Variety Ganesha: మోడీతో కలిసి చాయ్ తాగుతున్న వినాయకుడు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు
- తాజాగా సోషల్ మీడియాలో ఓ వెరైటీ వినాయకుడి విగ్రహం
- మోడీతో కలిసి చాయ్ తాగుతున్న వినాయకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఊరు వాడ మొత్తం గణేశుని నామస్మరణంతో మారుమోగుతోంది. లంబోధరుడిని వివిధ రూపాల్లో కొలువుతీర్చి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ కాంతుల శోభతో ప్రత్యేక కళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా వివిధ రూపాల్లో వినాయకుని విగ్రహాలు కళకళలాడుతున్నాయి. గణేష్ మండపాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని భక్తులు పూజలను నిర్వహిస్తున్నారు. ఈ సారి కొన్ని వినాయక విగ్రహాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విశాఖనగరంలో భారీగా గణనాథులు కొలువుదీరాడు. గాజువాక బస్ డిపో పక్కన 75 అడుగుల ఎత్తు బెల్లం వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 20 టన్నుల బెల్లంతో గణపతిని తయారుచేశారు. పూజలా అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. బెల్లం వినాయకుడు ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు.
READ MORE: Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీలో అదరగొడుతున్న యంగ్ ప్లేయర్స్.. భారత జట్టులోకి వస్తామని ఆశాభావం
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
కాగా.. తాజాగా సోషల్ మీడియాలో ఓ వినాయకుడి విగ్రహం జనాలను అబ్బురపరుస్తోంది. ఈ విగ్రహం పక్కన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూర్చున్న విగ్రహాన్ని కూడా పెట్టారు. వినాయకుడు, నరేంద్ర మోడీ ఇద్దరూ కలిసి ఛాయ్ తాగుతున్నట్లు విగ్రహాలు రూపొందించారు. కాగా.. ఈ విగ్రహాలపై సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హిందూ జనజాగృతి సమితి ఈ విగ్రహంపై స్పందించింది. “హిందువులారా.. ఇలాంటి గణేష్ విగ్రహాలను అపహాస్యం చేయడం మానుకోండి!” అని పిలుపునిచ్చింది. ” ఒక చోట శ్రీ గణేశుడు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ రూపంలో అఫ్జల్ఖాన్ కడుపు నుంచి ప్రేగులను బయటకు తీస్తున్నాడు. మరో చోట శ్రీ గణేష్ శ్రీ నరేంద్ర మోడీతో కలిసి ఒక కప్పు టీ తాగుతున్నట్లు చూపబడింది. శ్రీ గణేశుడిని ఈ విధంగా తయారు చేయడం పాపం.. దయ చేసి ఇలాంటివి మానుకోండి.” అని హిందూ జనజాగృతి సమితి పేర్కొంది. ఈ సమాచారం 2014లో జనజాగృతి సమితి తన వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది. కాగా.. ఈ విగ్రహం ఎప్పుడు, ఎక్కడికి ప్రతిష్ఠించారనే సమాచారం లేదు. కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!