Suicide: ఫేస్బుక్ లైవ్లో కోర్టు భవనం నుంచి దూకి మహిళా న్యాయవాది సూసైడ్..
- ఫేస్బుక్ లైవ్ చేస్తూ మహిళా న్యాయవాది ఆత్మహత్య
- లక్నోలోని సివిల్ కోర్టులో ఘటన
- మూడో అంతస్తు నుంచి దూకి సూసైడ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫేస్బుక్ లైవ్ చేస్తూ మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకున్న ఘటన లక్నోలో జరిగింది. ఆమె సివిల్ కోర్టు మూడో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునడాన్ని చూసి లాయర్లు కాపాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. ఆమె కోర్టు భవనంపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను బలరాంపూర్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే.. ఫేస్బుక్ లైవ్లో న్యాయవాది మాట్లాడుతూ.. ‘నేను బతికుండగా నా మాట ఎవరూ వినలేదు. ఇప్పుడు నా మరణానంతరం.. నా అత్తమామల ఇంట్లో నా అంత్యక్రియలు చేయండి’. అని చెప్పి ఆత్మహత్య చేసుకుంది.
Pawan Kalyan: ప్రభుత్వ సభలో OG నినాదాలు.. పవన్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
వివరాల్లోకి వెళ్తే.. న్యాయవాది మాయా రావత్ (32).. ఇటౌంజలో నివాసి సతీష్తో వివాహం జరిగింది. దాదాపు పదేళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు నడుస్తున్నాయి. అయితే.. వాదించేందుకు మాయ గురువారం కోర్టుకు వచ్చింది. సాయంత్రం ఐదు గంటలకు ఆమె సివిల్ కోర్టులోని రెండు భవనాలను కలిపే వంతెనపైకి చేరుకుంది. అక్కడే నిలబడి ఆమె ఫేస్ బుక్ లైవ్ చేసింది. అనంతరం మూడో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. మహిళ దూకడం చూసి కోర్టు ఆవరణలో ఉన్న లాయర్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Asst Professor: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
ఫేస్బుక్ లైవ్లో మాయ మాట్లాడుతూ.. ‘నేను జీవించి ఉన్నప్పుడు నాకు విధేయులుగా ఎవరూ దొరకలేదని, కానీ నా మరణం తర్వాత నేను ఎవరినైనా కనుగొంటాను. నా కథ విని ఎవరైనా సానుభూతి చూపిస్తే.. నా అత్తమామలకు ఇచ్చిన కట్నం రూ. 1.5 లక్షల నగదు నా సోదరుడు ఇంద్రపాల్కి ఇవ్వాలి. నా అంత్యక్రియలు నా పొలంలోనే జరగాలని కోరుకుంటున్నాను. నా చికిత్స కోసం అన్నయ్య చాలా ఖర్చు చేశాడు. ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు. నా కోరికను నెరవేర్చండి. మరణానంతరం నా ఆత్మకు శాంతి కలుగుతుంది. అందరికీ నా చివరి నమస్కారాలు.’ అంటూ ఆత్మహత్య చేసుకుంది. కాగా.. మాయా రావత్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతుందని ఇన్స్పెక్టర్ వజీర్గంజ్ దినేష్ చంద్ర మిశ్రా తెలిపారు. కాగా.. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!