Tragedy : భర్తపై మరిగే నూనె పోసిన భార్య..
- కుటుంబ కలహాలు, అనుమానం భూతం
- పోలీసుల రాజీ, పదిలం కాని సంసారం
- తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : తిరునల్వేలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తపైనే కాచి వడబోసిన నూనె పోసి అత్యంత దారుణంగా గాయపరిచింది ఓ భార్య. పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో రగిలిపోయిన భార్య, క్షణికావేశంలో ఈ ఘాతుకానికి పాల్పడింది. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ బాలుసుబ్రమణియన్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ప్రస్తుతం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృష్ణపురానికి చెందిన 42 ఏళ్ల బాలుసుబ్రమణియన్ ఆటో డ్రైవర్. అతని భార్య మత్తలక్ష్మి (34). ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. చాలా కాలంగా భర్త బాలుసుబ్రమణియన్కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని మత్తలక్ష్మి అనుమానిస్తోంది.
Maoists : ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
ఈ విషయమై గతంలో అనేకసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. 25 రోజుల క్రితం కూడా తీవ్రంగా గొడవపడి, పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది మత్తలక్ష్మి. ఈ వివాదం నెల్లై మహిళా పోలీస్ స్టేషన్కు చేరింది. పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి, రాజీ కుదిర్చారు. నాలుగు రోజుల క్రితమే మత్తలక్ష్మి తిరిగి భర్త ఇంటికి వచ్చింది. అంతా సద్దుమణిగింది అనుకున్న సమయంలో, నిన్న (మే 30) ఉదయం మళ్ళీ భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది. గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన మత్తలక్ష్మి ఏమాత్రం ఆలోచించకుండా వంటగదిలోకి వెళ్లి, స్టవ్పై మరుగుతున్న నూనెను తీసుకెళ్లి బాలుసుబ్రమణియన్ పై పోసింది.
మరుగుతున్న నూనె ఒంటిపై పడటంతో బాలుసుబ్రమణియన్ తీవ్రమైన నొప్పితో హాహాకారాలు చేశాడు. అతని అరుపులు విన్న చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి, అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై శివంతిపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మత్తలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో, బాలుసుబ్రమణియన్కు వేరే మహిళతో సంబంధం ఉందని మత్తలక్ష్మి అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానం, ఆవేశం ఒక కాపురాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందో చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తోంది.
IPL 2025 Qualifier 2: ముంబై vs పంజాబ్ మ్యాచ్ కు వర్షం అడ్డుకాబోతుందా.. అయితే ఫైనల్ చేరుకునేది ఎవరు?
తాజావార్తలు
-
Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
-
Akshay Kumar: నవ్వులు కాదు.. ఈసారి భయపెట్టేందుకు వస్తున్న అక్షయ్ కుమార్… ఈరోజే ‘హైవానియత్’ టీజర్
-
SPIRIT : స్పిరిట్ కర్నాటక థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన టాలీవుడ్ నిర్మాత
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!