Bomb Blast: పశ్చిమ బెంగాల్లో ఘోరం.. టీఎంసీ నేత ఇంట్లో బాంబు పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Blast : పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.తూర్పు మేదినీపూర్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకుడి ఇంటిపై జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు మరణించారు. తూర్పు మిడ్నాపూర్లోని కాంటాయ్కు 40 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. ఈ రోజు జిల్లాలో సీనియర్ TMC నాయకుడు అభిషేక్ బెనర్జీ షెడ్యూల్ చేసిన ర్యాలీ వేదిక నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో భూపతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగబన్పూర్ బ్లాక్ 2లోని నార్యబిలా గ్రామంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో బూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్తోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. పేలుడు కారణంగా ఇల్లు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. పేలుడుకు కారణం ఇంకా తెలియరాలేదని.. దర్యాప్తు కొనసాగుతుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Read Also: Ex-Boyfriend Hacked Young Woman : కొచ్చిలో యువతిపై కత్తితో దాడి చేసిన మాజీ ప్రియుడు
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ఇదిలా ఉండగా.. తృణమూల్ నాయకుడి ఇంటి వద్ద నాటు బాంబులు తయారు చేస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది. ఈ పరిణామంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. రాష్ట్రంలో బాంబుల తయారీ పరిశ్రమ మాత్రమే అభివృద్ధి చెందుతోందన్నారు. ఇలాంటి ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు మౌనంగా ఉన్నారని సీపీఐ (ఎం) సీనియర్ నేత సుజన్ చక్రవర్తి ప్రశ్నించారు. టిఎంసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా అధికార పార్టీని నిందించడం ప్రతిపక్షాలకు చాలా తేలిక అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పశ్చిమ బెంగాల్లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా కూంబింగ్ ప్రారంభించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా దేశంలోని బాంబులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సీఎం మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారని అధికార TMC చెబుతోంది. గత 2018లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార TMC ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసినప్పటికీ, పశ్చిమ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వామపక్షాలు, కాంగ్రెస్లను దాటి ఆ ఎన్నికలలో BJP రెండవ స్థానంలో నిలిచింది.
Wb | A blast occurred at residence of TMC booth president Rajkumar Manna in Arjun Nagar area under Bhupati Nagar PS in Purba Medinipur limits last night. Injuries reported. Party's National General Secretary Abhishek Banerjee is scheduled to hold a public rally in Contai today. pic.twitter.com/1ynqX7G6S3
— ANI (@ANI) December 3, 2022
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!