AP Elections: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
- తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
- 50 మంది సభ్యులలో కేవలం 22 మంది మాత్రమే హాజరు.
- ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం (50%) లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్య పరిణామాలతో వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ, 50 మంది సభ్యులలో కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం (50%) లేకపోవడంతో ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. తిరుపతి రాజకీయాలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠకు గురయ్యాయి. ఆదివారం రాత్రి కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆరోపణల ప్రకారం, కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా హోటళ్లకు తరలించారని తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read: Bunny Vasu: పవన్ కళ్యాణ్ ఒకసారి పక్కన పెడితే కష్టం.. బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు!
Also Read
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తులు సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
కూటమి నుంచి మునికృష్ణను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించగా, వైసీపీ చివరి నిమిషంలో లడ్డు భాస్కర్ను రంగంలోకి దించింది. అయితే, వైసీపీ అభ్యర్థికి మద్దతు తగ్గడంతో వారి కార్పొరేటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. కూటమికి 30 మంది కార్పొరేటర్ల మద్దతు ఉండగా, వైసీపీ మేయర్ అభ్యర్థి వైపు కార్పొరేటర్లు పెద్దగా ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగాల్సి ఉంది. కూటమి కార్పొరేటర్లు ముందుగానే హాజరయ్యారు. అయితే, వైసీపీ కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో ఎన్నికా కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడి, కొందరు అనుచరులు బస్సుపై దాడి చేసి కార్పొరేటర్లను కారులో తీసుకెళ్లారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటన తర్వాత వైసీపీ కార్పొరేటర్లు, మేయర్, ఎంపీ ఈ ఎన్నికలను బహిష్కరించారు. తమ కార్పొరేటర్లను విడుదల చేయకుండా ఎన్నికలు జరిగితే, న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ మరింత పెరిగింది. రేపటి ఎన్నికలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తులు సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!