AP Elections: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
- తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
- 50 మంది సభ్యులలో కేవలం 22 మంది మాత్రమే హాజరు.
- ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం (50%) లేకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అనూహ్య పరిణామాలతో వాయిదా పడింది. సోమవారం ఉదయం 11 గంటలకు షెడ్యూల్ ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ, 50 మంది సభ్యులలో కేవలం 22 మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్నికలు నిర్వహించడానికి కనీస కోరం (50%) లేకపోవడంతో ఎన్నికల అధికారి, జేసీ శుభం బన్సల్ ఎన్నికను రేపటికి వాయిదా వేశారు. తిరుపతి రాజకీయాలు గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠకు గురయ్యాయి. ఆదివారం రాత్రి కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆరోపణల ప్రకారం, కూటమి నేతలు వైసీపీ కార్పొరేటర్లను బలవంతంగా హోటళ్లకు తరలించారని తెలిపారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read: Bunny Vasu: పవన్ కళ్యాణ్ ఒకసారి పక్కన పెడితే కష్టం.. బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు!
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
కూటమి నుంచి మునికృష్ణను డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించగా, వైసీపీ చివరి నిమిషంలో లడ్డు భాస్కర్ను రంగంలోకి దించింది. అయితే, వైసీపీ అభ్యర్థికి మద్దతు తగ్గడంతో వారి కార్పొరేటర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. కూటమికి 30 మంది కార్పొరేటర్ల మద్దతు ఉండగా, వైసీపీ మేయర్ అభ్యర్థి వైపు కార్పొరేటర్లు పెద్దగా ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగాల్సి ఉంది. కూటమి కార్పొరేటర్లు ముందుగానే హాజరయ్యారు. అయితే, వైసీపీ కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో ఎన్నికా కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడి, కొందరు అనుచరులు బస్సుపై దాడి చేసి కార్పొరేటర్లను కారులో తీసుకెళ్లారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటన తర్వాత వైసీపీ కార్పొరేటర్లు, మేయర్, ఎంపీ ఈ ఎన్నికలను బహిష్కరించారు. తమ కార్పొరేటర్లను విడుదల చేయకుండా ఎన్నికలు జరిగితే, న్యాయపోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ మరింత పెరిగింది. రేపటి ఎన్నికలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్కు గుడ్బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!