోనే ఉంటున్నారు.
READ MORE: Merugu Nagarjuna : ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారు
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 250 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు లెక్క తేల్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 208 మంది, సైబరాబాద్ పరిధిలో 39 మంది, రాచకొండ పరిధిలో ముగ్గురు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఇందులో పర్యాటక వీసాలపై వచ్చిన వారి సంఖ్య స్వల్పమే. ఎక్కువ మంది దీర్ఘకాలిక వీసాలపై ఉంటున్నారు. మినహాయింపు ఉన్న వారు, దీర్ఘకాలిక వీసాలపై వచ్చిన వారు మినహా మిగతా వారంతా గడువులోగా పాకిస్థాన్ వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!