United Nations: మోడీ పర్యటనతో రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు!.. ఐరాస చీఫ్ ఆశాభావం
- ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు
- యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ఐరాస చీఫ్ ఆశాభావం
- మీడియాకు తెలిపిన ఐరాస సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్కు చేరుకున్న ఆయనకు భారతీయ కమ్యూనిటీ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనితో కలిసి నేషనల్ మ్యూజియంకు ప్రధాని మోడీ చేరుకున్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో మరణించిన పిల్లలకు, నైనికులకు ఇద్దరు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్శనకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు వెలువడ్డాయి. ఇందులో ఇద్దరూ భావోద్వేగానికి లోనవడాన్ని చూడవచ్చు. ఉక్రెయిన్ అధ్యక్షుడి అధికారిక నివాసమైన మారిన్స్కీ ప్యాలెస్లో ప్రధాని మోడీ, అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ కానున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు మారిన్స్కీ ప్యాలెస్ను పూర్తిగా అలంకరించారు. కీవ్ పర్యటనకు మోడీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా వచ్చారు.
READ MORE: Suicide: ఫేస్బుక్ లైవ్లో కోర్టు భవనం నుంచి దూకి మహిళా న్యాయవాది సూసైడ్..
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన దోహదపడుతుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి చీఫ్ భావిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్న తరుణంలో ప్రధాని మోడీ పర్యటనపై ఓ మీడియా సంస్థతో డిజారిక్ మాట్లాడారు.
READ MORE:Pawan Kalyan: ప్రభుత్వ సభలో OG నినాదాలు.. పవన్ షాకింగ్ కామెంట్స్
డుజారిక్ మాట్లాడుతూ.. ‘చాలా మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు ప్రాంతాన్ని(కీవ్) సందర్శించడం చూశాం. ఈ సందర్శనలు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) తీర్మానాలు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా సంఘర్షణను పరిష్కరించడానికి దోహదపడతాయని ఆశిస్తున్నాం. మోడీ పర్యటన యుద్ధానికి ముగింపు పలికేందుకు దోహద పడుతుందని భావిస్తున్నాం. ” అని ఆయన పేర్కొన్నారు. కాగా.. యూఎన్జీఏ మూడు తీర్మానాలలో రష్యా దురాక్రమణను ఆపాలని పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలపై దాడులను ఆపాలని మరో తీర్మానం డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదనలపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!