Collector Dilli Rao: స్ట్రాంగ్ రూమ్స్ కి సీల్ వేశాం.. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collector Dilli Rao: ఎన్టీఆర్ జిల్లాలో 27 స్ట్రాంగ్ రూములు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, మైలవరం నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లకు సీల్ వేశామన్నారు. మిగిలినవి కూడా మరి కొద్దిసేపట్లో సీల్ వేయడం జరుగుతుంది అని వెల్లడించారు. వెంటిలేటర్లు, విండోలు అన్నీ సీల్ వేసాం.. రెండు లాక్ లు ఉంటాయి.. ఒక లాక్ కలెక్టర్ ప్రతినిధి దగ్గర మరో లాక్ ఆర్ఓ దగ్గర ఉంటాయన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్, స్టేట్ పోలీస్ ఫోర్స్ కంట్రోల్ లో ఉంటుంది.. ప్రతీ రోజూ ఇద్దరు ఎంఆర్ఓలు, రిటర్నింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు.. అన్ని రకాల ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నాం.. జిల్లా వ్యాప్తంగా 80.11 శాతం వరకూ వచ్చిందని అంచనా.. జగ్గయ్యపేటలో 90 శాతం దగ్గరలో పోలింగ్ జరిగినట్టు తెలిసింది అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పుకొచ్చారు.
Read Also: Modi: వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని.. హాజరైన ప్రముఖులు
Also Read
- Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
- Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
అలాగే, ఉమ్మడి కృష్ణాజిల్లాలో అర్థరాత్రి వరకు పోలింగ్ జరిగిందని అధికారులు చెప్పుకొచ్చారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని 4 పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 11 వరకు పోలింగ్ జరగ్గా.. మైలవరం నియోజకవర్గంలో నాలుగైదు పోలింగ్ స్టేషన్లో రాత్రి 9:30 వరకు.. గన్నవరం నియోజకవర్గంలో పలు పోలింగ్ స్టేషన్లో రాత్రి 11:00 దాకా.. ఇక, మచిలీపట్నం నియోజకవర్గంలో రెండు పోలింగ్ బూత్లో అర్థరాత్రి 12 గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. కాగా, తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్లో రాత్రి 11 గంట వరకు.. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నైట్ 10 వరకు జరిగ్గా.. చివరగా, పెనమలూరు నియోజకవర్గంలో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎలక్షన్ కమిషన్ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Dil Raju: 300 కోట్ల బడ్జెట్లో భారీ వాటా హీరోకే.. టాలీవుడ్పై దిల్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!