Mali: భారతీయులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాద సంస్థ.. విదేశాంగశాఖ కీలక సూచన
- మాలి దేశంలో ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్
- డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై ఉగ్రవాదుల దాడి
- ఫ్యాక్టరీలోని కార్మికులను బందీలుగా తీసుకెళ్లిన ముష్కరులు
- వారిలో ముగ్గురు భారతీయ కార్మికులు
- మాలిలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్ అయ్యారు. అల్ ఖైదాకు చెందిన అనుబంధ ఉగ్ర సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో ముగ్గురు భారతీయ కార్మికులు కిడ్నాప్కు గురయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై అల్-ఖైదాతో అనుబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్… JNIM అనే ఉగ్రవాద సంస్థ దాడి చేసింది. ఫ్యాక్టరీలోని కార్మికులను బందీలుగా తీసుకెళ్లింది. వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. ఈ ఘటనను భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. అయితే, కిడ్నాప్కు గురైన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు..
READ MORE: CM Chandrababu: క్యాన్సర్తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శ
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
ఐతే ఈ ఘటనపై… మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందని విదేశాంగశాఖ తెలిపింది. బాధిత కుటుంబాలతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించింది. ముగ్గురు భారతీయుల కిడ్నాప్ ఘటనన తీవ్రంగా ఖండించిన కేంద్ర సర్కార్.. బందీలను టెర్రరిస్టులు సురక్షితంగా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు మాలి రాజధాని బమాకోలోని భారత రాయబార కార్యాలయం అధికారులు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. బాధిత కుటుంబాలతో టచ్ లో ఉన్నారు. మాలిలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని ఎంఈఏ సూచించింది. బందీలను త్వరగా, సురక్షితంగా విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
READ MORE: MK Stalin: భాషా ఉద్యమం తమిళనాడు దాటింది.. ఠాక్రేల కలయికపై స్టాలిన్..
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!