Thiruchendur: విషాదం.. ఆలయంలో ఏనుగుకు పండ్లు తినిపిస్తుండగా దాడి, ఒకరి మృతి
- తమిళనాడు రాష్ట్రం తిరుచెందూర్లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో విషాదం
- ఇద్దరిపై తన కొమ్ములతో దాడి చేసిన 25 ఏళ్ల దేవనై అనే ఆలయ ఏనుగు
- మహౌత్ ఉదయ కుమార్, బంధువు శిశుబాలన్ ఏనుగుకు పండ్లు తినిస్తుండగా దాడి
- ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహౌత్ ఉదయ కుమార్ బంధువు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాష్ట్రం తిరుచెందూర్లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం 25 ఏళ్ల దేవనై అనే ఆలయ ఏనుగు తన కొమ్ముతో దాడి చేసి ఒకరిని చంపింది. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు దాని షెడ్లో జరిగింది. మహౌత్ ఉదయ కుమార్, అతని బంధువు శిశుబాలన్ ఏనుగుకు పండ్లను తినిపిస్తుండగా ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా.. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. చికిత్స పొందుతూ మహౌత్ ఉదయ కుమార్ బంధువు మృతి చెందాడు.
Read Also: Pakistan: సోషల్ మీడియాలో పాక్ నటి ప్రైవేటు వీడియో లీక్.. ఖండించిన మథిర
Also Read
కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరుచెందూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆలయ నిర్వాహకులు కూడా ప్రదేశాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేసి తదుపరి చర్యలు తీసుకున్నారు. తిరుచెందూర్లోని మురుగన్ ఆలయంలో అంతర్భాగమైన దేవనై అనే ఏనుగు.. కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో ఉంటోంది. పండుగల సమయంలో ఈ ఏనుగును ఆభరణాలతో అలంకరించి పూజలు చేస్తారు.
Read Also: Reels: రైలు లోపల, ట్రాక్లపై రీల్స్ చేస్తే జైలుకే..! ఆదేశాలు జారీ
అయితే.. ఆలయ ఏనుగులు ఇలా దాడి చేయడం మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్లో కేరళలోని వైకోమ్లోని టీవీ పురం శ్రీరామ స్వామి ఆలయంలో జరిగిన వేడుకలో పుతుపల్లికి చెందిన మహౌత్ అరవింద్ అనే వ్యక్తి.. కుంజులక్ష్మి అనే ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే వైద్యసేవలు అందించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తాజావార్తలు
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
-
SIR Phase-3 : దేశవ్యాప్తంగా ‘SIR ఫేజ్-3’ షెడ్యూల్ విడుదల, అక్టోబర్ 1న తుది జాబితా..!
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!