Today (27-12-22) Stock Market Roundup: వరుసగా రెండో రోజూ కొనసాగిన శాంతాక్లాజ్ ర్యాలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (27-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో క్రిస్మస్ మరుసటి రోజు నుంచి.. అంటే.. గడచిన రెండు రోజులుగా లాభాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ట్రెండ్ను శాంతాక్లాజ్ ర్యాలీగా పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్ నుంచి కూడా ఇవాళ సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. చైనాలో సైతం కొవిడ్ సంబంధిత ఆంక్షలను మరింతగా సడలిస్తున్నట్లు ప్రకటించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు బూస్ట్లా పనిచేసింది. దీంతో రెండు సూచీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో గ్రోత్ నమోదు చేశాయి.
సెన్సెక్స్ 361 పాయింట్లు పెరిగి 60,927 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 117 పాయింట్లు ప్లస్సయి 18,132 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బీఎస్ఈలోని మొత్తం 30 షేర్లలో టాటా స్టీల్ స్టాక్స్ విలువ 6 శాతానికి పైగా పెరిగింది. టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, విప్రో, లార్సన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ లాభాలను ఆర్జించాయి.
Also Read
- Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
read also: BookMyShow Report: సౌత్ సినిమాల మనీ సునామీ.. ఆసక్తికరంగా బుక్మైషో రిపోర్ట్
ఈ సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ షేర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. నిఫ్టీలో FACT, ధని సర్వీసెస్, జేబీఎం ఆటో, జిందాల్ స్టీల్, సీసీఎల్ ప్రొడక్ట్స్ లాభపడ్డాయి. అమరరాజా బ్యాటరీస్, యురేకా ఫోర్బ్స్, బ్రైట్కామ్ గ్రూప్, క్రిష్ణా ఇన్స్టిట్యూషన్స్, వరుణ్ బేవరేజెస్ నష్టపోయాయి.
రంగాల వారీగా పరిశీలిస్తే బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ నాలుగున్నర శాతానికి పైగా ప్రాఫిట్స్ పొందింది. కమోడిటీస్, టెలికం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు కూడా మంచి పనితీరు కనబరిచాయి. ఒక శాతానికి పైగానే లబ్ధి పొందాయి.
10 గ్రాముల బంగారం ధర 158 రూపాయలు పెరిగి అత్యధికంగా 54 వేల 835 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు ఏకంగా వెయ్యి రూపాయలు లాభపడటం విశేషం. తద్వారా 70 వేల రూపాయలు దాటి చివరికి 70 వేల ఒక వంద వద్ద గరిష్ట ధర నమోదైంది. రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 79 పైసల వద్ద ఉంది.
తాజావార్తలు
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!