Viral : మత్తులో ముగ్గురు యువతులు వీరంగం.. తగ్గేదెలే అంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు మద్యం మత్తులో యువత చెడు దారుల్లోకి వెళుతోంది. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా వ్యవహరిస్తున్నారు. అలాంటి ఘటనే చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని తిరువల్లికేణి వాలాజా రోడ్డు వద్ద నిన్న రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ముగ్గురు యవతులు రోడ్డుపై బైఠాయించినట్లు పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చూసే సరికి చెన్నై సిటీ బస్సు కింద ముగ్గురు మహిళలు పడుకొని ఉన్నారు. దీంతో షాక్కు గురైన మహిళా పోలీసులు బస్సు కింద ఉన్న ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే మద్యానికి బానిసైన స్థితిలో ఆ ముగ్గురు మహిళలు ఏం చేస్తున్నారో తెలియక గొడవకు దిగారు.
Also Read : Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
దీంతో ముగ్గురు యువతులను పోలీసులు శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. వారు ఎంతకీ వినకపోవడంతో.. అనంతరం మహిళా పోలీసు ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పోలీసులు ముగ్గురు యువతులను పోలీస్ స్టేషన్కు తరలించారు. మద్యానికి అలవాటు పడిన వారిని విచారించగా, ఆ ముగ్గురూ కన్నగి నగర్ ప్రాంతానికి చెందిన మహిళలు అని తేలింది. తిరువల్లికేణి ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకలో భోజనం వడ్డించేందుకు పనికి వచ్చారని, పని ముగించుకుని వెళ్లేటప్పుడు మద్యం సేవించి.. మద్యం మత్తులో రోడ్డుపై పరుగులు తీశారని వెల్లడించారు. దీంతో రోడ్డుపై మద్యం సేవించిన ముగ్గురు మహిళలపై తిరువల్లికేణి పోలీస్ స్టేషన్ పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇంటికి పంపించారు.
Also Read : Road Accident: తుని దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా..
తాజావార్తలు
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?