Drunk Violence In Tirupati: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మందు బాబులు బరితెగించారు. కేశవాయన గుంటలో నడి రోడ్డుపై కారు నిలిపి, బహిరంగంగా మద్యం సేవిస్తూ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. అదే సమయంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తున్న ఓ రోగి కుటుంబం, కారును పక్కకు తీయాలని కోరినందుకు వారిపై బూతు పురాణం ఎత్తుకున్నాడు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు.. ఏకంగా రోగి కుటుంబ సభ్యుల పైకి కారు ఎక్కించారు. ఈ ప్రమాదంలో తొండవాడకు చెందిన లవ కుమార్, తేజస్వీనీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Read Also: Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ బడ్జెట్ రికార్డులు.. ఆమె చదువు, నేపథ్యం ఇదే..
అయితే, మందు బాబులను అడ్డుకోబోయిన స్థానికులను సైతం కత్తులతో బెదిరిస్తూ భయాందోళనకు గురి చేశారు. నిందితుల దాడి నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నించగా, సినిమా ఫక్కీలో వారి కారును వెంబడించి వేధించారు. ప్రాణభయంతో బాధితులు నేరుగా ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో, నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నడి రోడ్డుపై కత్తులతో దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.