Jagadish Reddy: “విద్యుత్ ను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు.” మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- అధికారికంగా స్పష్టత రాలేదన్న మాజీ విద్యత్తు శాఖ మంత్రి
- రేవంత్ రెడ్డి సర్కార్... మోడీ సర్కార్ కనుసన్నల్లో నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపణ
- ప్రభుత్వం వెంటనే తన వైఖరి అధికారికంగా స్పష్టం చేయాలని డిమాండ్
- గత ప్రభుత్వంపై కూడా ఒత్తిడి వచ్చిందని..కేసీఆర్ వ్యతిరేకించారని స్పష్టం చేసిన జగదీశ్ రెడ్డి
విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ అన్నట్టుగా తెలుస్తుందని..ప్రభుత్వం అధికారికంగా ఈ అంశంపై స్పందించలేద మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ బిల్లుల వసూలు ఆదానికి అప్పగింతకు రేవంత్ సర్కార్ సిద్ధం అయినట్టు కనిపిస్తుందన్నారు. విద్యుత్ బిల్లుల వసూలు ఓల్డ్ సిటీ తో ఆగదు..రాష్ట్రం అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళడం ఖాయమని ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు డబ్బుల వసూలుకు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ లో విద్యుత్ రంగం ను ప్రైవేట్ కి అప్పగించడం లో ఇది మొదటి మెట్టు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళితే పేదవారికి, రైతులకు విద్యుత్ సబ్సిడీ ఉండవు. ఉచిత విద్యుత్ ఉండదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఒత్తిడులు వచ్చాయి.. కానీ కేసీఆర్ నో అన్నారు. ఎంత పెద్దవాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చిన రాజీ పడలేదు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Anushka Sharma: భారత్ గెలవగానే.. నా కూతురు ఆందోళన చెందింది: అనుష్క
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
విద్యుత్ ను ప్రైవేటు రంగానికి అప్పగిస్తే…జీవితాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు మాజీ విద్యుత్తు శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ… “రేవంత్ రెడ్డి సర్కార్… మోడీ సర్కార్ కనుసన్నల్లో నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే తన వైఖరి అధికారికంగా స్పష్టం చేయాలి. లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అప్పగిస్తారు. ఒడిశా లో వరదలు వస్తె…అక్కడ విద్యుత్ రంగం లో ఉన్న ప్రైవేటు కంపెనీ ఇబ్బంది పెట్టింది. ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లుల వసూలు కావడం లేదన్నది పూర్తి అసత్యం. ఓల్డ్ సిటీలో 90 శాతం విద్యుత్ బిల్లులు వసూలు అయ్యాయి. ఓల్డ్ సిటీ ప్రజలను అవమానించే రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. విద్యుత్ ప్రైవేటీకరణ ను బిఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది. ప్రైవేటీకరణ కుట్రను అందరు కలసి అడ్డుకోవాలి. ప్రభుత్వం చార్జీల వసూల కోసం బౌన్సర్ లకు అప్పగిస్తుందా ?. రెవేన్యూ రికవరి కోసం గుండా గ్యాంగ్ లకు అప్పగిస్తారా ?. ప్రభుత్వం చేయలేని పని….ప్రైవేట్ వ్యక్తులు ఎలా చేస్తారు ?. ప్రజలను దొంగలు చేసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తుంది.” సంచలన వ్యాఖ్యాలు చేశారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!