Bomb Threat : జైపూర్లోని ఆరు స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. విద్యార్థులను బయటకు పంపిన సిబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat : రాజస్థాన్లోని జైపూర్లోని ఎయిర్ పోర్టు తర్వాత.. ఇప్పుడు ఆరుకు పైగా పాఠశాలలపై బాంబు దాడుల బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఈ-మెయిల్ ఐడీలకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. పాఠశాల భవనంలో బాంబు ఉందని, అది పేలుతుందని రాసి ఉంది. మెయిల్ అందిన వెంటనే పాఠశాలల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే విద్యార్థులందరినీ తరగతి నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు.
మోతీ దుంగ్రీలో ఉన్న ఎంపీఎస్ స్కూల్కు మొదటి బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ప్రిన్సిపాల్ సమాచారం మేరకు పోలీసులు బాంబు డిస్పోజల్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెయిల్ పంపిన వ్యక్తి ఇమెయిల్ ఐడీకి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. దాదాపు ఆరు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అన్ని పాఠశాలలకు పోలీసు బృందాలను పంపించారు. అన్నిచోట్లా సోదాలు జరుగుతున్నాయి.
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
Read Also:AP Elections 2024: ఏపీవ్యాప్తంగా ఉదయం 10 గంటల వరకు 15 శాతం మేర పోలింగ్..
సోమవారం ఉదయం 6 గంటలకు మోతీ డంగ్రీలోని ఎంపీఎస్ స్కూల్కు మెయిల్లో బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీని తర్వాత ఎంపీఎస్, మనక్ చౌక్, విద్యాధర్ నగర్, వైశాలి నగర్, బగ్రులోని నివారు రోడ్డులో ఉన్న పాఠశాలలను పేల్చివేస్తామని బెదిరింపులు వచ్చాయి. మల్పుర్గేట్ బంబలా పులియాలో ఉన్న పాఠశాలలో బాంబు ఉన్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా జైపూర్ ఎయిర్పోర్ట్ను పేల్చివేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. ఆదివారం కూడా అలాంటి మెయిల్ వచ్చింది. జైపూర్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామన్నారు. బెదిరింపు తర్వాత, విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు, బాంబు నిర్వీర్య స్క్వాడ్ అలర్ట్ అయ్యారు. జైపూర్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం ఇది ఆరోసారి. అంతకుముందు మే 3న కూడా విమానాశ్రయంలో బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి. 27 డిసెంబర్ 2023, 16 ఫిబ్రవరి 2024, 26 ఏప్రిల్ 2024, 29 ఏప్రిల్ 2024 తేదీలలో ఇలాంటి బెదిరింపు ఇమెయిల్లు పంపబడ్డాయి.
Read Also:Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై భుట్టో బొమ్మ ఉండాలని తీర్మానం..
మరోవైపు కర్ణాటకలోని బెంగళూరులోని ఆరు ప్రముఖ ఆసుపత్రులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బాంబు బెదిరింపు మెయిల్ నేరుగా బెంగళూరు పోలీసుల ఈ-మెయిల్ ఖాతాకు పంపబడింది. ఈ మెయిల్ అకౌంట్ నేపథ్యాన్ని పోలీసులు విచారించగా.. అది ఫేక్ అకౌంట్ అని తేలింది. తనిఖీ తర్వాత, భయపెట్టేందుకు ఈ మెయిల్ పంపారని పోలీసులు తెలిపారు. ఇంతకు ముందు కూడా బెంగళూరులోని పాఠశాలలు, విమానాశ్రయంపై బాంబులు వేస్తామని బెదిరింపులు వచ్చాయి.
తాజావార్తలు
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!