United Nations: మోడీ పర్యటనతో రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు!.. ఐరాస చీఫ్ ఆశాభావం
- ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు
- యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ఐరాస చీఫ్ ఆశాభావం
- మీడియాకు తెలిపిన ఐరాస సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్కు చేరుకున్న ఆయనకు భారతీయ కమ్యూనిటీ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనితో కలిసి నేషనల్ మ్యూజియంకు ప్రధాని మోడీ చేరుకున్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో మరణించిన పిల్లలకు, నైనికులకు ఇద్దరు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్శనకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు వెలువడ్డాయి. ఇందులో ఇద్దరూ భావోద్వేగానికి లోనవడాన్ని చూడవచ్చు. ఉక్రెయిన్ అధ్యక్షుడి అధికారిక నివాసమైన మారిన్స్కీ ప్యాలెస్లో ప్రధాని మోడీ, అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ కానున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు మారిన్స్కీ ప్యాలెస్ను పూర్తిగా అలంకరించారు. కీవ్ పర్యటనకు మోడీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా వచ్చారు.
READ MORE: Suicide: ఫేస్బుక్ లైవ్లో కోర్టు భవనం నుంచి దూకి మహిళా న్యాయవాది సూసైడ్..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన దోహదపడుతుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ భావిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్న తరుణంలో ప్రధాని మోడీ పర్యటనపై ఓ మీడియా సంస్థతో డిజారిక్ మాట్లాడారు.
READ MORE:Pawan Kalyan: ప్రభుత్వ సభలో OG నినాదాలు.. పవన్ షాకింగ్ కామెంట్స్
డుజారిక్ మాట్లాడుతూ.. ‘చాలా మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ప్రాంతాన్ని(కీవ్) సందర్శించడం చూశాం. ఈ సందర్శనలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సంఘర్షణను పరిష్కరించడానికి దోహదపడతాయని ఆశిస్తున్నాం. మోడీ పర్యటన యుద్ధానికి ముగింపు పలికేందుకు దోహద పడుతుందని భావిస్తున్నాం. ” అని ఆయన పేర్కొన్నారు. కాగా.. యూఎన్జీఏ మూడు తీర్మానాలలో రష్యా దురాక్రమణను ఆపాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలపై దాడులను ఆపాలని మరో తీర్మానం డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదనలపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!