Tirupati: తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు కానుంది.. ఈ మేరకు బస్టాండ్లో పర్యటించింది ఎన్హెచ్ఎల్ ఎం కమిటీ. కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రా తో కలిసి ఎంపి గురుమూర్తి పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను వివరించారు ఎంపీ గురుమూర్తి. నూతన బస్టాండ్ డిజైన్స్పై త్వరలో సీఎం చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో నూతన బస్టాండ్ను పూర్తి చేస్తామని ఎన్హెచ్ సీఈఓ ప్రకాష్ గౌర్ చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. ప్రయాణికులనే కాదు భక్తులను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ నిర్మాణం అన్నారు. భక్తులు సేదతీరేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని.. ఫుడ్ కోర్టు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్ తదితర ఏర్పాట్లు నూతన టెర్మినల్ భవనంలో ఉంటాయని చెప్పారు.
Read Also: Srisailam Project: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు
ఎన్హెచ్ఎల్ఎం కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రాతో కలిసి ఎంపీ గురుమూర్తి బస్టాండ్లో పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను తిరుపతి ఎంపీ గురుమూర్తి వివరించారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. బస్టాండ్ను అధునాతనంగా రూపొందించనున్నారని.. కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశంతో అధికారులు ఇవాళ బస్టాండ్ను పరిశీలించారని వెల్లడించారు. గత ఏడాదే కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉండేదని.. ఎన్నికల కోడ్ కారణంగా బస్టాండ్ పనులు నిలిచాయన్నారు. డిజైన్స్లో మార్పులు చేర్పులతో ప్రస్తుతం లేట్ అవుతోందన్నారు. కొత్త బస్టాండ్ నిర్మాణానికి మాజీ సీఎం జగన్ కారకులని తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఎ ప్రభుత్వం లేట్ చేయకుండా డిజైన్స్ ఆమోదించి టెండర్లు పిలవాలన్నారు. కేంద్ర సహకారం ఈ బస్టాండ్ నిర్మాణానికి అవసరమని తెలిపారు.
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-25-at-2.38.09-PM.mp4?_=1