Bomb Threat : జైపూర్లోని ఆరు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. విద్యార్థులను బయటకు పంపిన సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat : రాజస్థాన్లోని జైపూర్లోని ఎయిర్ పోర్టు తర్వాత.. ఇప్పుడు ఆరుకు పైగా పాఠశాలలపై బాంబు దాడుల బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఈ-మెయిల్ ఐడీలకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాఠశాల భవనంలో బాంబు ఉందని, అది పేలుతుందని రాసి ఉంది. మెయిల్ అందిన వెంటనే పాఠశాలల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే విద్యార్థులందరినీ తరగతి నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
మోతీ దుంగ్రీలో ఉన్న ఎంపీఎస్ స్కూల్కు మొదటి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ప్రిన్సిపాల్ సమాచారం మేరకు పోలీసులు బాంబు డిస్పోజల్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెయిల్ పంపిన వ్యక్తి ఇమెయిల్ ఐడీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. దాదాపు ఆరు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అన్ని పాఠశాలలకు పోలీసు బృందాలను పంపించారు. అన్నిచోట్లా సోదాలు జరుగుతున్నాయి.
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
Read Also:AP Elections 2024: ఏపీవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్..
సోమవారం ఉదయం 6 గంటలకు మోతీ డంగ్రీలోని ఎంపీఎస్ స్కూల్కు మెయిల్లో బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీని తర్వాత ఎంపీఎస్, మనక్ చౌక్, విద్యాధర్ నగర్, వైశాలి నగర్, బగ్రులోని నివారు రోడ్డులో ఉన్న పాఠశాలలను పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. మల్పుర్గేట్ బంబలా పులియాలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా జైపూర్ ఎయిర్పోర్ట్ను పేల్చివేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఆదివారం కూడా అలాంటి మెయిల్ వచ్చింది. జైపూర్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామన్నారు. బెదిరింపు తర్వాత, విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు, బాంబు నిర్వీర్య స్క్వాడ్ అలర్ట్ అయ్యారు. జైపూర్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం ఇది ఆరోసారి. అంతకుముందు మే 3న కూడా విమానాశ్రయంలో బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. 27 డిసెంబర్ 2023, 16 ఫిబ్రవరి 2024, 26 ఏప్రిల్ 2024, 29 ఏప్రిల్ 2024 తేదీలలో ఇలాంటి బెదిరింపు ఇమెయిల్లు పంపబడ్డాయి.
Read Also:Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై భుట్టో బొమ్మ ఉండాలని తీర్మానం..
మరోవైపు కర్ణాటకలోని బెంగళూరులోని ఆరు ప్రముఖ ఆసుపత్రులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బాంబు బెదిరింపు మెయిల్ నేరుగా బెంగళూరు పోలీసుల ఈ-మెయిల్ ఖాతాకు పంపబడింది. ఈ మెయిల్ అకౌంట్ నేపథ్యాన్ని పోలీసులు విచారించగా.. అది ఫేక్ అకౌంట్ అని తేలింది. తనిఖీ తర్వాత, భయపెట్టేందుకు ఈ మెయిల్ పంపారని పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు కూడా బెంగళూరులోని పాఠశాలలు, విమానాశ్రయంపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి.
తాజావార్తలు
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..