Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా కొడతాం!
- గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం
- టైటాన్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 15 పరుగులు
- రాజస్థాన్కు ఊహించని విజయాన్ని అందించిన ఆర్చర్, తుషార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag Hails Archer and Deshpande: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్పై సాధించిన ఉత్కంఠ భరిత విజయంపై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు. మ్యాచ్ ఒక దశలో తమ చేతిలో నుంచి జారిపోతుందని అనిపించిందని, కానీ చివరి ఓవర్లలో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో విజయం సాధించగలిగామని తెలిపాడు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్పాండేలు దేవుడిలా వచ్చి కాపాడారని పరాగ్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో బౌలర్లే హీరోలు అని రాయల్స్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. టైటాన్స్ విజయానికి చివరి 2 ఓవర్లలో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. ఆర్చర్, తుషార్ చెరో 4 పరుగులే ఇచ్చి రాజస్థాన్కు ఊహించని విజయాన్ని అందించారు.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ… ‘ఇది నిజంగా అద్భుతంగా అనిపించింది. ఒక దశలో నేను రిస్క్ తీసుకుందామని భావించాను. మా ఆటగాళ్లు ప్లాన్ను అద్భుతంగా అమలు చేశారు. నా గొంతు కూడా మారిపోయేంతగా నేను అరిచాను. ప్లేయర్స్ నేను అనుకున్న విధంగా ఆడినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. 19వ, 20వ ఓవర్లలో ఎవరు బౌలింగ్ చేయాలన్న విషయంలో నేను కాస్త అయోమయంలో ఉన్నా. ఆ సమయంలో 12 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. దూకుడుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాను. అది సక్సెస్ అయితే బాగుంటుంది, లేదంటే తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాం అనుకున్నాను. అయితే ధృవ్ జురెల్ వచ్చి అంతా సెట్ చేశాడు. 19వ ఓవర్ను ఆర్చర్కు ఇవ్వాలని సూచించాడు. అది సక్సెస్ అయింది’ అని చెప్పాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
Also Read: Araku Valley Earthquake: అరకు లోయలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు.. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీసిన జనాలు!
‘ధృవ్ జురెల్ ప్రతిభకు ఇప్పటివరకు పూర్తిగా న్యాయం జరగలేదని నాకు అనిపిస్తుంది. అతను 6వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ కష్టమైన పాత్ర పోషించాడు. కానీ ఈసారి మూడో స్థానంలో అవకాశం ఇచ్చినప్పుడు తన సత్తా నిరూపించుకున్నాడు. అతను జురెల్ 700-800 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాలని ఆశిస్తున్నాను. వరుసగా రెండు మ్యాచ్లు గెలవడం ఆనందంగా ఉంది. ఈ విజయంలో పూర్తి క్రెడిట్ బౌలర్లకే చెందుతుంది. ఈ రోజు విజయాన్ని బాగా జరుపుకుంటాం. కానీ రేపు ఉదయం నుంచి తర్వాతి మ్యాచ్పై దృష్టి పెట్టాలి. ముంబైపై ఎలా ఆడాలో ప్లాన్ చేస్తాం. ఈసారి గట్టిగా కొడతాం’ అని రియాన్ పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!