Mali: భారతీయులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాద సంస్థ.. విదేశాంగశాఖ కీలక సూచన
- మాలి దేశంలో ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్
- డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై ఉగ్రవాదుల దాడి
- ఫ్యాక్టరీలోని కార్మికులను బందీలుగా తీసుకెళ్లిన ముష్కరులు
- వారిలో ముగ్గురు భారతీయ కార్మికులు
- మాలిలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్ అయ్యారు. అల్ ఖైదాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్కు గురయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై అల్-ఖైదాతో అనుబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్… JNIM అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసింది. ఫ్యాక్టరీలోని కార్మికులను బందీలుగా తీసుకెళ్లింది. వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. అయితే, కిడ్నాప్కు గురైన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు..
READ MORE: CM Chandrababu: క్యాన్సర్తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శ
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
ఐతే ఈ ఘటనపై… మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని విదేశాంగశాఖ తెలిపింది. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. ముగ్గురు భారతీయుల కిడ్నాప్ ఘటనన తీవ్రంగా ఖండించిన కేంద్ర సర్కార్.. బందీలను టెర్రరిస్టులు సురక్షితంగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం అధికారులు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. బాధిత కుటుంబాలతో టచ్ లో ఉన్నారు. మాలిలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఎంఈఏ సూచించింది. బందీలను త్వరగా, సురక్షితంగా విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
READ MORE: MK Stalin: భాషా ఉద్యమం తమిళనాడు దాటింది.. ఠాక్రేల కలయికపై స్టాలిన్..
తాజావార్తలు
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!