Reels: రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి.. బస్సును ఢీకొని మృతి
- రీల్స్ పిచ్చితో ముగ్గురు యువకులు బలి
- బైక్ పై రీల్స్ చేస్తూ బస్సును ఢీకొట్టిన యువకులు
- అక్కడికక్కడే ఇద్దరు మృతి
- ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో హైలైట్ అవడం కోసం యువకుల తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే లైకుల కోసం, వ్యూస్ కోసం ఏకంగా ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయిపోవాలని పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నారు. కష్టపడి చేసిన వీడియోకు అనుకున్న స్థాయిలో లైకులు, వ్యూస్ రాకపోతే వారికి చాలా బాధగా ఉంటుంది. ఒక్కోసారి డిప్రెషన్లోకి వెళ్లిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుండగా.. కొందరు మాత్రం చేజేతులా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన జరిగింది.
CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటా..
Also Read
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
గురువారం తెల్లవారుజామున వారణాసిలో ఒకే బైక్పై రీల్స్ చేస్తూ వెళ్తున్న ముగ్గురు యువకులు బస్సును ఢీకొట్టారు. దీంతో.. వారు వంద మీటర్ల దూరంలో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాద వార్త తెలియగానే మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ప్రమాదానికి పాల్పడ్డ బస్సును పట్టుకున్నారు. అయితే.. ఈ ఘటనకు ముందు ముగ్గురు యువకులు మార్గమధ్యంలో ఓ యువకుడిని ఢీకొట్టారని పోలీసులు చెబుతున్నారు. రోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని చితాయ్పూర్ ఖానావ్ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతులు అఖారి గ్రామానికి చెందిన సాహిల్ రాజ్భర్(16), చంద్రశేఖర్రాజ్భర్(16), శివమ్ రాజ్భర్(16)గా గుర్తించారు. ఈ యువకులు కేటీఎం బైక్ పై బచావ్ బజార్కు వెళ్లినట్లు తెలిపారు. బచావ్ మార్కెట్ నుండి అక్రి వైపు తిరిగి వస్తూ.. బైక్ను ఊపుతూ రీల్స్ చేస్తున్నారు. ఇంతలో ఎదురుగా వస్తున్న బస్సును యువకుల బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చంద్రశేఖర్, సాహిల్ అక్కడికక్కడే మృతి చెందారు. శివమ్ను ట్రామా సెంటర్కు తరలిస్తుండగా.. చనిపోయాడు. ముగ్గురూ అఖారి గ్రామానికి చెందిన యువకులు.
- Tags
- bike
- bus
- died
- reels
- three youths
తాజావార్తలు
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!