IPL 2024: హమ్మయ్య.. మొత్తానికి మొదటి విజయం అందుకున్న ముంబై ఇండియన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024 లో భాగంగా జరిగిన 20వ మ్యాచ్ లో నేడు హార్థిక్ పాండే సారధ్యంలోని ముంబై ఇండియన్స్, రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్లో ఎట్టకేలకు ఈ సీజన్లో ముంబై మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆకాశమే హద్దుగా ఓనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు చెలరేగారు. ఇందులో భాగంగా 7 ఓవర్లకు 80 పరుగుల భారీ పార్టర్షిప్ తో మొదలైన ఇన్నింగ్స్ ఆ తర్వాత అదే ఊపును అందుకుంది. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ 27 బంతులకు 49 పరుగులు, ఇషాంత్ కిషన్ 23 బంతులతో 42 పరుగులు చేయగా.. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 39 పరుగులు, టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 45 పరుగులు, చివరలో షెఫర్డ్ 10 బంతులతో 39 పరుగులు సాధించడంతో భారీ స్కోర్ చేసింది. నిర్ణిత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 234 భారీ స్కోర్ ని చేయగలిగింది.
Also read: Ranjith Reddy: చేవెళ్ల ప్రజలకు చేయూతనిచ్చిన జనజాతర
Also Read
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
- Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
- Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లోనే తడుబాటుకు గురైంది. హార్థిక్ పాండ్యా బౌలింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత చిన్నగా స్కోర్ బోర్డును అభిషేక్ పోరల్, పృద్విషా లు 80 పరుగులకు పైగా పరుగులు జోడించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
ఆ తర్వాత పృథ్వీ షా అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన ట్రిస్తాన్ స్తబ్స్ 25 బంతుల్లో ఏకంగా 71 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ను విజయంవైపు వైపు అడుగులు వేశాడు. కాకపోతే., అతనికి తోడుగా ఎవరు క్రీజ్ లో నిలబడకపోవడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో ముంబై ఇండియన్స్ జట్టు 29 పరుగుల విజయాన్ని అందుకుంది. ఇకపోతే మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ అభిమానుల్ని నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు కూడా సాధించకుండా డక్ అవుట్ గా వెనుతిరగాడు.
తాజావార్తలు
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
-
Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
RRB Technician 2026: నిరుద్యోగులకు గోల్డెన్ చాన్స్.. రైల్వేలో 6,565 టెక్నీషియన్ పోస్టులు.. దరఖాస్తు, అర్హత పూర్తి వివరాలు
-
Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
-
Luger : ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..! షాక్లో ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!