Bomb Threat : జైపూర్లోని ఆరు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. విద్యార్థులను బయటకు పంపిన సిబ్బంది
Bomb Threat : రాజస్థాన్లోని జైపూర్లోని ఎయిర్ పోర్టు తర్వాత.. ఇప్పుడు ఆరుకు పైగా పాఠశాలలపై బాంబు దాడుల బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఈ-మెయిల్ ఐడీలకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాఠశాల భవనంలో బాంబు ఉందని, అది పేలుతుందని రాసి ఉంది. మెయిల్ అందిన వెంటనే పాఠశాలల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే విద్యార్థులందరినీ తరగతి నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
మోతీ దుంగ్రీలో ఉన్న ఎంపీఎస్ స్కూల్కు మొదటి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ప్రిన్సిపాల్ సమాచారం మేరకు పోలీసులు బాంబు డిస్పోజల్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెయిల్ పంపిన వ్యక్తి ఇమెయిల్ ఐడీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. దాదాపు ఆరు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అన్ని పాఠశాలలకు పోలీసు బృందాలను పంపించారు. అన్నిచోట్లా సోదాలు జరుగుతున్నాయి.
Also Read
Read Also:AP Elections 2024: ఏపీవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్..
సోమవారం ఉదయం 6 గంటలకు మోతీ డంగ్రీలోని ఎంపీఎస్ స్కూల్కు మెయిల్లో బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీని తర్వాత ఎంపీఎస్, మనక్ చౌక్, విద్యాధర్ నగర్, వైశాలి నగర్, బగ్రులోని నివారు రోడ్డులో ఉన్న పాఠశాలలను పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. మల్పుర్గేట్ బంబలా పులియాలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా జైపూర్ ఎయిర్పోర్ట్ను పేల్చివేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఆదివారం కూడా అలాంటి మెయిల్ వచ్చింది. జైపూర్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామన్నారు. బెదిరింపు తర్వాత, విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు, బాంబు నిర్వీర్య స్క్వాడ్ అలర్ట్ అయ్యారు. జైపూర్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం ఇది ఆరోసారి. అంతకుముందు మే 3న కూడా విమానాశ్రయంలో బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. 27 డిసెంబర్ 2023, 16 ఫిబ్రవరి 2024, 26 ఏప్రిల్ 2024, 29 ఏప్రిల్ 2024 తేదీలలో ఇలాంటి బెదిరింపు ఇమెయిల్లు పంపబడ్డాయి.
Read Also:Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై భుట్టో బొమ్మ ఉండాలని తీర్మానం..
మరోవైపు కర్ణాటకలోని బెంగళూరులోని ఆరు ప్రముఖ ఆసుపత్రులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బాంబు బెదిరింపు మెయిల్ నేరుగా బెంగళూరు పోలీసుల ఈ-మెయిల్ ఖాతాకు పంపబడింది. ఈ మెయిల్ అకౌంట్ నేపథ్యాన్ని పోలీసులు విచారించగా.. అది ఫేక్ అకౌంట్ అని తేలింది. తనిఖీ తర్వాత, భయపెట్టేందుకు ఈ మెయిల్ పంపారని పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు కూడా బెంగళూరులోని పాఠశాలలు, విమానాశ్రయంపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి.
తాజావార్తలు
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!