Pakistan: పాక్ పౌరులకు నేడే లాస్ట్ డే.. ఒక్క మహారాష్ట్రలోనే 5 వేల మంది పాకిస్థానీయులు..
- పహల్గాం ఉగ్రవాద దాడిపై భారత్ కఠిన చర్యలు
- పాక్ పౌరులకు నేడే లాస్ట్ డే
- మహారాష్ట్రలోనే 5 వేల మంది పాకిస్థానీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్థాన్పై కఠినంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న పౌక్ దేశస్థులు ఈనెల 27వ తేదీ(ఆదివారం) లోపు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక మెడికల్ వీసాల మీద వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం మరో రెండు రోజుల సమయం ఇచ్చారు. ఇలాంటి వారు ఈనెల 29వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇప్పటికే భారత్, పాక్ సరిహద్దుల్లో ఉన్న అట్టారీ బోర్డర్ను కూడా కేంద్ర ప్రభుత్వం మూసివేసింది.
READ MORE: Rakul Preet Singh : దేవుడి దయవల్ల నాకు దాని అవసరం రాలేదు..
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
కాగా.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 5 వేల మంది పాకిస్థాన్ పౌరులు.. దేశం విడిచి వెళ్లాలని సూచించినట్లు మహారాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో దీర్ఘకాలిక వీసాలపై దాదాపు 4 వేల మంది పాకిస్థానీయులు ఉండగా.. సార్క్ వీసా కింద మరో 1000 మంది ఉన్నారని తెలుస్తోంది. ఈ వెయ్యి మందిలో సినిమా ఇండస్ట్రీ, మెడికల్, జర్నలిజం, వ్యక్తిగత పనుల కోసం మహారాష్ట్రకు వచ్చిన వారు ఉన్నారట. వీరిలో కొందరు గత 8 నుంచి 10 ఏళ్లుగా మన దేశంలోనే ఉంటున్నారు.
READ MORE: Merugu Nagarjuna : ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారు
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 250 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు లెక్క తేల్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 208 మంది, సైబరాబాద్ పరిధిలో 39 మంది, రాచకొండ పరిధిలో ముగ్గురు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఇందులో పర్యాటక వీసాలపై వచ్చిన వారి సంఖ్య స్వల్పమే. ఎక్కువ మంది దీర్ఘకాలిక వీసాలపై ఉంటున్నారు. మినహాయింపు ఉన్న వారు, దీర్ఘకాలిక వీసాలపై వచ్చిన వారు మినహా మిగతా వారంతా గడువులోగా పాకిస్థాన్ వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!