Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై భుట్టో బొమ్మ ఉండాలని తీర్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ కరెన్సీపై మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఫోటో పెట్టాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) తీర్మానం ప్రవేశపెట్టింది. పీపీపీ పార్టీ వ్యవస్థాపకుడైన భుట్టోని జాతీయ ప్రజాస్వామ్య హీరోగా ప్రకటించాలని, కరెన్సీ నోట్లపై అతని బొమ్మ పెట్టలాని ప్రభుత్వాన్ని కోరుతూ ఆదివారం తీర్మానాన్ని ఆమోదించారు. జుల్ఫికర్ అలీ భుట్టోపై చర్చిస్తూ ‘‘భుట్టో రిఫరెన్స్ అండ్ హిస్టరీ’’ అనే సెమినార్ సందర్భంగా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.
పీపీపీ వ్యవస్థాపకుల్లో ఒకటిగా ఉన్న అహ్మద్ రెజా కసూరి హత్యకు ఆదేశించాడనే జుల్ఫికర్ అలీ భుట్టోపై అభియోగాలు నమోదయయ్యాయి. అయితే ఆ సమయంలో పాకిస్తాన్ని పాలిస్తున్న మహ్మద్ జియా ఉల్ హక్ కావాలనే అతడిని ఇందులో ఇరికించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడిని ఉరితీశారు. ఇటీవల పాక్ సుప్రీంకోర్టు అతడి ఉరిశిక్షను తప్పుపట్టింది. తాజా తీర్మానంలో భుట్టోకి ‘‘క్వాయిడ్ ఏ అవామ్’’ (ప్రజల నాయకుడు) బిరుదును ప్రదానం చేయాలని పాక్ ప్రభుత్వాన్ని తీర్మానం కోరింది. దీంతో పాటు పాక్ అత్యున్నత పురస్కారం నిషన్-ఏ-పాకిస్తాన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
Read Also: Russia Ukraine War : రష్యాపై ఉక్రెయిన్ కాల్పులు.. 10అంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి
కరెన్సీ నోట్లపై భుట్టో చిత్రాన్ని ఉంచాలని డిమాండ్ చేయడంతో పాటు, భుట్టో గౌరవార్థం తగిన స్మారక చిహ్నాన్ని నిర్మించాలని, ఆయన సమాధిని జాతీయ మందిరంగా ప్రకటించాలని తీర్మానం కోరినట్లు స్థానిక మీడియా నివేదించింది. భుట్టోకు విధించిన అన్యాయమైన మరణశిక్షను రద్దు చేయాలని మరియు దాని కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ప్రజాస్వామ్య ఉద్యమకారులకు ఇచ్చేందుకు ‘‘జుల్ఫికర్ అలీ భుట్టో అవార్డు’’ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు, జాతీయ అసెంబ్లీ మార్చిలో జుల్ఫికర్ అలీ భుట్టో విచారణను న్యాయపరమైన హత్యగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. హ్యా నేరంలో భుట్టోకి ఏప్రిల్ 4, 1979న ఉరితీశారు.
తాజావార్తలు
-
Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
-
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!