Nelakota Hill Tiger: నేలకోట కొండపై తిష్ట.. స్థానికుల కంటపడిన మన్యం పులి!
- నేలకోట కొండపై తిష్ట వేసిన పెద్దపులి
- స్థానికుల కంటపడిన పెద్దపులి
- 4 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో నేలకోట కొండపై తిష్ట వేసిన పెద్దపులి స్థానికుల కంటపడింది. ప్రస్తుతం రామదుర్గం కొండ పైన మకాం వేసిన పెద్దపులిని స్థానికులు వీడియో తీశారు. మనుషుల్ని చూసిన పెద్దపులి ఎలాంటి దాడి చేయకుండా వెనుకడుగు వేసింది. పాపికొండల అభయారణ్యం నుంచి బయటికి వచ్చిన తర్వాత గత 40 రోజులుగా సంచారం చేస్తూ దేవీపట్నం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఖాళీ చేసిన గ్రామాల వద్దకు పెద్దపులి చేరుకుంది. నాలుగు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చి మైదాన ప్రాంతంలోని సీతానగరం మండలం పెద్ద కొండేపూడి పరిసర గ్రామాల వద్దకు రావడంతో కలకలం ఏర్పడింది.
Also Read: Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా కొడతాం!
Also Read
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ పోలవరం జిల్లా నేలకోట అటవీ ప్రాంతంలోకి చేరుకోవడంతో పోచమ్మగండి-శరభవరం పరిసర గిరిజన గ్రామాల్లో అటవీశాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అవసరం లేకుండా అడవి ప్రాంతాలకు వెళ్లొద్దని, గుంపులుగా మాత్రమే సంచరించాలని సూచించారు. అటవీశాఖ ప్రత్యేక బృందాలు పెద్దపులికి అమర్చిన రేడియో కాలర్ నుంచి వస్తున్న సిగ్నల్స్ ద్వారా వెంబడిస్తున్నారు. మరోవైపు కొండపై తిష్ట వేసిన ఈ పెద్ద పులికి ఆహారం లేదని అంచనా వేస్తున్నారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో స్థానిక పోలవరం నిర్వాసితు ప్రజలు వ్యవసాయం పనులకు వెళ్లలేకపోతున్నారు. తమ పశువులపై పంజా విసురుతుందని భయపడుతున్నారు.
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!