West Bengal: శివుడికి గంగాజలం తీసుకొస్తామని వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ లో రెండు వేర్వేరు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. శివుడికి మొక్కుబడి ఉందని గంగాజలం కోసమని వెళ్లి ముగ్గురు యువకులు నదిలో మునిగిపోయారు. అసన్సోల్లో జరిగిన ఘటనలో ఒకరు గల్లంతు కాగా.. ముర్షిదాబాద్లోని బహరంపూర్లో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అసన్సోల్ కు చెందిన విద్యార్థి కాజు ఘోష్ కి శివునికి జలాభిషేకం చేయాలని కోరిక ఉంది. కానీ అతని కోరిక తీరక ముందే.. విగతజీవిగా మారిపోయాడు. అయితే శ్రావణ మాసంలో సోమవారం నాడు చాలా మంది ప్రజలు శివునికి గంగాజలాన్ని సమర్పిస్తారని.. అందుకోసం ఆ యువకుడు నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. శివునికి జలాన్ని సమర్పించాలన్న కాజు ఘోష్ కల నెరవేరలేదు. స్నేహితులతో కలిసి ఉదయం 6 గంటల ప్రాంతంలో అజయ్ నదికి వెళ్లారు. స్నేహితులందరూ స్నానాలు చేశారు. అయితే కాజు ఘోష్ మాత్రం శివుడికి గంగాజలం తీసుకురావడానికని నదిలోకి దిగాడు. అయితే అతనికి ఈత రాకపోవడంతో నదిలో మునిగిపోయాడు. వెంటనే గమనించిన స్థానిక మత్స్యకారులు అతన్ని బయటకు తీశారు. కానీ అప్పటికే ఆ విద్యార్థి మరణించినట్లు తెలిసింది. ఆ విద్యార్ధి మృతితో.. వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.
Colors Swathi: విడాకుల రూమర్స్.. బుర్ఖా వేసుకొని తప్పించుకున్న హీరోయిన్..?
Also Read
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Tattoo Safety Tips: టాటూ వేయించుకుంటున్నారా?.. ముందు ఈ విషయాలు తెలియకపోతే రిస్కే..!
- Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
మరో ఘటన ముర్షిదాబాద్లోని బహరంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదాబాద్ ఘాట్పోర్ట్లోని నియాలిస్ పడ ఫెర్రీ ఘాట్ వద్ద జరిగింది. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో ఐదుగురు స్నేహితులు బయాస్పూర్ ఆలయంలో శివుడికి గంగాజలం తీసుకొస్తామని వెళ్లి.. ఇద్దరు స్నేహితులు ఒక్కసారిగా నీటిలో మునిగి చనిపోయారు. ఒక వ్యక్తికి ఈత రాకపోవడంతో.. అతన్ని కాపాడటానికి వెళ్లి.. మరో ఇద్దరు స్నేహితులు నదిలో గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం రేపింది. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. అయినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు.
తాజావార్తలు
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!