తాజాగా ఓ భక్తుడు ఎంతో భక్తి ఉన్నవాడిలా గుడికి వచ్చి గుళ్లో ఉన్న దేవత మెడలో ఉండే మంగళసూత్రాన్ని అపహరించాడు. మొదటిగా ఆలయంలో నిండుగా అలంకరణ చేసి ఉన్న అమ్మవారిని దండం పెట్టుకున్నాడు. అయితే ఆ భక్తుడు దండం పెట్టుకున్న తర్వాత తన కష్టాలు తొలగిపోవాలని అమ్మవారికి చెప్పే బదులు.. ఏకంగా అమ్మవారి మెడలో దగదగా మెరిసే తాళిబొట్టును లాగేసుకుని జేబులో వేసుకొని అక్కడ ఎవరికంట పడకుండా మాయమయ్యాడు.
Also Read: LSG vs GT: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో..
ఇకపోతే అతను మనుషులు ఎవరు చూడలేదని., అక్కడి నుంచి వెళ్ళిపోయినా.. ఆ అమ్మవారు చూస్తుంది అని లెక్కచేయకుండా వెళ్లిన అతను చివరికి గుడిలో ఉన్న సీసీ కెమెరాల కంట మొత్తం రికార్డయింది. దాంతో ఆలయ అధికారులు ఆ దొంగ భక్తుని వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో ఉన్న సత్రంపాడు సౌభాగ్య లక్ష్మి ఆలయంలో చోరీ జరిగింది.
Also Read: BRS: కంటోన్మెంట్ ఉపఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత..
ఇక భక్తుడులా వచ్చిన ఆ వ్యక్తి అమ్మవారి మెడలో ఉన్న పదికాసుల మంగళసూత్రాన్ని చోరీ చేశాడు. చోరీలో భాగంగానే ముందుగానే అతడు ముఖానికి మాస్క్ ధరించి గుడి దగ్గరికి వచ్చాడు. ముందుగా అమ్మవారికి దండం పెట్టుకుని ఆపై ఒక్క క్షణం ఆలోచన చేయకుండా చుట్టూ ఎవరు లేని సమయంలో అమ్మవారి మెడలోని తాళిబొట్టును తెంపేసుకుని అక్కడ నుంచి జారుకున్నాడు. ఇందుకు సంబంధించిన మొత్తం దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అవ్వగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టుతున్నారు.
వీడికి భయం లేదు.. భక్తి లేదు… అమ్మవారి మెడలో మంగళసూత్రం చోరీ ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో చోరీ జరిగింది. దర్శనం కోసం గుడిలోకి వచ్చిన వ్యక్తి.. అమ్మవారి మెడలో ఉన్న పది కాసుల మంగళసూత్రాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. pic.twitter.com/xxNzRIta4K
— Ram kumar (@RAESC2828) April 7, 2024