Tragedy : భర్తపై మరిగే నూనె పోసిన భార్య..
- కుటుంబ కలహాలు, అనుమానం భూతం
- పోలీసుల రాజీ, పదిలం కాని సంసారం
- తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన భర్త
Tragedy : తిరునల్వేలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తపైనే కాచి వడబోసిన నూనె పోసి అత్యంత దారుణంగా గాయపరిచింది ఓ భార్య. పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో రగిలిపోయిన భార్య, క్షణికావేశంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ బాలుసుబ్రమణియన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ప్రస్తుతం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృష్ణపురానికి చెందిన 42 ఏళ్ల బాలుసుబ్రమణియన్ ఆటో డ్రైవర్. అతని భార్య మత్తలక్ష్మి (34). ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. చాలా కాలంగా భర్త బాలుసుబ్రమణియన్కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని మత్తలక్ష్మి అనుమానిస్తోంది.
Maoists : ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
ఈ విషయమై గతంలో అనేకసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. 25 రోజుల క్రితం కూడా తీవ్రంగా గొడవపడి, పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది మత్తలక్ష్మి. ఈ వివాదం నెల్లై మహిళా పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి, రాజీ కుదిర్చారు. నాలుగు రోజుల క్రితమే మత్తలక్ష్మి తిరిగి భర్త ఇంటికి వచ్చింది. అంతా సద్దుమణిగింది అనుకున్న సమయంలో, నిన్న (మే 30) ఉదయం మళ్ళీ భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది. గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన మత్తలక్ష్మి ఏమాత్రం ఆలోచించకుండా వంటగదిలోకి వెళ్లి, స్టవ్పై మరుగుతున్న నూనెను తీసుకెళ్లి బాలుసుబ్రమణియన్ పై పోసింది.
మరుగుతున్న నూనె ఒంటిపై పడటంతో బాలుసుబ్రమణియన్ తీవ్రమైన నొప్పితో హాహాకారాలు చేశాడు. అతని అరుపులు విన్న చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి, అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై శివంతిపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మత్తలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో, బాలుసుబ్రమణియన్కు వేరే మహిళతో సంబంధం ఉందని మత్తలక్ష్మి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానం, ఆవేశం ఒక కాపురాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
IPL 2025 Qualifier 2: ముంబై vs పంజాబ్ మ్యాచ్ కు వర్షం అడ్డుకాబోతుందా.. అయితే ఫైనల్ చేరుకునేది ఎవరు?
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?