ఇండియాలో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన.. పసిడి ధరలు ఇవాళ కూడా ఎగిసి పడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 45, 200 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 220 పెరిగి రూ. 49, 150 కి చేరింది. అయితే… బంగారం ధర పెరిగితే…వెండి ధరలు మాత్రం ఇవాళ కాస్త తగ్గాయి. కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 70,200 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.