Telangana : ఘోర ప్రమాదం.. బిడ్జి పై నుంచి కింద పడ్డ ఆటో..ఆరుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి.. ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది..బిడ్జి పై నుంచి ఆటో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.. బూర్గంపాడు శివారులోని ఆంధ్ర సరిహద్దు కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి మహీంద్రా ట్రాలీ బోల్తా పడింది.. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన నరసింహారావు, దుర్గారావు, పచ్చి సాని శ్రీనివాసరావులకు చెందిన 12మంది కుటుంబ సభ్యులు మంగళవారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి వచ్చారు.. స్వామిని దర్శించుకున్నాక మధ్యాహ్నం తిరుగు ప్రయాణం అయ్యారు.. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది..
వీరంతా ప్రయానిస్తున్న ట్రాలి ఆటో బూర్గంపహాడ్ శివారులోని కిన్నెరసాని బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై నుంచి అదుపుతప్పి వాగులోకి దూసుకుపోయింది.. ఈ ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.. అతి వేగం వల్లే మలుపు వద్ద వాహనాన్ని డ్రైవర్ కంట్రోల్ చెయ్యలేక పోవడంతో ఆటో లోయలో పడిందని పోలీసుల ప్రధాన దర్యాప్తు లో తేలింది.. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు అవ్వగా జట్ల దుర్గారావు, పచ్చి సాని శ్రీనివాసరావు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ఇంకా దుర్గారావు ఇద్దరు కుమారులు సందీప్, ప్రదీప్ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు..
Also Read
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- Damodar Rajanarsimha: వైద్యుల సేవలు అమూల్యం.. డాక్టర్స్ డే సందర్భంగా మంత్రి కీలక సందేశం
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
ఈ ఘటన పై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. స్థానికుల సాయంతో మృతదేహలను బయటకు తీశారు.. క్షతగాత్రులను వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. దైవ దర్శనానికి వెళ్లి దేవుడి దగ్గరకే వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కి పడింది.. ఇక ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
-
Ducati 2026 Multistrada V4 Rally: భారత్లో విడుదలైన డుకాటి 2026 మల్టీస్ట్రాడా V4 ర్యాలీ.. ధర రూ. 32 లక్షలు
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్పై ఆసక్తి
-
Toxic : ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్గా యశ్
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!