Bomb Threat : జైపూర్లోని ఆరు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. విద్యార్థులను బయటకు పంపిన సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat : రాజస్థాన్లోని జైపూర్లోని ఎయిర్ పోర్టు తర్వాత.. ఇప్పుడు ఆరుకు పైగా పాఠశాలలపై బాంబు దాడుల బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఈ-మెయిల్ ఐడీలకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాఠశాల భవనంలో బాంబు ఉందని, అది పేలుతుందని రాసి ఉంది. మెయిల్ అందిన వెంటనే పాఠశాలల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే విద్యార్థులందరినీ తరగతి నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
మోతీ దుంగ్రీలో ఉన్న ఎంపీఎస్ స్కూల్కు మొదటి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ప్రిన్సిపాల్ సమాచారం మేరకు పోలీసులు బాంబు డిస్పోజల్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెయిల్ పంపిన వ్యక్తి ఇమెయిల్ ఐడీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. దాదాపు ఆరు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అన్ని పాఠశాలలకు పోలీసు బృందాలను పంపించారు. అన్నిచోట్లా సోదాలు జరుగుతున్నాయి.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
Read Also:AP Elections 2024: ఏపీవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్..
సోమవారం ఉదయం 6 గంటలకు మోతీ డంగ్రీలోని ఎంపీఎస్ స్కూల్కు మెయిల్లో బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీని తర్వాత ఎంపీఎస్, మనక్ చౌక్, విద్యాధర్ నగర్, వైశాలి నగర్, బగ్రులోని నివారు రోడ్డులో ఉన్న పాఠశాలలను పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. మల్పుర్గేట్ బంబలా పులియాలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా జైపూర్ ఎయిర్పోర్ట్ను పేల్చివేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఆదివారం కూడా అలాంటి మెయిల్ వచ్చింది. జైపూర్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామన్నారు. బెదిరింపు తర్వాత, విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు, బాంబు నిర్వీర్య స్క్వాడ్ అలర్ట్ అయ్యారు. జైపూర్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం ఇది ఆరోసారి. అంతకుముందు మే 3న కూడా విమానాశ్రయంలో బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. 27 డిసెంబర్ 2023, 16 ఫిబ్రవరి 2024, 26 ఏప్రిల్ 2024, 29 ఏప్రిల్ 2024 తేదీలలో ఇలాంటి బెదిరింపు ఇమెయిల్లు పంపబడ్డాయి.
Read Also:Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై భుట్టో బొమ్మ ఉండాలని తీర్మానం..
మరోవైపు కర్ణాటకలోని బెంగళూరులోని ఆరు ప్రముఖ ఆసుపత్రులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బాంబు బెదిరింపు మెయిల్ నేరుగా బెంగళూరు పోలీసుల ఈ-మెయిల్ ఖాతాకు పంపబడింది. ఈ మెయిల్ అకౌంట్ నేపథ్యాన్ని పోలీసులు విచారించగా.. అది ఫేక్ అకౌంట్ అని తేలింది. తనిఖీ తర్వాత, భయపెట్టేందుకు ఈ మెయిల్ పంపారని పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు కూడా బెంగళూరులోని పాఠశాలలు, విమానాశ్రయంపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి.
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!