Bomb Threat : జైపూర్లోని ఆరు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. విద్యార్థులను బయటకు పంపిన సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat : రాజస్థాన్లోని జైపూర్లోని ఎయిర్ పోర్టు తర్వాత.. ఇప్పుడు ఆరుకు పైగా పాఠశాలలపై బాంబు దాడుల బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఈ-మెయిల్ ఐడీలకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాఠశాల భవనంలో బాంబు ఉందని, అది పేలుతుందని రాసి ఉంది. మెయిల్ అందిన వెంటనే పాఠశాలల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే విద్యార్థులందరినీ తరగతి నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
మోతీ దుంగ్రీలో ఉన్న ఎంపీఎస్ స్కూల్కు మొదటి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ప్రిన్సిపాల్ సమాచారం మేరకు పోలీసులు బాంబు డిస్పోజల్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెయిల్ పంపిన వ్యక్తి ఇమెయిల్ ఐడీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. దాదాపు ఆరు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అన్ని పాఠశాలలకు పోలీసు బృందాలను పంపించారు. అన్నిచోట్లా సోదాలు జరుగుతున్నాయి.
Also Read
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
Read Also:AP Elections 2024: ఏపీవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్..
సోమవారం ఉదయం 6 గంటలకు మోతీ డంగ్రీలోని ఎంపీఎస్ స్కూల్కు మెయిల్లో బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీని తర్వాత ఎంపీఎస్, మనక్ చౌక్, విద్యాధర్ నగర్, వైశాలి నగర్, బగ్రులోని నివారు రోడ్డులో ఉన్న పాఠశాలలను పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. మల్పుర్గేట్ బంబలా పులియాలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా జైపూర్ ఎయిర్పోర్ట్ను పేల్చివేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఆదివారం కూడా అలాంటి మెయిల్ వచ్చింది. జైపూర్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామన్నారు. బెదిరింపు తర్వాత, విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు, బాంబు నిర్వీర్య స్క్వాడ్ అలర్ట్ అయ్యారు. జైపూర్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం ఇది ఆరోసారి. అంతకుముందు మే 3న కూడా విమానాశ్రయంలో బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. 27 డిసెంబర్ 2023, 16 ఫిబ్రవరి 2024, 26 ఏప్రిల్ 2024, 29 ఏప్రిల్ 2024 తేదీలలో ఇలాంటి బెదిరింపు ఇమెయిల్లు పంపబడ్డాయి.
Read Also:Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై భుట్టో బొమ్మ ఉండాలని తీర్మానం..
మరోవైపు కర్ణాటకలోని బెంగళూరులోని ఆరు ప్రముఖ ఆసుపత్రులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బాంబు బెదిరింపు మెయిల్ నేరుగా బెంగళూరు పోలీసుల ఈ-మెయిల్ ఖాతాకు పంపబడింది. ఈ మెయిల్ అకౌంట్ నేపథ్యాన్ని పోలీసులు విచారించగా.. అది ఫేక్ అకౌంట్ అని తేలింది. తనిఖీ తర్వాత, భయపెట్టేందుకు ఈ మెయిల్ పంపారని పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు కూడా బెంగళూరులోని పాఠశాలలు, విమానాశ్రయంపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి.
తాజావార్తలు
-
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
-
Yash : యష్ రిస్క్ చేస్తున్నాడా? బయట పడలేకపోతున్నాడా?
-
Varanasi: మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఎందుకు సైలెంట్? ‘వారణాసి’పై జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!