Jagadish Reddy: “విద్యుత్ ను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు.” మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- అధికారికంగా స్పష్టత రాలేదన్న మాజీ విద్యత్తు శాఖ మంత్రి
- రేవంత్ రెడ్డి సర్కార్... మోడీ సర్కార్ కనుసన్నల్లో నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపణ
- ప్రభుత్వం వెంటనే తన వైఖరి అధికారికంగా స్పష్టం చేయాలని డిమాండ్
- గత ప్రభుత్వంపై కూడా ఒత్తిడి వచ్చిందని..కేసీఆర్ వ్యతిరేకించారని స్పష్టం చేసిన జగదీశ్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ అన్నట్టుగా తెలుస్తుందని..ప్రభుత్వం అధికారికంగా ఈ అంశంపై స్పందించలేద మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ బిల్లుల వసూలు ఆదానికి అప్పగింతకు రేవంత్ సర్కార్ సిద్ధం అయినట్టు కనిపిస్తుందన్నారు. విద్యుత్ బిల్లుల వసూలు ఓల్డ్ సిటీ తో ఆగదు..రాష్ట్రం అంతా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళడం ఖాయమని ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు డబ్బుల వసూలుకు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ లో విద్యుత్ రంగం ను ప్రైవేట్ కి అప్పగించడం లో ఇది మొదటి మెట్టు. ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళితే పేదవారికి, రైతులకు విద్యుత్ సబ్సిడీ ఉండవు. ఉచిత విద్యుత్ ఉండదు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ఒత్తిడులు వచ్చాయి.. కానీ కేసీఆర్ నో అన్నారు. ఎంత పెద్దవాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చిన రాజీ పడలేదు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Anushka Sharma: భారత్ గెలవగానే.. నా కూతురు ఆందోళన చెందింది: అనుష్క
Also Read
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
విద్యుత్ ను ప్రైవేటు రంగానికి అప్పగిస్తే…జీవితాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు మాజీ విద్యుత్తు శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ… “రేవంత్ రెడ్డి సర్కార్… మోడీ సర్కార్ కనుసన్నల్లో నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే తన వైఖరి అధికారికంగా స్పష్టం చేయాలి. లక్షల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ఎలా అప్పగిస్తారు. ఒడిశా లో వరదలు వస్తె…అక్కడ విద్యుత్ రంగం లో ఉన్న ప్రైవేటు కంపెనీ ఇబ్బంది పెట్టింది. ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లుల వసూలు కావడం లేదన్నది పూర్తి అసత్యం. ఓల్డ్ సిటీలో 90 శాతం విద్యుత్ బిల్లులు వసూలు అయ్యాయి. ఓల్డ్ సిటీ ప్రజలను అవమానించే రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. విద్యుత్ ప్రైవేటీకరణ ను బిఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నది. ప్రైవేటీకరణ కుట్రను అందరు కలసి అడ్డుకోవాలి. ప్రభుత్వం చార్జీల వసూల కోసం బౌన్సర్ లకు అప్పగిస్తుందా ?. రెవేన్యూ రికవరి కోసం గుండా గ్యాంగ్ లకు అప్పగిస్తారా ?. ప్రభుత్వం చేయలేని పని….ప్రైవేట్ వ్యక్తులు ఎలా చేస్తారు ?. ప్రజలను దొంగలు చేసే ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తుంది.” సంచలన వ్యాఖ్యాలు చేశారు.
తాజావార్తలు
-
Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
-
Ruturaj Gaikwad: ప్లేఆఫ్ రేస్ నుంచి చెన్నై ఔట్ అయ్యాక రుతురాజ్కు మరో షాక్!.. బీసీసీఐ భారీ జరిమానా
-
Jyotika: అందుకే తమిళ ఇండస్ట్రీకి వెళ్లా..చెన్నై నా జీవితాన్నే మార్చింది
-
Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!