Elephants: రోడ్డు ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. బుధవారం రాత్రి రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు ప్రమాదానికి గురయ్యింది. ఇందులో రెండు గున్న ఏనుగులు, ఒక పెద్ద ఏనుగు మరణించాయి. అయితే, పలమనేరు సమీపంలోని జాతీయ రహదారికి ఇరు వైపుల అడుగులున్నాయి. దీంతో ఏనుగులు ఆహారం కోసం గుంపుగా అటు ఇటు తిరుగుతుంటాయి. ఒక్కోసారి పగటి పూటా పెద్ద గుంపు రోడ్డుపై నిలబడి ఉన్న సందర్భాలూ చాలానే ఉన్నాయి. అలాంటి సమయాల్లో వాహనదారులు దూరంగానే తమ వాహనాలను నిలిపేసి ఏనుగులు రోడ్డు దాటాక తమ ప్రయాణం చేస్తుంటారు. తాజాగా.. బుధవారం రాత్రి బూతలబండ మలుపు వద్ద రోడ్డు దాటుతున్న ఏనుగులను చెన్నైకి కూరగాయాల లోడ్తో వెళ్తున్న మినీలారీ ఢీకొంది. ఈ ఘటనలో మూడు ఏనుగులు మృతిచెందాయి. వీటిలో ఒక పెద్ద మగ ఏనుగు, రెండు చిన్న ఏనుగులు (మగ, ఆడ) ఉన్నాయి.
Also Read : What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
అయితే వ్యాన్ ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవరు అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ రహదారిపై రెండువైపులా వెహికిల్స్ భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పలమనేరు రేంజర్ శివన్న సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేయించారు. చిత్తూరు డీఎఫ్వో చైతన్యకుమార్రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏనుగులను ఎక్స్కవేటర్ సాయంతో సమీప అటవీలోకి తరలించారు.
Also Read : Telangana : ఘోర ప్రమాదం.. బిడ్జి పై నుంచి కింద పడ్డ ఆటో..ఆరుగురు మృతి..
దీంతో ఇవాళ అక్కడే వీటికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కాగా, చీకట్లో ఏనుగులు రోడ్డుదాటుతున్న విషయాన్ని డ్రైవరు గుర్తించలేకపోవడంతో.. అతివేగంగా వస్తున్న మినీలారీ ఢీకొన్నట్లు భావిస్తున్నారు. ఇలా రోడ్డు ప్రమాదంలో ఏనుగులు చనిపోవడం ఇదే మొదటి సారి. అయితే.. ఇప్పటి వరకు విద్యుత్ తీగలు తగిలి లేదా అనారోగ్య కారణాలతో మృతిచెందాయి.
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!